Monday 24 September 2012

ప్రజలు సహృదయంతో అర్ద్రం చేసుకోవాలి..


ఎక్కడో విన్నట్టుగా ఉందా మీకు పై వాక్యం చూసినపుడు....

ఇంకెవరండీ.. మన బొత్స గారు ఆర్టీసి చార్జీలు పెంపుదల సందర్బంగా చెప్పిన అపూర్వ మాటలవి...

మన్మోహన్ సింగ్ గారేమో డీజిల్ ను ధనవంతులు మాత్రమే వాడతారు.. మరియు ఖరిదైన కార్లకు మాత్రమే డీజిల్ వాడతారు. అలాంటప్పుడు ధనవంతులకు, వారు వాడే కార్లకు అవసరమయ్యే డిజీల్ కు రాయితీ యివ్వడం భావ్యమా? ధనవంతుల కొరకు సబ్బీడిలు యివ్వడం  అవసరమా? అని దేశంలో సామాన్యులందరి తరపున వకాల్తా పుచ్చుకొని అమాయకంగా అడిగారు... (కార్పోరేట్లకు, బడా కంపెనీలకు ఇష్టానుసారం ప్రభుత్వం యిచ్చే రాయితీల గురించి మాట్లాడకండి. మనకు తెలీదనుకుంటున్నారు కదా).

డిజీల్ ధర పెంపు వలన ధనవంతులకు మాత్రమే నష్టం అని తమ పార్టీ ప్రభుత్వం వారే అంటే, మరి బొత్స గారు సామాన్యుల నడ్డి విరిగేలా ఆర్టీసి చార్జీలు పెంచేసి, డిజీల్ ధరలు పెరగడం వలన,  చార్జీలు తప్పనిసరయి పెంచవలసివచ్చిందని సెలవిచ్చారు. మరియు ఈ చర్యని ప్రజలు సహృదయంతో అర్ద్రం చేసుకోవలసినదిగా కోరారు.

ఇంతకీ ప్రజలు అర్ద్రం చేసుకోవలసినది....

బొత్స వారి బాదుడు సామాన్యుల మీద వేసినందుకా లేక సింగ్ గారు చెప్పినట్లు ధనవంతుల మీద వేసినందుకా?

No comments:

Post a Comment