Showing posts with label రాజకీయ వ్యంగ్యాలు. Show all posts
Showing posts with label రాజకీయ వ్యంగ్యాలు. Show all posts

Thursday, 9 October 2014

రెండు కళ్ళ బాబు..


అరె.. నాయుడు ఎన్నాల్లయింది నిన్ను చూసి..

రారా.. చాలా కాలానికి గుర్తొచ్చినాను నేను అన్నా...

అదేమి లేదు అన్నాడు చిరునవ్వుతో.....

అదేంటో తెలీదు కానీ మా నాయుడు వస్తే లోకాభిరామాయణం అంతా ముందేసుకొని చర్చించలనిపిస్తుంది. దానికి తగ్గట్టే మనోడు కూడా మంచి హూషారు కల్గిన మనిషయే.. చూడ్డానికి సన్నగా పీలగా ఉన్నా మెదడులో ఉన్న సరుకు మాత్రం సామాన్యం కాదు.  ఇక మనకంటరా! చూడ్డానికి బలంగా బండగా ఉన్నా మెదడులో ఉన్న సరుకు నామమాత్రమే... ఆయినప్పటికీ ఏదో ఒకటి అరువు తెచ్చుకొని డిస్కషన్స్ పెడుతూ ఉండడం అలవాటయి పోయింది.

రెండు కళ్ళ సిద్దాంతం అంటే నాకు మన బాబే గుర్తుస్తున్నారు భయ్యా  అన్నాన్నేను...

తప్పేముంది బ్రదరూ.. మైక్రోసాప్ట్ అంటే బిల్ గేట్స్, రిలయన్స్ అంటే ముకేష్, అనిల్ అంబానీ, 2జి అంటే రాజా, అగస్ట్రా వెస్ట్ లాండ్ అంటే మహమేత, క్విడ్ ప్రో కో అంటే జగన్ గుర్తొచ్చినట్టుగా రెండు కళ్ళ సిద్దాంతమంటే బాబు గుర్తు రావడం వింతేముంది అన్నాడు..

ఏంది భయ్యా.. తెలంగాణా ఉద్యమం తారాస్దాయిలో ఉన్న టైములో ఎటూ పోవాలో తేల్చుకోలేని స్దితిలో రెండు కళ్ళు సిద్దాంతం వెలుగులోకి తెచ్చాడు కదా ఆ చంద్రబాబు. నాకు రెండు ప్రాంతాలు రెండు కళ్ళు లాంటివి. ఏ కన్ను కావాలి అని అడిగితే నాకు రెండు ముఖ్యమే అన్నాడుగా....

.......hmmm..

అప్పుడు బాబు చెప్పిందాని మీద అందరూ విరుచుకుపడ్డారు గ్గానీ, అందులో తప్పేముంది బానే చెప్పాడుగా అనుకున్నా.  రాష్ట్రం విడిపోతుందో, లేదో తెలియని డైలామాలో ఏదో ఒక ప్రాంతానికి అనుకూలంగా ఎలా మాట్లాడగలరు. అందుకే అట్టా చెప్పినాడు అని నాకు అర్ద్రం ఆయినట్టుగా వీళ్ళేవరికి అర్ద్రం కాక కూతలు కూస్తున్నారేటిరా సామి అని పీక్కున్నాను కూడా... అన్నాన్నేను...

ఆయితే ఏమంటావు, ఇప్పుడు.... అన్నాడు నాయుడు..

ఆ.. చెప్పడానికేముంది. రెండు కళ్ళు ముఖ్యమే అన్నవాడే ముందుగా తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చినాడు. పోనిలే అక్కడ సెంటిమెంటు తారాస్దాయిలో ఉంది కాబట్టి అక్కడి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి అట్నా లేఖ ఇచ్చాడు అనుకుందాం.  సెంటిమెంటుని గౌరవించి ఎలాగైనా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాల్సినదేనని ప్రతి కమిటీ ముందు సమర్దవంతంగా మొదటి నుండి చివర వరకు ఒకే మాటకి కట్టుబడి ఉన్నాడు. మిగతా పార్టిలు ఎన్ని డింగిరాలు తిరిగినప్పట్టికీ ఒకే స్టాండ్ మీద ఉన్నోడిలో మన బాబునే ముందుగా చెప్పుకోవచ్చు కదా...

ఆవును. అది నిజమే కదా.. ప్రధాన ప్రతిపక్ష పార్టిగా తెలుగుదేశం ఇచ్చిన లేఖ ఆధారంగానే రాష్ట్రం విభజనకి ఒప్పుకున్నమని అనాటి ప్రభుత్వ పెద్దలు కూడా పలు సందర్బాల్లో చెప్పారు.. అన్నాడు నాయుడు నా మాటల ప్రవాహాన్ని కొనసాగిస్తూ....

కదా.. రాష్ట్రం విభజనకి శక్తికొలదీ సాయం చేసిన ఆ చంద్రబాబు ఇప్పుడు మరల తెలుగుప్రజలను ఏనాటికైనా ఐక్యం చేసేది నేనే అంటాడేంది భయ్యా....

ఓ.. అదగ్గదా నీ ఆవేదన... నాకు అర్ద్రం ఆయిందిలేవెవోయి.... అన్నాడు తాపీగా

ఏమి అర్ద్రమవడం నా పిండాకూడూ.. వీడు రెండు కళ్ళ సిద్దాంతమంటే ఏమిటో ఇప్పుడు నాకస్సలు అర్ద్రమయి చావడం లేదు. ఆ రోజుమో వీరలెవెల్లో సిన్సియార్ గా ప్రయత్నం చేసి రెండు ముక్కలు చేయడం ఎందుకు! మరల ఈ నాడు తెలుగు ప్రజలను ఐక్యం చేస్తాననడం ఎందుకు?

ఇందులో అర్ద్రం కావడానికేముంది బ్రదరూ... ఆయనకి ఇక్కడ అధికారం దక్కింది. అక్కడ అధికారం అందని మావి ఆయింది. అందుకని ఇప్పుడు గులకరాళ్ళు అటు వేసే పనిలో బిజీగా ఉన్నాడు...

కావాలని పట్టుబట్టి తెలంగాణాని సాధించుకొని ఆంధ్రులంటే నిలువెల్లా విషాన్ని నింపుకుని, తమకు జరిగిన ప్రతి అన్యాయానికి వేలుని ఆంధ్ర వైపు చూపిస్తున్నా ఈ రోజుల్లో తెలుగు జాతి ఐక్యత అంటే చెప్పుచ్చుకు కొడతారు అక్కడ అన్నాన్నేను ముఖం నిండా అదో రకమైన ఫీలింగు ఉండగా....

నిజమే.. అ సంగతి మన బాబు పట్టించుకోవడం లేదు గానీ, తెలుగు జాతి ఐక్యత అంటే ముందుగా ఆంధ్రులే కొత్త బాటా చెప్పుతో అటూ, ఇటూ వాయించేలా ఉన్నారు. అంత దాకా రానిచ్చుకోడనే అనుకుంటాన్నేను అన్నాడు నాయుడు....

రానిచ్చుకో పోవడమేంటీ!! అక్కడ తన్నించుకొన్నది సరిపోక, ఇప్పుడు ఇక్కడ కూడా తన్నించుకోవడానికి ఊబలాటపడుతున్నట్టుంది అన్నా....
ఆయినా ఏమాటకా ఆ మాట.. విడిపోయినందు వలన మనం మొదట్లో కొద్దిగా బాధపడ్డాము(కలిసుండాలనే సెంటిమెంటు ఎక్కువయి) కానీ ఇప్పుడు మాత్రం చాలా హాయిగా, ధీమగా ఉన్నాము.(కలిసుండడం దండగమారి అని అర్ద్రమయి). ఇప్పుడు ఈయన వలన తిరిగి ఐక్యత సాధిస్తే కరెంటు కష్టాలు వాళ్ళకి పోయి మనకి తగులుకుంటాయి కదా...

అంతేనంటరా!!







Monday, 28 October 2013

వస్తున్నారు.. చూస్తున్నారు... వెళ్ళుతున్నారు...


పై చిత్రంను చూసారుగా......

“స్వాగతం...సుస్వాగతం.... 30వ వరద వార్షికోత్సహము... ప్రతీ సం.రం లాగే ఈ సం.రం కూడా మా E.B.C.కాలనీ వరదని తిలకించడానికి వస్తున్నా ప్రజాప్రతినిధులకు ఇదే మా స్వాగతం”..... అంటున్న వీరి కధ....

ఇది తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నుండి కత్తిపూడి వెళ్ళె నేషనల్ హైవేకి అనుకొని ఉన్న గొల్లప్రోలు గ్రామం.  ఏ మాత్రం ఎడతెరిపి లేకుండా ఒక రోజంతా వర్షం పడిందంటే, వరదలు పొంగి పొరలి ఈ గ్రామములో గల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం ఆయిపోవడం ఎన్నాళ్ళ నుండో రివాజుగా మారింది..

వరదలు వచ్చి ఈ కాలనీ మునిగిపోయినప్పుడల్లా ప్రజాప్రతినిధులు వెళ్ళి పరామర్శించి రావడం, అధికారులు అప్పటికి పునరావసం కల్పించడం మినహాయించి శాశ్వత నివారణకి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు....

వచ్చిన ప్రతి ప్రజాప్రతినిధికి, కనబడ్డ ప్రతి అధికారికి తమ గోడు చెప్పుకోవడం మినహాయించి వీరు ఏమి చేయలేకపోతున్నారు... అధికారులకు చేయాలంటే కొన్ని పరిమితులున్నాయి.. వాటిని తెంచుకొని చేయడమంటే మాటలు కాదు... కానీ అధికారాలన్ని తమ దగ్గర పెట్టుకొని కూడా వరద సమయాల్లో మాత్రమే కంటి తుడుపు చర్యగా ఇలా కనిపించి, అలా మాయమయిపోవడం పై గ్రామస్దులు తమ నిరసనని ఇలా తెలియజేసారు.

ఇది చూసాకైనా మన నాయకులు సిగ్గు తెచ్చుకుంటారంటారా???

ఏమో నాకైతే డౌటే...


ఈ లెక్కన కొత్త రాజధానికి ఎన్నేళ్ళు పడుతుంది?- పోటో కామెంట్



విభజన అనివార్యమంటున్న సీమాంధ్ర రాజకీయ నాయకులు చెబుతారా? లేక  గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీరు చెపుతారా దీనికి సమాధానం?? లేక మీ సోనియమ్మని అడిగి కనుక్కొని చెబుతారా?

Tuesday, 2 July 2013

సదా మీ సేవలో... మీ ప్రియమైన ముఖ్యమంత్రి...


 
కేంద్ర హోమ్ శాఖ నుండి ఫోన్ రింగయ్యింది కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు ఆఫీసునకు.....

 

ఆ కాల్ అందుకున్న సెక్రటరీ వెంటనే కికురె (కిరణ్ కుమార్ రెడ్డి) వద్దకు వెళ్ళి కాల్ సారాంశం చెప్పగానే మన కికురె గారి కళ్ళు ఇంతలు ఆయినాయి... అదెలా సాధ్యం అనుకుంటూ బుర్ర బద్దలుకొట్టుకున్నాడు... నాకు తెలియకుండానే పరిపాలనలో ఎవరైనా జోక్యం చేసుకొని కధనం నడుపుతున్నారా అన్న అనుమానం.....

 

వెంటనే కికురే ఒక నిర్ణయానికి వచ్చాడు... కేంద్ర హోమ్ శాఖ నుండి వచ్చిన ఫోన్ కాల్ యొక్క విషయమై వెంటనే రిపోర్టు కావాలని తన నమ్మకస్దులకు పురమాయించాడు...

 

క్యాంపు హౌస్ లో తన గదిలో కూర్చుని అలోచించసాగాడు. సెక్రటరీ చెప్పిన మాటలను మరోసారి మననం చేసుకున్నాడు కికురె...

 

హోమ్ శాఖ ఫోన్ సారాంశం..

“ గత సం.ము కాలమునకు పైగా ఆంధ్రప్రదేశ్ లో దొంగతనాలు, దోపిడిలు శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టి దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఘనత సాధించినందుకు ఉత్తమ భద్రత ఆవార్డ్ ని మన రాష్ట్రానికి ప్రకటించారు. దానిని అమోరికా అధ్యక్షుడు చేతుల మీదుగా అందుకోవలసినదిగా తెలియజేసియున్నారు”

 

తన ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు కికురె... తానెప్పుడూ రాష్ట్రంలో దోపిడి దొంగల నిరోధానికి మరియు భద్రత విషయమై పోలిసు బాసుతో కూర్చుని ఎటువంటి ఆదేశములు జారీ చేసినట్టుగా గుర్తు లేదు. కనీసం దాని గురించి ఆలోచన కూడా నాకు వచ్చియుండలేదు అనుకున్నాడు!

లేక తాను చీటికిమాటికి ఢిల్లీకి, హైదరబాదుకు కాలి కాలిన పిల్లిలా తిరుగుతుంటే, దానిని అదనుగా తీసుకొని తనకి తెలియకుండా ఉప ముఖ్యమంత్రి పోలిసు బాసుతో కుమ్మక్కు ఆయి చాటుమాటుగా ఇలాంటి పనికిరాని పనులు చేస్తున్నారా అన్న అనుమానం బయలుదేరి, వెన్నులో కొద్దిగా చలి పుట్టింది.. ఇది చివరకు తన పదవికే ఎసరు పెట్టేలా ఉందనుకొని, తాను పంపిన నమ్మకస్దుడు తెచ్చే సమాచారం కోసం అతృతగా ఎదురుచూడసాగాడు.....

 

పొద్దు పోయాక రాత్రి ఎప్పుడో 11 దాటుతుండగా సదరు నమ్మకస్దుడు వచ్చాడు. అతృతగా అతను ఏమి చెప్తాడో అని అవయువలన్నీ అన్ని అలర్ట్ లో పెట్టుకొని రెడీగా ఉన్నాడు కికురె.

 

అతని ముఖం చూస్తే అందోళనగా ఉన్నట్టుగా కనబడడం లేదు.... పైగా కొద్దిగా వెటకారం లాంటిదేదో ముఖంలో కనబడుతుండేసరికి కొద్దిగా అసహనం ఫీలయ్యాడు కికురె... ఆయినా అవసరం తనది కనుక మిన్నకుండిపోయాడు....

 

చెప్పవయ్యా బాబూ అని అడిగాడు కాదు అరిచాడు...

 

“ అయ్యా, మీరనుకొన్నట్టు తెర వెనకాల మీకు తెలియకుండా ఏమి జరిగిపోవట్లేదు!” తాపీగా సమాధానమిచ్చాడు...

 

అలా ఆయితే మన రాష్ట్రంలో ఒక్క సారిగా దొంగతనాలు ఎందుకు తగ్గుముఖం పట్టాయి! అసహనంగా అడిగాడు కికురె....

 

“అదా సారు,, ఏమి లేదు సారు... వాతావరణ శాఖ వాడు వర్షం ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు పడదో చెప్పలేరన్నట్టుగా తమరు రాష్ట్రంలో  కరెంటు కోతలు ప్రకటించడంతో, అది కూడా రాత్రుళ్ళు సమయ, సందర్బాలు లేకుండా కరెంటు తీసేయడంతో నిద్రలు పట్టక, ఇళ్ళలో ఉండలేక జనాలు రోడ్ల మీద ఆటలు అడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటున్నారట... ఇలా జనాలు మెలకువగా ఉంటే దొంగలు దోపిడిలు చేయడానికి ఎలా వెళ్తారు. అందుకనే రాష్ట్రంలో మీ కరెంటు కోతలు పుణ్యమాని జనాలు నిద్రలు మానుకొని మెలకువగా ఉండేసరికి ఒక్కసారిగా దోపిడిలు శాతం తగ్గిపోయింది!! అది తెలియని కేంద్రం వోడు అదంతా మీ ఘనత అనుకొని మీకు అవార్డ్ ప్రకటించి యుంటారు” అని తేల్చేశాడు....

 

కికురె బుర్రలోంచి ఆలోచనలు తన్నుకుంటు వస్తున్నాయి.... క్లారిటీ రావడమే తరువాయి అన్నట్టుగా ఉంది ఆయన ముఖం....

 

వెంటనే ఛీప్ సెక్రటరీకి ఫోన్ చేసాడు... కరెంటు కోతల పధకానికి చట్టబద్దత కల్పించడానికి అవనసరమైన విధివిధానాలు రూపొందించి రేపటికి తన టేబుల్ మీద ఉండాలని అక్కడక్కడే ఆదేశాలు జారీ చేసిపడేశాడు కికురె....

 

తర్వాత తన గదిలోకి పోయి హాయిగా పడుకున్నాడు.....

 

అదే సమయంలోనే  రాష్ట్రంలో ప్రజలు కరెంటు లేక  జనాలు నిద్దరోవక ఎప్పటిలాగే కబుర్లు చెప్పుకుంటూ, ఆటలు ఆడుకుంటూ గడిపేస్తున్నారు...

 

దోపిడి దొంగలు ఇక ఇక్కడ గిట్టుబాటు కాక వేరే రాష్ట్రాలకు వలస పోయారు....