Thursday 29 May 2014

విద్యార్హతలు


హెచ్.బి.వో. చానల్లో వస్తున్న అదేదో ఇంగ్లీషు సినిమాని చూస్తున్నా. ఇంతలో నా మెబైల్ ఫోన్ రింగు ఆవుతుంటే ఎవరా అని అనుకుంటూ ఫోన్ అందుకున్నాను. ఫోన్ డిస్ ప్లే మీద నవ్వుతూ ఉన్న నాయుడు పోటో కనిపించింది. తన ఫోన్ కాల్ ను చూడగానే నా పెదవుల మీద చిన్నగా ఆనందంతో కూడిన చిరునవ్వు మెదిలింది...

చాలా కాలం తర్వాత తన నుండి నాకు ఫోన్ రావడం..  తాను, నేను కల్సి రెండేళ్ళు ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. ఆ సమయంలో ఎన్నో విషయాలు తన నుండి నేర్చుకున్నాను. పలు విషయాల గురించి ఇద్దరము కల్సి చర్చించుకొనేవాళ్ళం. నాకు సంబందించిన అన్ని విషయాలను తనతో చర్చిస్తాను.  నాకు మనసుకి బాగా దగ్గరయిన స్నేహితుడు కావడం కూడా నా అనందానికి ఒక కారణం.

వరుసబెట్టి ఎన్నికలు రావడంతో గత మూడు నెలల నుండి సావకాశమనెదే లేకుండా పోయింది. నాయుడు కూడా ప్రస్తుతం ఎటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ లేకపోవడంతో స్వగ్రామంలోని ఇంటికి వెళ్ళిపోయాడు.... ఇదిగో మరల మూడు నెలల తర్వాత ఖాళీ సమయంలో నాయుడు ఫోన్ చేయడం ఇదే..

ఫోన్ లిప్ట్ చేసి, ఎక్కడ బాబూ... ఇన్నాళ్ళకు ఖాళీ దొరికిందా నాయనా నీకు అని నిష్టూరమడాను..
నిన్నే వచ్చాను కాకినాడ... నీవు ఎక్కడ అని అడిగాడు అవతల్నించి...
ఇంట్లో ఉన్నాను. మరేమి మాట్లాడకుండా తిన్నగా ఇంటికి వచ్చేయి అర్డరేసాను..
అలాగే!! అని చెప్పి ఫోన్ కట్ చేసాడు...

చెప్పినట్టుగానే పావు గంటలో ఇంటికి వచ్చి కూర్చున్నాడు../  యెగక్షేమాలు అవి మాట్లాడుకున్న తర్వాత సాయం సమయం కావడంతో అలా బయటకు నడుచుకుంటూ వెళ్ళి కుళాయి చెర్వు వద్ద గల వివేకానంద పార్కుకి వెళ్ళి లోపల కూర్చున్నాము.

ఏంటీ.. చదువులు ఎలా సాగుతున్నాయి? అడిగాన్నేను....
ప్రస్తుతానికి ఏమి చదవట్లేదు... కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ జారీ చేయాలి. అప్పుడే మొదలెట్టాలి చదువులు మరల... అప్పటి వరకు ఖాళీనే అన్నాడు....

ఆవునూ.. చదువంటే గుర్తుకొచ్చింది, మానవ వనరులు శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు గురించి కాంగ్రెసు ఏంటి అలా రాద్దాంతం చేస్తుంది? ఆయినా ఎంతో విశిష్టత కల్గిన ఆ శాఖను స్మృతి ఇరానీకి ఎలా కేటాయించగలిగారు. తాను ఆ శాఖ ద్వారా ఏమైనా ఇంప్రూవ్ మెంట్ తేగల సమర్దత ఉంది అంటవా? అని అడిగాను...

ఆ కాంగ్రెసు నాయకుల బుర్ర ఆ స్దాయి వరకే పనిచేస్తుంది. వారు ఇలాంటి చిల్లర విషయాలు వరకే అలోచిస్తారు. ముందు వాళ్ళ నాయకి సోనియా, రాహుల్ విద్యార్హతలు గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అన్నాడు .... ఒకవేళ మర్చిపోయింటే సుబ్రమణ్యస్వామిని అడిగితే బాగా క్లారిటి వస్తుంది వారికి!! అన్నాడు నాయుడు.

అదేంటి!! అలా ఎందుకనుకోవాలి! వారు ఒక వ్యక్తి సమర్దత గురించి మాట్లాడినపుడు, సదరు వ్యక్తికి సమర్దత ఉందో, లేదో తెలియజెప్పాలి కానీ, ఇలా తిరిగి ఎదురు ప్రశ్నిస్తే ఎలా? అన్నాన్నేను..

అసలు ఇలాంటి చెత్త సంప్రదాయం తెచ్చిందే కాంగ్రెసు వారు. ఇప్పటి వరకు వారి హయంలో జరిగిన తప్పులను ప్రతిపక్షాలు ఎత్తి చూపితే, సంబంధం లేని చెత్త విషయాలను తెరపైకి తెచ్చి ఎదురు దాడికి దిగడం వారికే చేతనయింది! అన్నాడు...

సరేలే.. వారి విషయం వదిలేద్దాం... మన విషయానికి వద్దాం... ఇంతకి స్మృతి ఇరానీ సరయిన ఛాయిస్సేనా,  కాదా చెప్పు! అన్నా...

ఎందుకు చేయలేదు. నిక్షేపంగా చేయగలదు. ఆ నమ్మకం ఉంది కాబట్టే నరేంద్ర మోడీ ఆ శాఖను కట్టబెట్టాడు! అన్నాడు నాయుడు...

అదెలా, అవిడ గతములో సౌందర్య ఉత్పత్తులు అమ్ముకొనే స్దాయి నుండి మెడల్ గా, తర్వాత టి.వి. నటిగా కొనసాగి రాజకీయాల్లోకి వచ్చింది. అంతే తప్ప అవిడకి ఎటువంటి రాజకీయానుభవం కానీ, యితర అనుభవం కానీ లేవు కదా అన్నాను. అసలు ఆ శాఖకు సంబందించి కనీస అవగాహన ఆయినా ఉండాలి కదా... పెద్ద పెద్ద చదువులు చదివి మేధావులనిపించుకున్నవారు కూడా ఆ శాఖ ద్వారా దేశ విద్యావ్యవస్దలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయారు కదా! అన్నానేను...

చూసావుగా పెద్ద పెద్ద చదువులు వెలగబెట్టి మేధావులనిపించుకొన్న వారు కూడా ఏమి చేయలేకపోయారని నువ్వే ఒప్పుకున్నావు కదా... ఇక అలాంటప్పుడు ఆ శాఖ ఎవరికి ఇస్తే ఏంటబ్బాయి. గమ్మున పడుకొనుందాము మనం.

నిజమే.. ఇప్పటి వరకు ఎంతో మంది మేధావులు మానవ వనరుల శాఖని చేపట్టారు. వ్యవస్దలో ఎటువంటి ప్రమాణాలు మెరుగుపర్చడం కాదు కదా ఇంకా దిగజార్చడం మాత్రం జరిగింది.. ఈ నాడు దేశంలో పలు సాంకేతిక విద్యాలయాల నుండి వస్తున్న విద్యార్దుల్లో కనీసం పది శాతం మాత్రమే తమ కంపెనీ అవసరములకు తగ్గ సాంకేతిక సామర్ద్యం కల్గి ఉంటున్నారనీ, మిగతా వారందరికీ మరల ప్రత్యేక శిక్షణ యివ్వడం ద్వారా తయారుచేసుకోవల్సి వస్తుందని పలు సందర్బాల్లో పేర్కోనడం జరిగింది.  మారుతున్న ప్రపంచీకరణకి అనుగుణంగా నేటి విద్యావ్వవస్దని అందలి పాఠ్యాంశాలను పూర్తిగా మార్చవలసిన అవసరమున్నప్పట్టికి, అందులో ఎటువంటి పురోగతిని సాధించకపోవడం ద్వారా యువతని ఎందుకూ పనికి రాని అసమర్దులుగా తయారుచేస్తుంది.  
అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న ఐ.ఐ.టి, ఖరగ్ పూర్ లాంటి విద్యాలయాలను దేశమంతతా విస్తరించజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ దిశగా ఏ ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నట్టుగా కనిపించడం లేదు. భారతీయ విద్యార్దులు చాలా తెలివైనవారు. కానీ వారిని మెరికల్లా తయారుచేయగల సంస్దలు చాలా తక్కువుగా ఉండడమే ప్రధాన సమస్య అని చాలా మంది నమ్ముతున్నారు.

చివరగా నాయుడు ఒక మాట చెప్పాడు.. మన దేశంలో ఎదుగుదల అనేది ఒక చదువు ద్వారా మాత్రమే రాదు. రెండు పి.జి.లు చేసిన మన కన్నా, మన ఊర్లో టెన్త్ ఫెయిల్ ఆయిన సుబ్బుగాడు మంచి పోజిషన్ లో ఉన్నాడు. ఎందుకంటే వాడు చదువుకోకపోయినా బ్రతకడానికి కావలసిన కిటుకలు తెల్సుకొన్నాడు. కానీ మనలా చదువుకున్నవారికి బ్రతకడానికి కావలసిన కిటుకలు ఏ పాఠాలు చెప్పవు.. అంతెందుకు మన చదువుల ద్వారా మనం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే సంపాదించుకోగలము తప్ప... ఇంకేమి చేయలేము.. అన్నాడు...

ఆలోచించాను.. నేను చదువుకున్న పాఠాలు నుండి కానీ, సంపాదించిన సర్టిఫికెట్టుల నుండి కానీ నిజ జీవితంలో బ్రతకడానికి కావల్సిన కిటుకలు నేర్పించయా అని!! ఎంత ఆలోచించిన మచ్చుకు ఒక్కటి కూడా కనబడలేదు నాకు... ఒక్క కూడికలు, తీసివేతలు లాంటి రెండో తరగతిలో నేర్చుకున్నవి తప్ప....

నేను చదివిన చదువంతా కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడానికి మాత్రమే ఉపయెగపడ్డాయి.. సర్టిఫికెట్టులు ఉద్యోగంలో జాయినయినప్పుడు గేటుపాసులాగా ఉపయెగపడింది తప్పితే మరల ఇప్పటివరకు పనికి రానేలేదు......

మరి అలాంటప్పుడు స్మృతి ఇరానీ మంత్రి అవడంలో తప్పు ఏమి కనిపించడం లేదు. అంటే నా ఉద్దేశం ఆవిడ గత నేపధ్యంను పరిగణనలోకి తీసుకొని ఆవిడ సమర్దతని అంచనా వేయడం తప్పు. సమర్దతకి కొలమానం విద్యార్హత ఎంత మాత్రం కాదని చెప్పగలను.... స్మృతి ఇరానీ కూడా ఆ శాఖ నిర్వహణలో తన పనితీరుని చూడమని, తన విద్యార్హతలు కాదని చెప్పడం ద్వారా కాంగ్రెసుకు సరయిన సమాధానం ఇచ్చింది....

వేచిచూడాలి.. ఎలాఉంటుందో....



Wednesday 21 May 2014

నో కాంప్రమైజ్..


నరేంద్ర మోడీ సాధారణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రధాని పదవిని అదిష్టించబోతున్న ఈ సమయంలో పాక్ పట్ల భారత్ చేపట్టబోయే వైఖరిని తెలియజేస్తూ సామాజిక అనుసంధాన వేదికల్లో కొంత మంది ఔత్సాహిక యువకులు పలు జోకులు పేలుస్తున్నారు.

అందులో మచ్చుకు ఒకటి...


పాకిస్తాన్ రక్షణ శాఖ మీడియాతో :  “ఇకపై జమ్మూ కాశ్మీర్ విషయంలో మా దేశ వైఖరి పూర్తిగా మార్చుకుంటున్నాము. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్బాగం అనడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అలాగని కరాచీ విషయంలో మాత్రం మేము వెనక్కి తగ్గేది లేదు.” 

విరామం తర్వాత..


ఈ సంవత్సరం నా పోస్టుల మధ్య విరామం చాలా ఎక్కువయిపోయింది. అలాగని బ్లాగ్ ప్రపంచంలో ఎలాంటి కల్లోలం జరగలేదనుకొండి. కాకపోతే నా సోది వినే(చదివే) బాధ బ్లాగర్లకు తగ్గిందని అనుకుంటున్నాను.(అనుకోవడమేంటి నిజమే)...  పోస్టులు రాయడం మాత్రమే కాదు బ్లాగులు చదవడం కూడా బాగా తగ్గిపోయింది. దానితో అనుభవజ్ణులైన బ్లాగర్ల యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఈ మధ్య కాలములో మిస్ అవడం జరిగింది.. అసలే అన్ని రకాల ఎన్నికలు ఒక్కసారే వచ్చి జరిగిన సమయం. ఇలాంటి సమయంలో పలు బ్లాగర్లు యొక్క అనుభవాలను, ఆలోచనలను, సలహలను మిస్ అయ్యాననే ఫీలింగ్ ఉంది.

ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలు రాజకీయపార్టిల పరంగా విడిపోయి ఏదొ ఒక పార్టి తరపున వకల్తా పుచ్చుకొని ప్రచారం చేయడంతో కొంత అయెమయం గురయిన సంధర్బాలు చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో బ్లాగులను పరిశీలించడం ద్వారా అసలైన విషయ పరిజ్ణానంను తెలుసుకోవడానికి అవకాశం ఉండేది.
కానీ ఈ సారి రాజకీయ పార్టిల గురించి, వాటి మేనిపేస్టొ గురించి గాని లేదా యితర అంశాలు గురించి కాని పట్టించుకొనే తీరికే దొరకలేదు. ఎందుకంటే స్దానిక సంస్దల ఎలక్షన్స్ ఆ తదుపరి జరిగిన సాధారణ ఎన్నికల సన్నద్దతలో భాగంగా రాత్రింబవళ్ళు పనిచేయవలసివచ్చింది. చాలా మందికి ఎన్నికల పోలింగు నాడు మరియు కౌంటింగ్ నాడు జరిగిన తతంగం మాత్రమే తెలుస్తుంది. కాని ఆ ఎన్నికల జరపడానికి కావలసిన సన్నద్దత కోసం సుమారు మూడు నెలల నుండే కసరత్తు జరుగుతుందని చాలా మందికి తెలిసే అవకాశం లేదు. జనవరి నెల నుండి మొదలయిన మా పని నిరంతరంగా మొన్నటి సాధారణ ఎన్నికల కౌంటింగ్ పూర్తయి, నేటి వరకు సాగుతునే ఉంది. ఈ మధ్యలో మాకు ఇక ఎటువంటి ఇతర వ్యాపకాలు మీద దృష్టి పెట్టగలిగే అవకాశమే రాలేదు. ప్రస్తుతం అన్ని రకాల ఎన్నికలు పూర్తయినందున ఇదిగో మరల ఇలా తీరిగ్గా కూర్చూని రాయగలిగే సమయం దొరికింది.

ఎన్నికల్లో మోడీ ఘనవిజయం, చంద్రబాబు విజయం, కాంగ్రెసు పరాజయం, జగన్ ఆశలు ఆవిరి ఆయిన సంద్బరాలు ఇలాంటి వాటి గురించి నా అభిప్రాయాలు పంచుకోవడానికి కుదరలేదు. పోని ఇప్పుడు రాద్దామంటే సదరు అంశాలు పాతపడిపోయాయి.

పి.ఎస్: చాలా రోజుల తర్వాత కదా రాయడం.. అసలు ఏమి రాయాలో పాలుపోలేదు. ఏదో కష్టపడి ఈ నాల్గు ముక్కలు రాయగలిగాను. ఈ పోస్టు ద్వారా డిస్పాయింట్ ఆయిన వారందరికి క్షమాపణలు...