Friday 31 October 2014

రెహనా – అఖరి కోరిక



రెహనా విషాదంతం గురించి “పని లేక” బ్లాగులో ఇదివరకే డా.రమణ గారు ప్రచురించారు. ఆయితే రెహనా స్వయంగా తన తల్లికి పంపించిన వాయిస్ మెసెజ్ పూర్తి స్దాయిలో చదివిన తర్వాత చాలా చలించిపోయాను. మన భూమ్మీదే నరకం అంటే ఎలా ఉంటుందో రెహనా స్వయముగా చెప్పిన భావాలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

నరకం ఎక్కడో లేదు. ఇక్కడే ఉంది. మన భూమ్మీదే ఉంది.  ఇరాక్ లో ఆయితే ఇంకా గొప్పగా ఉంటుంది. రెహనా మాటల్లో.......

రేప్‌ చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని ఆత్మరక్షణలో భాగంగా హతమారిస్తే అది మన దేశంలో నేరం కాదు. కానీ ఇరాన్‌లో అతి పెద్ద నేరం. దానికి శిక్ష ఉరి. ఇలాంటి కేసులో రెహనా జబ్బారీని గత వారం ఇరాన్‌లో ఉరి తీసారు. ఇస్లామిక్‌ షరియత్‌ చట్టాలు అమలులో ఉన్న ఇరాన్‌లో జరిగిన ఈ సంఘటనపై అంతర్జాతీయంగా పెనుతుపాను చెలరేగింది. ఈ నేపథ్యంలో- తనకు మరణ శిక్ష పడిందని తెలిసిన తర్వాత రెహనా తన తల్లికి ఒక వాయిస్‌ మెసేజ్‌ను పంపింది. గత శనివారం ఆమెను ఉరితీసిన తర్వాత అధికారులు దీనిని విడుదల చేశారు. భగవంతుడి న్యాయస్థానంలో మనం ముద్దాయిలం కాదు అని తన తల్లికి ధైర్యం చెప్పటానికి ప్రయత్నించిన రెహనా తన శరీర అవయవాలను దానం చేయమని కూడా కోరింది. కరుడుగట్టిన హృదయాలను సైతం కరిగించే ఆమె పంపిన సందేశానికి తెలుగు అనువాదమిది..

డియర్‌షోలి, నేను క్విసాస్‌ (ఇరాన్‌ న్యాయవ్యవస్థలో ఒక అంశం)ను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయిందనే విషయం ఈ రోజే నాకు తెలిసింది. ఈ విషయాన్ని నువ్వే నాకు చెప్పి ఉండాల్సింది. నా జీవితంలో ఆఖరి అధ్యాయానికి చేరుకున్నానని తెలిసిన తర్వాత నువ్వు నాకు ఈ విషయం చెప్పకపోవటం బాధ కలిగించింది. నాకు ఈ విషయం తెలుస్తుందని నువ్వు అనుకోలేదా? నువ్వు విషాదంగా ఉన్నావనే ఆలోచనే నన్ను ఇబ్బంది పెడుతోంది.. నీ చేతిని, నాన్న చేతిని ముద్దాడే అవకాశాన్ని నాకు ఎందుకు ఇవ్వలేదు.? ఈ ప్రపంచం నన్ను 19 ఏళ్లు బతకనిచ్చింది. నన్ను చంపేసి నా శరీరాన్ని నగరంలో ఏ మూలో విసిరేసి.. కొద్ది రోజుల తర్వాత మార్చురీలో నా శవాన్ని గుర్తించమని నిన్ను తీసుకువెళ్లేవారు. నన్ను రేప్‌ చేశారనే విషయం కూడా నీకు అప్పుడే తెలిసేది. నన్ను చంపిన వ్యక్తి ఎవరో కూడా ఎవ్వరికి తెలిసి ఉండేది కాదు. ఎందుకంటే- వాళ్ల దగ్గర ఉన్నంత సంపద, శక్తి మన దగ్గర లేదు. ఆ తర్వాత నువ్వు సిగ్గుతో తలదించుకొని జీవితాన్ని గడపాల్సి వచ్చేది.. అలా గడిపి.. గడిపి.. బాధతో కొన్ని రోజుల తర్వాత నువ్వు కూడా మరణించి ఉండేదానివి. కథ అక్కడితో ముగిసిపోయి ఉండేది. 

అయితే ఒక్క దెబ్బతో మొత్తం కథంతా మారిపోయింది. నా శరీరాన్ని నగరంలో ఏ మూలో పడేయలేదు. మొదట ఈవిన్‌ జైలులోను, ఇప్పుడు శ్మశానంలాంటి షరార్‌ ఈ రే జైలులోను ఉంచారు. అయితే ఈ విషయాలు వేటికీ నేను ఫిర్యాదు చేయదలుచుకోలేదు. జీవితానికి మరణం ఒకటే ముగింపు కాదనే విషయం నీకు కూడా తెలుసు. ఈ ప్రపంచంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కొన్ని అనుభవాలను సంపాదించుకోవటానికి, కొన్ని గుణపాఠాలు నేర్చుకోవటానికి, కొన్ని బాధ్యతలు నెరవేర్చటానికి వస్తాడని నువ్వు నాకు చెప్పేదానివి. ఈ ప్రయాణంలో కొన్ని సార్లు మనం పోరాడాల్సి వస్తుందనే విషయాన్ని నేను నేర్చుకున్నా. నన్ను ఒక వ్యక్తి కొరడాతో కొట్టినప్పుడు అక్కడే ఉన్న మరొక వ్యక్తి ప్రతిఘటించాడు. అతనిని కూడా కొరడాతో కొడితే ఆ దెబ్బలకు అతను మరణించాడని నువ్వు నాకు చెప్పావు. ఒక వ్యక్తి చనిపోయినా పర్వాలేదు.. కానీ ఈ మరణం వెనకున్న కారణం, దానికున్న విలువ గురించి అందరికీ తెలియాలి.

స్కూలుకు వెళ్లినప్పుడు, దెబ్బలాటలు వస్తాయని.. ఫిర్యాదులు చేస్తూ ఉంటారని- వాటిని మనం ఎదుర్కోవాలని నువ్వు చెబుతూ ఉండేదానివి. మా ప్రవర్తనకు నువ్వు ఎంత ప్రాధాన్యం ఇచ్చేదానివో గుర్తుందా? అయితే నీ అనుభవం తప్పు. నన్ను ఒక వ్యక్తి రేప్‌ చేయటానికి ప్రయత్నించినప్పుడు నీ పాఠాలేమి పనిచేయలేదు. కోర్టులో హంతకురాలిగా చిత్రీకరించినప్పుడు అవి నన్ను కాపాడలేదు. కోర్టులో నన్ను ఒక హంతకురాలిగా చిత్రీకరించారు. నేను కోర్టులో ఏడ్వలేదు. నన్ను క్షమించమని ప్రాధేయపడలేదు. నేను న్యాయాన్ని నమ్మాను. అందుకే ఒక్క కన్నీరు బొట్టు కూడా కార్చలేదు. నేను ఎప్పుడూ దోమలను కూడా చంపలేదని నీకు తెలుసు. బొద్దింకలను కూడా వాటి మీసాలు పట్టుకొని బయటపడేసేదాన్ని. అంతే తప్ప చంపేదాన్ని కాదు. అలాంటి నేను ఇప్పుడు ఒక కరుడుకట్టిన హంతకురాలిని అయిపోయాను. నాపై రకరకాల ఆరోపణలు మోపారు. న్యాయమూర్తుల దగ్గర నుంచి న్యాయం ఆశించటం కూడా ఆశావాద థృక్పథమేమో అనిపిస్తుంది. న్యాయమూర్తి నన్ను ఎటువంటి ప్రశ్నలు వేయలేదు. నన్ను ఇంటరాగేషన్‌ సమయంలో కొడుతున్నప్పుడు.. అత్యంత హీనంగా దుర్భాషలాడుతున్నప్పుడు ఎవ్వరూ నా వైపు మాట్లాడలేదు. నా అందానికి చిహ్నంగా నేను భావించే జుట్టును తీసేసి గుండు చేయించినప్పుడు నాకు దక్కిన బహుమానం ఏమిటో తెలుసా- జైలులో 11 రోజుల ఏకాంత నిర్భందం.

ఇదంతా వింటూ నువ్వు ఏడవకు. మొదటి రోజు పోలీసు ఆఫీసులో ఒక పెళ్లికాని ముసలి పోలీసు నా గోళ్లను విరిచేశాడు. అప్పుడు అందాన్ని ఇక్కడ హర్షించరనే విషయం అర్థమయింది. ఒక అందమైన ఆకృతి, అందమైన ఆలోచన, అందమైన భావన, అందమైన రాత, అందమైన చూపు, అందమైన గొంతు- వీటి వేటికి ఇక్కడ విలువ లేదు. అమ్మా, నా ఆలోచనా విధానం మారిపోయిందేమిటా అనుకోకు. దానికి నువ్వు బాధ్యురాలివి కావు. నా మనసులోంచి అనేక మాటలు ప్రవాహంలా వస్తున్నాయి. నువ్వు లేకుండా, నీకు తెలియకుండా నన్ను ఉరితీసినప్పుడు- నా జ్ఞాపకాలుగా నీకు మిగిలేవి ఈ మాటలే. నేను మరణించే ముందు నాదో కోరిక.. నీ శక్తిమేరకు దాని కోసం ప్రయత్నించు. నేను నిన్ను, ఈ దేశాన్ని కోరేది ఇదొక్కటే. దీనిని సాధించాలంటే కొంత సమయం పడుతుందని నాకు తెలుసు. అమ్మా.. ఏడవకు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఒక విల్లు రాయాలనుకుంటున్నా
. జైలులో ఉత్తరం రాయాలన్నా అధికారి అనుమతి కావాలి. అందువల్ల నువ్వు కోర్టుకు వెళ్లి నా తరపున అభ్యర్థనను వారి ముందు ఉంచు. నా వల్ల నువ్వు కూడా బాధపడుతున్నావనే భావనే నన్ను ఇబ్బంది పెడుతోంది. అమ్మా.. నేను నిన్ను అభ్యర్థించేది ఇది ఒక్కటే. కోర్టులో నాకు శిక్ష వేయవద్దని న్యాయమూర్తులను అభ్యర్థించమని చాలా సార్లు చెప్పావు. కానీ నేను అంగీకరించలేదు. కానీ నా ఈ చివరి అభ్యర్థనను మాత్రం నువ్వు మన్నించాలి. అమ్మా.. నువ్వు నాకు నా జీవితం కన్నా ఎక్కువ. అందుకే నువ్వు నాకీ పని చేసిపెట్టాలి. మరణించిన తర్వాత నా శరీరం మట్టిలో కలిసిపోకూడదు. నా అందమైన కళ్లు, చలాకీగా పనిచేసే నా గుండె ఎందుకూ పనికిరాకుండా పోకూడదు. అందువల్ల- నన్ను ఉరితీసిన వెంటనే నా గుండె, కాలేయం, కళ్లు- ఇలా- అవయవ మార్పిడికి పనికొచ్చే అవయవాలన్నింటినీ ఈ ప్రపంచానికి నా బహుమతిగా ఇచ్చేయండి. అవి అమర్చిన వారికి నా పేరు తెలియనివ్వకండి. అంతే కాదు. నాకు నువ్వు సమాధి కట్టద్దు. దాని దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేసి నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. నా కోసం నువ్వు నల్లబట్టలు వేసుకోవటం నాకు ఇష్టం లేదు. నేను కష్టపడిన రోజులన్నీ మర్చిపోవటానికి ప్రయత్నించు.

ఈ ప్రపంచం మనల్ని ప్రేమించలేదు. అందుకే నేను మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నాను. భగవంతుడి న్యాయస్థానంలో- నన్ను కొట్టినందుకు ఇన్‌స్పెక్టర్‌ షామోలపైన, అతనిని నివారించలేకపోయినందుకు సుప్రీం కోర్టు జడ్జీలపైన కేసు పెడతాను. అదే కోర్టులో నా హక్కులను హరించినందుకు డాక్టర్‌ ఫార్వాడిపైన, ఖాసీం షబానీపైన కేసులు పెడతాను. కొన్ని సార్లు మనం నిజమనుకున్నదంతా నిజం కాదు. అమ్మా.. ఆ సృష్టికర్త ప్రపంచంలో నువ్వు నేను ఒకటి. మనం ముద్దాయిలం కాదు. మనపై ఫిర్యాదులు చేసిన వారందరూ ముద్దాయిలు. భగవంతుడు ఏం చేస్తాడో అప్పుడు చూద్దాం.. నేను మరణించేదాకా నిన్ను కౌగిలించుకోవాలని ఉంది.  ఐ లవ్ యూ..
ఇట్లు...
నీ రెహనా


సౌజన్యం: ఆంధ్రజ్యోతి

Thursday 30 October 2014

అవినీతి-జనామోదం.


ఈ రోజు దేశంలో ఉన్న ప్రతీ రాజకీయ పార్టీ  ఎన్నికల సమయంలో అవినీతి నిర్మూలన/అంతమొందించడం లాంటి స్లోగన్ లేకుండా బరిలోకి దిగకుండా ఉండడం లేదు. ఆయితే ఆ స్లోగన్ పట్ల ఉన్న నిజాయితీని నాయకులుతో పాటుగా ప్రజలు కూడా పట్టించుకోవడం మానేసారు అనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న పలు ఉదంతాలు చూస్తుంటే.

జయలలిత, మాయావతి, జగన్ మెహన్ రెడ్డి, డి.రాజా, కరుణానిధి, లాలూ ప్రసాద్ యాదవ్ etc.. ఇట్టా లిస్టు రాసుకుంటూ పోతే ఎన్ని పేజిలు పడుతుందో మీకు చెప్పవలసినది కాదు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ వారు అన్నారు కానీ, ఇప్పుడు దానిని ఇలా కూడా చెప్పుకోవచ్చు. “రాజకీయాలంటే ప్రజాసేవ కాదోయ్, రాజకీయాలంటే కుంభకోణాలు చేయడమేయ్”

అవినీతి అనేది మన దేశాన్ని ఎంతగా పట్టి పీడిస్తుందో దేశంలో సామాన్యుల తలరాతని, దేశ అభివృద్ధిని, రాజకీయ నేతలు మరియు ఉన్నతాధికారుల బ్యాంకు బ్యాలెన్సులను చూస్తే చాలా ఈజీగా చెప్పేసుకోవచ్చు. దేశంలో ఉన్న పలు సమస్యలకు ప్రధాన కారణం అవినీతి కంపే అని ప్రతి ఒక్కడికి తెలుసు.  అది నిజం కూడా...  చాలా మంది మేధావులు, చదువుకున్నవాళ్ళు(?) ఈ విషయమై చాలా మధనపడుపోతూ ఉంటారు. ఆయితే ఇలాంటి వారు కేవలం మధనపడతారు తప్పితే అవినీతికి వ్యతిరేకంగా చిత్తశుద్దితో తమ సపోర్టుని అందిస్తారని అనుకోవడానికి లేదు.

ఒకప్పుడు అవినీతి చేసినట్టు తేలితే ఆ నేతకు ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యమే. సంబంధిత పార్టితో పాటుగా ప్రజలు కూడా అలాంటివారిని దూరం పెట్టేవారు. అందువల్ల వెధవ పనులు చేసినా బయటకు తెలీకుండా జాగత్ర పడేవరు. ఇప్పుడు పరిస్దితులు చూస్తుంటే సీన్ పూర్తిగా రివర్స్ ఆయినట్టుగా అనిపిస్తుంది.

అవినీతి అనేది పెద్ద ఇష్యూగా ప్రజలు భావించడం లేదని ఈ మధ్యన జరుగుతున్న ఉదంతాలు బట్టి భావిస్తున్నా.  గత పదేళ్ళులో దేశంలో/రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాలు చేసిన అవినీతి/కుంభకోణాలు పాత రికార్డులన్నింటిని చెరిపేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసాయి. కేంద్ర ప్రభుత్వంలో ఆయితే ప్రతి ఆరు నెలలకోమారు ఒక కుంభకోణం బయటకు వచ్చేది. మొదటిలో ప్రజలు వీటిని చాలా త్రీవంగా పరిగణించినప్పటికీ, అది పెద్దగా ప్రజలను కలచివేసినట్టుగా అనిపించలేదని మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టికి పోలయిన ఓట్లను పట్టి తెలుస్తుంది. కాంగ్రెసు ప్రభుత్వంలో జరిగిన పలు కుంభకోణాలు  కారణంగానే మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిందన్న విషయం ఈజీగా చెప్పొచ్చు. ఆయినప్పట్టికీ కొంత వరకు ఓట్లు పడ్డాయంటే, ఆ కొంత మందికి సదరు కుంభకోణాలు మీద ఎటువంటి అభ్యంతరం లేదని భావించవలసి వస్తుంది.

అదే విధంగా రాష్ట్రంలో వరుసబట్టి కేంద్రంలో మాదిరిగా సీరియల్ కుంభకోణాలు బయటపడనప్పట్టికీ తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కేవలం రెండేళ్ళలోనే కోట్లకు పడగలెత్తిన జగన్ ఉదంతంపై సి.బి.ఐ., ఈ.డి. లాంటి పలు దర్యాప్తు సంస్దలు చార్జీషీటు వేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  దేశ కుంభకోణాల్లోనే అత్యంత విలువైన కుంభకోణంగా సి.బి.ఐ. పేర్కోనడం పరిస్దితి త్రీవతను తెలియజేస్తుంది.

ఆయితే ఇవేవి సామాన్య ప్రజలకు పెద్దగా పట్టించుకోనే అంశం కాదని మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్.సి.పి. కి వచ్చిన ఎమ్మెల్యే స్దానాలను బట్టి రుజువు ఆయింది.  ఈ ఎన్నికల్లో అధికార పక్ష పార్టికి, ప్రతిపక్ష పార్టీకి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం ఇంచుమించుగా ఐదు లక్షలు మాత్రమే అని తేలడం అవినీతి కేసుల పట్ల మారిన ప్రజల ధృక్పదం క్లియర్ గా తెలుస్తునే ఉంది. దేశ ఎన్నికల చరిత్రలో ఏ ఎన్నికలకు ఖర్చు పెట్టనంత మొత్తం మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్.సి.పి. పార్టీ గుమ్మరించినదని పలు వార్తాకధనాలు వెలువడ్డాయి. అంటే దాని అర్ద్రం మిగతా పార్టీలు ఖర్చుపెట్టలేదని కాదు.

ఆయితే వైఎస్ జగన్ మీద ఎన్నికలకు ముందే పలు అవినీతి అరోపణలు వచ్చినప్పటికీ, పలు కేసులు దర్యాప్తు స్దాయిలో ఉండి, పదహారు నెలల పాటు జైలులో ఉన్నప్పట్టికీ రాష్ట్రంలో చాలా మంది ప్రజలకు అదొక ఇష్యూగా కనిపించకపోవడం చూస్తుంటే నేతలు చేసే అవినీతికి  కొంత వరకు జనామోదం ఉన్నట్టుగానే భావించాలి. 

మొన్నటికి మొన్న అక్రమ సంపాదన విషయంలో జరిమానాతో పాటుగా జైలు శిక్షకు గురయిన జయలలిత ఉదంతంలో, జయకు జైలు శిక్ష కు వ్యతిరేకంగా ఎన్ని రోజుల పాటుగా ఎంత మంది రోడ్ల పైకి వచ్చి ధర్నాలకు పాల్పడ్డరో వార్తాసాధనాల్లో చూసాము. అవినీతికి వ్యతిరేకంగా సినిమాలు తీసి అభినందనలు అందుకున్న పలువురు నటులు, దర్శకులు కూడా ధర్నాలో పాల్గోనడం విచిత్రం అనిపించినా పెద్దగా అశ్చర్యపోలేదు ఎవరూ... అవినీతి రుజువు కాబడి శిక్షకు గురయిన జయలలితకి బాసటగా నిలబడడానికి వీరిలో ఎవరికి బేషజాలు అడ్డు రాలేదు.  వారికి కావల్సింది తమ అభిమాన నేతే తప్ప, వారు చేసే అవినీతి కాదు అన్న సందేశంను ఇవ్వకనే ఇచ్చారు.

ఇదే కాదు, అవినీతిమయ నాయకులుగా ముద్రపడ్డ పలువురు నేతలకు పడుతున్న ఓట్ల శాతంను చూస్తుంటే వారి అవినీతిని ప్రజలు సమర్దిస్తున్నట్టుగానే భావించాలి. సదరు నేతలు నెగ్గారా, ఓడిపోయారా అన్నది అప్రస్తుతం.  వారికి పడ్డ ఓట్ల శాతం బట్టి అవినీతికి అమోదం ఇచ్చిన ప్రజల శాతంని చెప్పుకోవచ్చు.

అంటే ఇప్పుడు అధికారములోకి వచ్చిన రాజకీయ పార్టిలు ఎటువంటి అవినీతికి పాల్పడలేదన్నమాట! వారికి వచ్చిన ఓట్లు అవినీతికి వ్యతిరేకంగా వచ్చినట్టు భావించవచ్చునన్న మాట! అని మీకు డౌట్ రావచ్చు.

  మీకు వచ్చిన డౌటే నాక్కూడా వచ్చింది.  అవినీతి నేతలకు ఓట్లు వేసిన వారు మాత్రమే అవినీతిని అవాయిడ్ చేస్తున్నారు అనుకోవడానిక్లేదు. ఎందుకంటే గెలిచే ప్రతోడు నీతివంతుడే ఆయి ఉండ్కర్లేదు. కాకపోతే అటు, ఇటు అవినీతే నేతే పోటిలో ఉన్నప్పుడు జనాలు తెలివిగా చాయిస్ తీసుకుంటున్నారు. అంటే మతం, కులం వంటి వాటిని లెక్కలోకి తీసుకుంటున్నారు. ఈ లెక్కన అవినీతి నేతలు అన్నీ పార్టిల్లోను ఉన్నందున పార్టితో సంబంధం లేకుండా వారికి ఓట్లు వేసిన వారందరూ అవినీతికి అమోదం తెల్పినట్టుగానే భావించాలి.

అటు వైయస్సార్.సి.పి. అధినేత జగన్ తో పాటుగా ఇటు అధికార టి.డి.పి. పార్టిలోనూ కూడా కొంత మంది అవినీతిపరులు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసారు. ఇలాంటి చోట ఇరువైపులా పడ్డ ఓట్లు శాతంను అవినీతిని సమర్దిస్తున్న ప్రజల శాతముగానే భావించాలి. ఇలా ఓట్లు వేసే వారిలో నిరక్ష్యరాస్యులు, ఆమాయక పల్లెటూరు జనాలు మాత్రమే ఉన్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే.

మనం చెప్పుకుంటున్న అవినీతికి జనామోదం ఇస్తున్నవారిలో అత్యధికులు మేధావులని చెప్పుకొంటున్నవారు, చదువుకున్న వారే అధికం.  “ప్రస్తుతమున్న రాజకీయపార్టీలు అన్ని అవినీతిమయయిపోయాయి, వేరే చాయిస్ లేక ఎవరో ఒకరిని ఎన్నుకోవల్సి వస్తుందని” చాలా మంది సాధారణంగా చెప్పే మాట. ఆయితే ఇది కూడా రాంగే.

ఎటువంటి అవినీతి మరక లేని నేతలను ఎన్నికల్లో నిలబెడుతున్నామంటూ లోక్ సత్తా పార్టీ కొన్ని సం.రాలు క్రితమే ప్రత్యామ్నయంగా వచ్చింది. ఆయితే దానికి ప్రజల ఆదరణ ఏ మాత్రముందో మనకి తెలియంది కాదు. ఎందుకనో తెలీదు అవినీతి కలష్మం లేని రాజకీయాలు లక్ష్యంగా రాజకీయ రంగంలోకి దూసుకువచ్చిన జయప్రకాశ్ నారాయణ అంటే చాలా మంది చదువుకున్నవాళ్ళకి పడదు. ఆ విషయం సామాజిక మాధ్యమ్యాల్లో చాలా సార్లు గమనించాను. ఇప్పుడున్న పలు ప్రముఖ పార్టీల నాయకుల మోసపూరిత ప్రసంగాలు కన్నా జయ ప్రకాశ్ నారాయణ ప్రసంగాలంటే మండిపడివాళ్ళు ఎక్కువున్నారు. దానికి కారణం అంత ఇతమిద్దంగా చెప్పలేను.

ఈ రోజుల్లో అవినీతి కామన్ ఆయిపోయింది. అందుకే ఇప్పుడు నిజాయితీగా పనిచేసుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే వారిని సత్తెకాలపు సత్తెయ్య అని తీసిపారేసేవాళ్ళు ఎక్కడికక్కడ కనబడుతునే ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు జనాలు మైండ్ సెట్ పూర్తిగా మారినట్టే అనిపిస్తుంది. సత్తెకాలపు సత్తెయ్యలంటే పరమ బోర్ ఫీలవుతున్నారు. ఇప్పుడంతా క్విడ్-ప్రో-కో తరహనే.... ఫలానా నేత నుండి మనకు వ్యక్తిగతంగా ఏదైనా లబ్ది పొందితే చాలు. ఇక అతని అవినీతి ట్రాక్ రికార్డుని పట్టించుకోవక్కర్లేదు..




Monday 20 October 2014

భారతదేశం - సెక్యులరిజం

ఏ దేశానికైనా తమ శతాబ్దలనాటి చరిత్రని ప్రతిబింబిచే విధంగా మసలుకోవడం, సాంస్కృతిక  సంప్రదాయాలను మర్చిపోకుండా కొనసాగించడం అంటే తమ ప్రాంతానికున్న విశిష్టతని, చరిత్రని భావి తరాలకు తెలియజేయాలనే. ఆయితే ప్రస్తుతం ఎన్ని దేశాలు ఇటువంటి పని చేస్తున్నాయో తెలియదు కానీ, ఇండోనేషియా దేశంకు సంబంధించి “హిందూ జ్వాల” నామం కల్గిన పేసుబుక్కు వాల్ నుండి సేకరించిన సమాచారం బాగుందనిపించి ఉన్నదున్నట్టుగా ఇక్కడ పోస్టు చేస్తున్నాను.
                                                          ***


ఇండోనేసియా ప్రపంచంలోకెల్లా పెద్ద ముస్లిం దేశం. అక్కడి జనాభాలో నూటికి 87 మంది మహమ్మదీయులు. తమ సాంస్కృతిక మూలాలను ఇండోనేసియన్లు మరచిపోరు. ఏవగించుకోరు.

అక్కడి నేషనల్ ఎయిర్‌లైన్ పేరు గరుడ

(
ప్రస్తుతం మూతపడ్డ) డొమెస్టిక్ ఎయిర్‌లైన్ పేరు జటాయు’.

ఇండోనేసియన్ కరెన్సీ నోటుమీద గణేశుడి బొమ్మ!

రాజధాని జకార్తాలో ముఖ్యకూడలివద్ద అర్జునుడికి కృష్ణుడు రథం మీద గీతోపదేశం చేస్తున్న నిలువెత్తు ప్రతిమ!!
గరుత్మంతుడు, జటాయువు, కృష్ణుడు, గణేశుడు హైందవ మత సంబంధంగల పేర్లు. తమ దేశంలో హిందూమతం శతాబ్దాలకిందటే దాదాపుగా అంతరించిపోయి, ఐదింట నాలుగొంతుల జనాభా ఇస్లాం మతాన్ని తరతరాలుగా ఆచరిస్తుండగా... తమదికాని, ... అందునా విగ్రహారాధకుల మతం తాలూకు పేర్లను ప్రభుత్వ సంస్థలకు పెట్టటమేమిటి? ప్రభుత్వ కరెన్సీపై అన్యమతానికి చెందిన దేవతామూర్తిని ముద్రించటమేమిటి?... అన్న అభ్యంతరం ఇండోనీసియన్లకు లేదు. తమ ప్రాచీన హిందూ సంస్కృతి అన్నా, వాటి ప్రతిరూపాలన్నా వారికి మహా ఇష్టం.

కొద్దినెలల కిందటి ముచ్చటే చూడండి. ముస్లిం దేశమైన ఇండోనేసియా, (ప్రధానంగా) క్రైస్తవ దేశమైన అమెరికాకు 16 అడుగుల ఎత్తు సరస్వతీదేవి విగ్రహాన్ని కళాత్మకంగా చెక్కించి, స్నేహానికి గుర్తుగా పంపించింది. వేరే మతానికి చెందిన దేవతావిగ్రహాన్ని ప్రభుత్వ కానుకగా పంపించటం అపరాధమని ఇండోనేసియా సర్కారు అనుకోలేదు. తమది కాని మతం ప్రతిమను తామెందుకు తీసుకోవాలని అమెరికన్ గవర్నమెంటూ చిరాకు పడలేదు. సంతోషంగా దాన్ని స్వీకరించి, వాషింగ్టన్ డి.సి.లో వైట్ హౌసుకు కిలోమీటరు దూరంలో టూరిస్టులకు ప్రత్యేకాకర్షణగా దాన్ని ఉంచారు.
పైన చెప్పుకున్న వాటిలో ఏ ఒక్కదాన్నయినా ఇండియా దటీజ్ సెక్యులర్ భారత్‌లో కలనైనా ఊహించగలమా?

కర్మంచాలక అదే సరస్వతీదేవి విగ్రహాన్ని అమెరికాకు కాక ఇండియా సర్కారుకు ఇండోనేసియా బహూకరించిందనుకోండి! ఏమయ్యేది? విగ్రహం ఎంత ముచ్చటగా ఉంటేనేమి? అది ఒక మతానికి సంబంధించినది కదా? ఆ మతం ఎంత ప్రాచీనమైనది అయితే మాత్రమేమి? మా దేశంలో నూటికి 80 మంది ఇప్పటికీ అనుసరిస్తున్నదే అయితే నేమి? ఫలానా మతానికి చెందిన దేవతా ప్రతిమను ముట్టుకుంటే మా సెక్యులర్ మడి మైలపడుతుంది. కాబట్టి వద్దే వద్దని ఘనత వహించిన భారత సర్కారు ఆ కానుకను తిరుగు టపాలో వెనక్కి పంపించేది. సమయానికి సెక్యులర్ మతి తిన్నగా పనిచేయక మన్మోహన్ సర్దార్జీగారో, మరో పెద్దతలకాయో ఆ విగ్రహాన్ని స్వీకరించి ఉంటేనా...?! దేశంలోని సెక్యులర్, లిబరల్, లెఫ్టిస్టు, అనార్కిస్టు తక్కుంగల మేధావిగణం యావత్తూ రేచుకుక్కల్లా మీదపడి పీకిపెట్టేది. జాతి ఎంచుకున్న సెక్యులర్ జీవన విధానానికి, రాజ్యాంగ వౌలిక స్ఫూర్తికి, మానవతా విలువలకు జరిగిన ఆ మహాపచారం సభ్య సమాజానికి సిగ్గుచేటు అంటూ ది హిందూపత్రిక ఘాటైన సంపాదకీయం రాసేది. వీరనారి అరుంధతీరాయ్ డిటోడిటోగా ఔట్‌లుక్వీక్లీనిండా చెడామడా చెలరేగేది. పాఠశాలల్లో, పబ్లిక్ కార్యక్రమాల్లో సరస్వతీ ప్రార్థన చేయటమే సెక్యులర్ వ్యతిరేక దురాగతమని జాతీయ ఏకాభిప్రాయం ఎంచక్కా నెలకొని ఉన్న పవిత్ర భారతదేశంలో బాధ్యతగల ప్రభుత్వమే బరితెగించి ఏకంగా సరస్వతీ విగ్రహానే్న అందుకోవటాన్ని రాజ్యాంగ వ్యతిరేక దుశ్చర్యగా ప్రకటించమంటూ వీర సెక్యులరిస్టులు ఏ ఉన్నత న్యాయస్థానంలోనో అర్జంటుగా ప్రజాహిత వ్యాజ్యం వేసేవారు.

-
ఇప్పుడు బృహదీశ్వరాలయం బొమ్మతో ప్రత్యేక నాణేన్ని రిజర్వు బ్యాంకు చలామణీ చేయడం మీద ఢిల్లీ హైకోర్టులో లక్షణమైన పిల్పడ్డట్టు!

పనిలేనివాడు దావావేస్తేనేమి? అన్నీ తెలిసిన న్యాయస్థానం అడ్డగోలు వాదాన్ని ఎందుకు మన్నిస్తుంది - అంటారా?
తాజా నాణెం కేసులో ఏమయింది?

బృహదీశ్వరాలయం బొమ్మతో మూడేళ్ల కింద రిజర్వు బ్యాంకు ప్రత్యేక నాణేన్ని వెలువరించింది తంజావూరు గుడికీ హిందూ మతానికీ వల్లమాలిన పబ్లిసిటీ తెచ్చిపెట్టటానికి కాదు. ప్రపంచ హెరిటేజ్ సెంటరుగా యునెస్కోగుర్తింపు పొంది, కళాత్మక నిర్మాణ వైభవానికి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆ పెద్ద గుడికి వెయ్యేళ్లు నిండిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన కార్యమది. అయితేనేమి? సెక్యులరిజం మంట కలిసిందంటూ నఫీస్ కాజీ, అబూ సరుూద్ అనే ఇద్దరు ఢిల్లీ పౌరులు ప్రజాహితవ్యాజ్యం వేసీ వెయ్యగానే అన్నీ తెలిసిన ఢిల్లీ హైకోర్టు న్యాయపీఠం ప్రభుత్వంమీద ఫైర్ అయింది. మీపై వచ్చిన అభియోగానికి ఏమంటారో చెప్పుకోమని కేంద్ర ప్రభుత్వానికీ, రిజర్వుబ్యాంకుకు నోటీసులిమ్మని ఆదేశించిన యాక్టింగ్ చీఫ్ జస్టిస్ బి.డి. అహమ్మద్‌గారు ఆ సమాధానమేదో వచ్చేదాకా ఆగకుండానే ప్రభుత్వానికి సెక్యులర్ వ్రత విధానం గురించి పెద్ద క్లాసు తీసుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయానికి వెయ్యేళ్లు నిండిన అరుదైన సందర్భాన్ని పురస్కరించుకునే నాణేన్ని వెలువరించామని ప్రభుత్వం పనుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం ఏ ఒక్క మతానికీ ప్రచారం చేయరాదు; సెక్యులరిజాన్ని సక్రమంగా అర్థం చేసుకోవలెను అంటూ ఎడాపెడా ఉతికేశారు. పాతికేళ్లకు ఇది, వందేళ్లకు అది అంటూ తడవతడవకూ ప్రత్యేక నాణేలేమిటని తెగచిరాకు పడ్డారు. శభాష్!

న్యాయం, ధర్మం సర్వం ఎరిగిన ఉన్నత న్యాయస్థానం వారి ఉపదేశమే ఈ రీతిన ఉన్నప్పుడు ప్రాచీన కళలను, సంస్కృతిని రూపుమాపడమే సెక్యులర్ సర్కారు స్పెషల్ డ్యూటీగా పెట్టుకుని, ఓటు బ్యాంకుల కోసం ఎంత చేటుపనికైనా ఉరకలేయడంలో వింతేముంది? శ్రీనగర్ దాల్ సరస్సు దాపున ఉండే జగత్ప్రసిద్ధి చెందిన శంకరాచార్య హిల్ను తఖ్త్-ఎ-సులేమాన్గా పేరుమార్చి, కొత్త చరిత్రను బనాయించే పవిత్ర కార్యాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎ.ఎస్.ఐ.) వారు రాజకీయ యజమానుల పురమాయింపు మీద జయప్రదంగా పూర్తిచేశారు. తమ కబంధ హస్తాల్లో చిక్కిన ఎన్నో ప్రాచీన దేవాలయ కట్టడాలను పరిరక్షణపేరిట కూల్చి కుప్పపోసే మహత్కార్యక్రమంలో ఈ సర్కారీ సంస్థ వారు ఔరంగజేబు ఆవహించినట్టు చాలాకాలం నుంచీ నిర్ణిద్ర దీక్షతో పాటుపడుతున్నారు. హిందూ మతం గురించి, హిందూ సంస్కృతి గురించి, వాటి సంరక్షణ గురించి మాట్లాడితే సెక్యులర్శీలం చెడి, కమ్యూనల్ ముద్ర పడుతుంది కనుక హిందూ సంస్థల పెద్దలూ నోళ్లు కుట్టేసుకున్నారు.
ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి సెక్యులరిజం నేర్పింది. ప్రపంచాన్ని చూసి భారతదేశం సెక్యులరిజాన్ని నేర్చుకోవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది.

(Post courtesy: The FB wallpage of “Hindu Jwala”)

(Picture courtesy: google)

Thursday 16 October 2014

వ్యవస్దగత లోపాలు



హుదుద్ తుఫాన్ కారణంగా వినాశనమునకు గురైన విశాఖపట్నం పరిస్దితి చూస్తే చాలా బాధనిపించింది. అంతే కాదు దానితో పాటుగా నష్టానికి గురైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిస్దితి కూడా ఇంచుమించుగా అలానే ఉంది.

ఆయితే వైజాగ్ పరిస్దితి వీటికి పూర్తిగా భిన్నంగా ఉంది. విద్యుత్ లేక సకల సౌకర్యాలు మొత్తం బంద్ ఆయ్యాయి. ఈ రోజుల్లో ప్రతిదీ విద్యుత్ తో ముడిపడియున్నాయని వేరే చెప్పక్కర్లేదు. ఒక్క విద్యుత్ ఉంటే చాలు సామాన్యుల రోజూవారీ అవసరాల్లో ఒక ఎనబై శాతం పనులు చక్కబట్టుకోవచ్చు అని నా అభిప్రాయం. అదే విధంగా విద్యుత్ పై ఆధారపడి పనిచేసే పరిశ్రమలు,  ఏ.టి.ఎం.లు, పెట్రోలు బంకులు, వాటర్ సప్లై లాంటి వాటికి కొరత లేకుండా చేసుకోగలిగితే సగం సమస్యలు జయించినట్లే....

ధ్వంసం ఆయినా అనేక సర్వీసులు కాదు కానీ ముఖ్యమైన విద్యుత్ సర్వీసు గురించి మాట్లాడుకుంటే,

ఆహర పదార్దలు, కూరగాయలు ముఖ్యమైన జాబితాలో ఉన్నప్పట్టికీ, తుపానుకి వారం రోజుల నుండే హెచ్చరికలు జారీ చేసినందున ప్రజలు ముందుగానే కావల్సిన సరుకులు ఇంట్లోకి తెచ్చుపెట్టుకున్నప్పట్టికీ, విద్యుత్ లేకపోవడం అనే కారణంగా వంట చేసుకోవడానికి మరియు త్రాగడానికి అవసరమైన మంచి నీరు మరియు కూరగాయలు నిల్వ ఉంచుకొనే సదుపాయం లేకపోవడం మూలాన రెండు రోజుల్లోపే ఇబ్బందులు గురయ్యారు.

ఆయితే ప్రకృతి విలయాన్ని ఏ సాంకేతికత అపలేదు కాబట్టి, సాధ్యమైనంత వరకు నష్టాన్ని తగ్గించడానికి మరియు ప్రజలను అప్రమత్తం చేయుటలో గతముతో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వం బాగానే పనిచేసింది. ఆయితే వచ్చిన సమస్యంతా తుఫాను భీబత్సం తదనంతరం అవసరమైన సేవలను పునరుద్దరించడంలో జరుగుతున్న జాప్యమే. ఇంత జాప్యం  చూస్తుంటే అసలు మనకున్న సమర్దత ఏపాటిది అన్న అనుమానం కల్గుతుంది.

తుఫాన్ కారణంగా వైజాగ్ లో గత  శనివారం అర్ద్రరాత్రి 11.00 గంటలకు పోయిన విద్యుత్ ని ఇప్పటికీ కూడా పునరుద్దరించలేకపోవడం మన వ్యవస్దల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతుంది. తుఫానుకి గురైన రోజే సహయక చర్యలను దగ్గరుండి పర్యవేక్శించడానికి అఘమేఘాల మీద వెంటనే వైజాగ్ బయలుదేరి వెళ్ళిన ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు ఎవరినీ చూడలేదు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ప్రధాన కార్యాలయం నుండి పర్యవేక్షిస్తూ క్రింది స్దాయి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం వేరు, స్వయంగా రంగంలోకి దిగి అవసరమైన చర్యలను తీసుకోవడం వేరు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే సచివాలయము నుండే పరిస్దితులను చక్కబెట్టే విధంగా వ్యవహరములను నడపచ్చు. కానీ ఆ విధంగా చేయకపోవడంలో పరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం గమనించవచ్చు. ఆయితే నేను ఇక్కడ చెప్పదలచుకున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి స్దాయి వ్యక్తి స్వయంగా వైజాగ్ లోనే మకాం వేసి, పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని వైజాగ్ కి రప్పించినప్పటికీ, పునరావస చర్యల్లో అత్యవసరమైన విద్యుత్ ని పునరుద్దరించడానికి సుమారు ఐదు రోజులుకు పైగా పట్టడానికి గల కారణాలు ఏమిటి అన్న ప్రశ్న నన్ను తొలిచింది.  ఇదే ప్రశ్న నా స్నేహితుడిని అడిగాను.

కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించినంత వేగంగా ఇక ఎవరూ స్పందించగలరు్? ఇంత ఇదిగా వారం రోజుల నుండి వైజాగ్ లోనే మకాం వేసి పనుల్లో అంతగా నిమగ్నమైనప్పట్టికీ కూడా నువ్ అలా అనడం బాగోలేదు అన్నాడు.

ఆయితే నేను ఇక్కడ ముఖ్యమంత్రిని బ్లేమ్ చేయడం లేదు. ముఖ్యమంత్రి స్దాయి వ్యక్తే అంత వేగంగా స్పందించినప్పటికీ కూడా విద్యుత్ పునరుద్దరణకి ఇంత సమయం పట్టిందంటే సమస్య ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను. అంటే అత్యున్నత స్దాయిలో ప్రయత్నించినప్పటికీ కూడా విద్యుత్ పునరుద్దరణకి ఐదు రోజులకి పైగా పట్టే స్దాయి వ్యవస్ద మాత్రమే మనకు ఉందా? అంతకు మించి మెరుగైన వ్యవస్ద మనకి లేదా? అన్నది నా డౌట్... ఇదొక్కటే కాదు సమాచారం చేరవేయడంలో అత్యంత ముఖ్యమైన సెల్ ఫోన్ సిగ్నల్ సర్వీసును కూడా ఇప్పటి వరకు సరిదిద్దలేకపోయారు. ఆయితే ఇది ప్రెవేటు సంస్దల పరిధిలోని అంశం. ఆయితే సహయక చర్యల్లో ముఖ్యమైన అంశం కమ్యూనికేషన్ కాబట్టి సెల్ ఫోన్ సర్వీసు పునరుద్దరణ కూడా ముఖ్యమైన అంశమే....

ఇదే ఫీలింగును నిన్న మన ముఖ్యమంత్రి గారు ఈ క్రింద విధంగా వ్యక్తీకరించారు.

ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలదని అంటూ, ప్రస్తుత పరిస్దితులు తనకు సంతృప్తికరంగా లేవని, ప్రభుత్వం అనుకున్న తర్వాత కూడా పనుల్లో ఇంత అలస్యం జరగకూడదు”


సేమ్ నాకొచ్చిన ఫీలింగునే ముఖ్యమంత్రి గారు వ్యక్తీకరించడం చూసి నేననుకొన్నది నిజమే అనిపించింది. ప్రకృతి వైపరీత్యాలను మనం ఎలాగూ అదుపు చేయలేము. ఆయితే వాటి కారణంగా పాడయిన సర్వీసులను త్వరితగతిన చక్కదిద్దడానికి  అవసరమైన వ్యవస్దలను తయారుచేయడం ఎంత అవసరమో ప్రస్తుత పరిస్దితులు తెలియజేస్తున్నాయి. దీంట్లో భాగంగానే భూగర్బ విద్యుత్ లైన్ల వ్యవస్దను పరిశీలించడం చాలా ఉత్తమం. ఇప్పటికే దేశంలో ఉన్న కొన్ని ప్రధాన నగరాల్లో ఈ వ్యవస్ద అందుబాటులో ఉంది.  

ప్రకృతి వైపరీత్యాలు మనకు మాత్రమే కాదు కదా. మన కన్నా జపాన్, ఆమెరికా లాంటి దేశాల్లో ఇంత కన్నా భయంకరమైన వినాశానికి గురయిన సందర్బాలు ఉన్నాయి. ఆయితే అత్యంత ముఖ్యమైన సర్వీసులను గంటల్లోనే పునరుద్దరించగలిగే వ్యవస్దలు ఉండడం వలన వారు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలను అధిగమించగల్గుతున్నారు.


కాబట్టి ఇప్పటికైనా మనం గుర్తించవలసినదేమంటే, వేగంగా స్పందించగలిగిన ప్రభుత్వాలు ఉన్నప్పట్టికీ అవసరమైనటువంటి సమర్ద వ్యవస్దలను కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా ముఖ్యమే. 

Thursday 9 October 2014

రెండు కళ్ళ బాబు..


అరె.. నాయుడు ఎన్నాల్లయింది నిన్ను చూసి..

రారా.. చాలా కాలానికి గుర్తొచ్చినాను నేను అన్నా...

అదేమి లేదు అన్నాడు చిరునవ్వుతో.....

అదేంటో తెలీదు కానీ మా నాయుడు వస్తే లోకాభిరామాయణం అంతా ముందేసుకొని చర్చించలనిపిస్తుంది. దానికి తగ్గట్టే మనోడు కూడా మంచి హూషారు కల్గిన మనిషయే.. చూడ్డానికి సన్నగా పీలగా ఉన్నా మెదడులో ఉన్న సరుకు మాత్రం సామాన్యం కాదు.  ఇక మనకంటరా! చూడ్డానికి బలంగా బండగా ఉన్నా మెదడులో ఉన్న సరుకు నామమాత్రమే... ఆయినప్పటికీ ఏదో ఒకటి అరువు తెచ్చుకొని డిస్కషన్స్ పెడుతూ ఉండడం అలవాటయి పోయింది.

రెండు కళ్ళ సిద్దాంతం అంటే నాకు మన బాబే గుర్తుస్తున్నారు భయ్యా  అన్నాన్నేను...

తప్పేముంది బ్రదరూ.. మైక్రోసాప్ట్ అంటే బిల్ గేట్స్, రిలయన్స్ అంటే ముకేష్, అనిల్ అంబానీ, 2జి అంటే రాజా, అగస్ట్రా వెస్ట్ లాండ్ అంటే మహమేత, క్విడ్ ప్రో కో అంటే జగన్ గుర్తొచ్చినట్టుగా రెండు కళ్ళ సిద్దాంతమంటే బాబు గుర్తు రావడం వింతేముంది అన్నాడు..

ఏంది భయ్యా.. తెలంగాణా ఉద్యమం తారాస్దాయిలో ఉన్న టైములో ఎటూ పోవాలో తేల్చుకోలేని స్దితిలో రెండు కళ్ళు సిద్దాంతం వెలుగులోకి తెచ్చాడు కదా ఆ చంద్రబాబు. నాకు రెండు ప్రాంతాలు రెండు కళ్ళు లాంటివి. ఏ కన్ను కావాలి అని అడిగితే నాకు రెండు ముఖ్యమే అన్నాడుగా....

.......hmmm..

అప్పుడు బాబు చెప్పిందాని మీద అందరూ విరుచుకుపడ్డారు గ్గానీ, అందులో తప్పేముంది బానే చెప్పాడుగా అనుకున్నా.  రాష్ట్రం విడిపోతుందో, లేదో తెలియని డైలామాలో ఏదో ఒక ప్రాంతానికి అనుకూలంగా ఎలా మాట్లాడగలరు. అందుకే అట్టా చెప్పినాడు అని నాకు అర్ద్రం ఆయినట్టుగా వీళ్ళేవరికి అర్ద్రం కాక కూతలు కూస్తున్నారేటిరా సామి అని పీక్కున్నాను కూడా... అన్నాన్నేను...

ఆయితే ఏమంటావు, ఇప్పుడు.... అన్నాడు నాయుడు..

ఆ.. చెప్పడానికేముంది. రెండు కళ్ళు ముఖ్యమే అన్నవాడే ముందుగా తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చినాడు. పోనిలే అక్కడ సెంటిమెంటు తారాస్దాయిలో ఉంది కాబట్టి అక్కడి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి అట్నా లేఖ ఇచ్చాడు అనుకుందాం.  సెంటిమెంటుని గౌరవించి ఎలాగైనా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాల్సినదేనని ప్రతి కమిటీ ముందు సమర్దవంతంగా మొదటి నుండి చివర వరకు ఒకే మాటకి కట్టుబడి ఉన్నాడు. మిగతా పార్టిలు ఎన్ని డింగిరాలు తిరిగినప్పట్టికీ ఒకే స్టాండ్ మీద ఉన్నోడిలో మన బాబునే ముందుగా చెప్పుకోవచ్చు కదా...

ఆవును. అది నిజమే కదా.. ప్రధాన ప్రతిపక్ష పార్టిగా తెలుగుదేశం ఇచ్చిన లేఖ ఆధారంగానే రాష్ట్రం విభజనకి ఒప్పుకున్నమని అనాటి ప్రభుత్వ పెద్దలు కూడా పలు సందర్బాల్లో చెప్పారు.. అన్నాడు నాయుడు నా మాటల ప్రవాహాన్ని కొనసాగిస్తూ....

కదా.. రాష్ట్రం విభజనకి శక్తికొలదీ సాయం చేసిన ఆ చంద్రబాబు ఇప్పుడు మరల తెలుగుప్రజలను ఏనాటికైనా ఐక్యం చేసేది నేనే అంటాడేంది భయ్యా....

ఓ.. అదగ్గదా నీ ఆవేదన... నాకు అర్ద్రం ఆయిందిలేవెవోయి.... అన్నాడు తాపీగా

ఏమి అర్ద్రమవడం నా పిండాకూడూ.. వీడు రెండు కళ్ళ సిద్దాంతమంటే ఏమిటో ఇప్పుడు నాకస్సలు అర్ద్రమయి చావడం లేదు. ఆ రోజుమో వీరలెవెల్లో సిన్సియార్ గా ప్రయత్నం చేసి రెండు ముక్కలు చేయడం ఎందుకు! మరల ఈ నాడు తెలుగు ప్రజలను ఐక్యం చేస్తాననడం ఎందుకు?

ఇందులో అర్ద్రం కావడానికేముంది బ్రదరూ... ఆయనకి ఇక్కడ అధికారం దక్కింది. అక్కడ అధికారం అందని మావి ఆయింది. అందుకని ఇప్పుడు గులకరాళ్ళు అటు వేసే పనిలో బిజీగా ఉన్నాడు...

కావాలని పట్టుబట్టి తెలంగాణాని సాధించుకొని ఆంధ్రులంటే నిలువెల్లా విషాన్ని నింపుకుని, తమకు జరిగిన ప్రతి అన్యాయానికి వేలుని ఆంధ్ర వైపు చూపిస్తున్నా ఈ రోజుల్లో తెలుగు జాతి ఐక్యత అంటే చెప్పుచ్చుకు కొడతారు అక్కడ అన్నాన్నేను ముఖం నిండా అదో రకమైన ఫీలింగు ఉండగా....

నిజమే.. అ సంగతి మన బాబు పట్టించుకోవడం లేదు గానీ, తెలుగు జాతి ఐక్యత అంటే ముందుగా ఆంధ్రులే కొత్త బాటా చెప్పుతో అటూ, ఇటూ వాయించేలా ఉన్నారు. అంత దాకా రానిచ్చుకోడనే అనుకుంటాన్నేను అన్నాడు నాయుడు....

రానిచ్చుకో పోవడమేంటీ!! అక్కడ తన్నించుకొన్నది సరిపోక, ఇప్పుడు ఇక్కడ కూడా తన్నించుకోవడానికి ఊబలాటపడుతున్నట్టుంది అన్నా....
ఆయినా ఏమాటకా ఆ మాట.. విడిపోయినందు వలన మనం మొదట్లో కొద్దిగా బాధపడ్డాము(కలిసుండాలనే సెంటిమెంటు ఎక్కువయి) కానీ ఇప్పుడు మాత్రం చాలా హాయిగా, ధీమగా ఉన్నాము.(కలిసుండడం దండగమారి అని అర్ద్రమయి). ఇప్పుడు ఈయన వలన తిరిగి ఐక్యత సాధిస్తే కరెంటు కష్టాలు వాళ్ళకి పోయి మనకి తగులుకుంటాయి కదా...

అంతేనంటరా!!