Saturday 16 June 2012

ఉచిత ప్రచారం- ఇమేజి- బోడి చిప్ప...

మనలో కొంత మంది జనాలు మరీ బొత్తిగా ఖాళీగా ఉండలేరు...

వారికి రోజూ ఏదో ఒక హట్ టాపిక్ ఉంటేనే కాని నిదరవబుద్దికాదు.....

అలాంటి వార్కి ఈ సంవత్సరమంతా మంచి కాలక్షేపం దొరికింది... మన జగన్ రూపంలో....

వై.ఎస్. గారు కాలం చేసినప్పటి నుండి, నిన్న మొన్నటి వరకు ఓదార్పు పుణ్యమాని కొంత మంది జనాలకు, తాము తిన్నది అరగదీసుకోవడానికి మంచి టాపిక్ దొరికింది...

దాన్ని మాత్రం ఎంత కాలం సాగదీసుకుంటారు... తినగా, తినగా పంచదార కూడా చేదెక్కుపోతుంది కదా.....

అలాగే దీని మీద బోర్ కొట్టేసింది అనుకునే వాళ్ళకు ఉప ఎన్నికలు రూపంలో మంచి మేత దొరికింది.....

వాళ్ళకు తోడు మీడియా.... రోజూ పొద్దున్న లేవగానే పేపర్ నిండా అదే వార్తలు.... నాలాంటి వాడికి భూతద్దం పెట్టుకొని వెతికినా వేరే తరహా వార్తలు మచ్చుకైనా కనబడేవి కావు... ఆయితే జగన్, లేపోతే అక్రమాస్తులు, లేపోతే అరెస్టులు............ అంతే... ఇక అంత కన్నా వేరేమి ఉండేవే కావు.

పాపం... కాలక్షేపం కావాలనుకొనే జనాలు మాత్రం ఏమి చేస్తారు?? వాళ్ళకు కూడా కాలం గడవడానికి ఏదోక చెత్త కావాలి కదా.... ఇక దాంతో చూసుకోవాలి, మొన్నటి పోలింగ్ వరకు మన వాళ్ళ మాటలు.......

జీవిత గమనంలో మనము ఒక్కరిమే ఉండలేము కదా.... ఏదోక సందర్బంలో ఎవరో ఒకరితో మాట్లాడాలి కదా...... అందుకని ఎవరిని కలవడానికి వెళ్ళినా ముందుగా బాగున్నావా!! అని ప్రారంభించి, జగన్ నిజంగానే తప్పు చేశాడంటావా? అని అడిగేవారు... నాకు దాని మీద సరయిన నాలెడ్జి లేదండీ అని తప్పుంచుకోవలనుకుంటే, వెంటనే మరి కాంగ్రెసొల్లు పరిస్దితేంటి అని అడిగేవాళ్ళే....

ఇంటికి వచ్చి ఏ చానల్ పెట్టినా అదే రోద, పోనీ పేపర్ తిరగేద్దామన్న సేమ్ టూ సేమ్, భగవంతుడా ఏంటి నాకు ఈ శిక్ష...... అని అనుకొని భాదపడ్డా...ఆయినా వెంటనే సర్దుకొన్నా... ఎందుకంటే ఈ విషయము జగన్ కి ఎక్కడ తెలిసి నన్ను ఓదార్చడానికి వచ్చేస్తాడెమో అని..

అంతగా జగన్ మేనియా ఏర్పడిపోయిందీ మన అంద్ర ప్రదేశ్ లో...........

కాంగ్రెసు, తెలుగుదేశం, టి.ఆర్.ఎస్... ఈనాడు, ఆంద్రజ్యోతి.. ఇలా ఎవరైతేమేనిమి ఎవరూ చూసిన మన జగన్ ఘనకార్యాలు గురించి అడిగిన వాడికి, అడగని వాడికి కూడా చెవిలో కూర్చుని కోడై కూసారు...... వీళ్ళు చేసిన ప్రచారానికి, అసలు జగన్ అంటే ఎవరో తెలియని వాళ్ళకి, అసలు రాజకీయాలనే పట్టించుకోనని కొంత మంది అభ్యుదయవాదులకు, అఖరికి మా ఇంట్లో ఉన్న కుక్కకు కూడా తెలిసిపోయింది జగన్ అంటే ఎవరో... టి.వి.లో జగన్ చూడగానే మా కుక్క నిజంగానే గుర్తుపెట్టి భౌ...భౌ.. మని అరిచి, తాను నాకు కూడా తెల్సు అని అర్దమెచ్చేలా తోక ఊపుతుంది.

ఇంకా చెప్పాలంటే ఉప ఎన్నికల సందర్బంగా ఆయా పార్టిలు తాము ఏమి చేయగలమో చెప్పాకుండా, జగన్ ఏమి చేసాడో చెప్పడానికే వారి మేనిపోస్టో మొత్తము సరిపోయింది. ఏ నాయకుడు చూసిన, ఏ మైకు ముందు చూసిన అందరూ జగన్ పేరు తలచుకోనేవారే.....

ఎంత ఇమేజి కాకపోతే మాత్రం,,,,,,, అంత మంది కలసి జగన్ ఒక్కడి గురించి మాట్లాడుకుంటారు చెప్పండి....
అలానే అనుకున్నారు మన ప్రజలు కూడాను..... అధికార పక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకులు, ఇంకా యితర చిన్న చితకా నాయళ్ళు, మీడియా వాళ్ళు అందరూ కలసి ఒక వ్యక్తిని గూర్చి పదే పదే చెప్పడంతో కొద్దో, గొప్పో ఉన్న జగన్ ఇమేజి ఒక్కసారిగా పెట్రోలు రేటు పెరిగినట్టుగా పైపైకి ఎగబాకిపోయింది..... అది ఏ రకమైనా ఇమేజి అని అడక్కండి. రాముడికి ఇమేజి ఉంది. అదే విధంగా రావణసురుడికి ఇమేజి ఉంది. సో..జగన్ ది ఏ రకమైన ఇమేజి అన్నది నాకు తెలియదు... అది ఎవరికి వారే అన్వయించుకోవాలి.

ఉదయం ఆరు గంటలకు మొదలు.. రాత్రి పొద్దుపోయే వరకు ఏ చానల్ పెట్టినా, ఏ పేపరు తిరగేసినా, ఏ రాజకీయ నాయకుడుని చూసిన జగన్ గురించి మాట్లాడకుండా ముగించటల్లేదు.... ఆ విధంగా జగన్ ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లో సంపాదించుకొన్న క్రేజి కన్నా, ఈ విధంగా విపరీతమైన క్రేజి సంపాదించేసుకున్నాడు... అఖరికి జగన్ గురించి పబ్లిసిటి చేయడానికి ఢిల్లీ నుండి కూడా అరువు నాయకులను తీసుకువచ్చీ మరీ జగన్ నామస్మరణ చేస్తే కాని వదల్లేదు మన నాయకులు.

కాని ఇక్కడ అసలు ట్విస్టు ఏమిటంటే......

ఇవన్నీ ఓపిగ్గా (తప్పక) చూస్తున్న జనాలకు కూడా జగన్ పేరు వింటేనే కానీ, ఆ రోజుకి నిద్ర రాని పరిస్దితి వచ్చేసింది.. దానితో జనాలు ఏ రోజైనా మన రాష్ట్రంలో కిరణ్, బొత్స సత్తిబాబు, చంద్రబాబు అనే వ్యక్తులు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయినప్పటికి, జగన్ పేరుని మాత్రం మర్చిపోలేని స్టేజికి వచ్చేసారు...

కానీ.. వారందరూ ఏ వ్యక్తి గురించి ఆయితే మాట్లాడుకుంటున్నారో, ఆ వ్యక్తిని మాత్రమే గుర్తించుకొన్నారు..... ఆయన చేసిన ఘనకార్యాలు గురించి మాత్రం జనాలు మర్చిపోయారు.... ఆయిన అదంతా గుర్తు పెట్టుకోవడానికి ఆ లిస్టు ఏమన్నా చిన్నదా ఏమిటీ? చాంతాడంత ఉన్న జగన్ గారి ఘనకార్యాలు గురించి మనకున్న మిడి మిడి తెలివి సరిపోదు అని అనుకొని... దాని గురించి పట్టించుకోవడం మానివేసారు.... మనకు అర్దమయిన దాని ప్రకారం జగన్ అనే వ్యక్తి గురించి పది మంది చెప్పుకుంటున్నారు... అంతే అనుకొని పోలేమని పోయి గుద్దేసారు... ఈ.వి.ఎమ్ ల మీద..

ఫలితం.......

ఉప ఎన్నికల్లో వైకాపా భారి విజయం నమోదు... పదిహేను సీట్లు కొల్లగెట్టేసి జలక్ ఇచ్చాడు.... తనకి ఉచితంగా పబ్లిసిటి చేసిన వెర్రి వెధవలు అందరికి....



అధికార, ప్రతిపక్ష పార్టిలకు బోడి చిప్ప మిగిలింది......

నీతి: ఏ పని చేసిన ఒక పరిధి వరకే చేయాలి. ఆ పరిధి దాటి చేస్తే మొదటికే మెసము వస్తుంది. (అధికార పక్షానికి, ప్రతిపక్షానికి, రామెజిరావు, రాధాకృష్ణలకు)



గమనిక: శ్రీధర్ గారి కార్టూన్ ఈనాడు పేపరు నుండి తీసుకోవడమైనది

4 comments:

  1. వెలమకన్ని ఒంటేలు16 June 2012 at 10:06

    కెవ్వ్వ్వ్వ్‌ వ్వెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్‌
    నాదీ సేం టూ సేం ఫీలింగ్‌

    ReplyDelete
  2. Correct ga rasaru. Anavasara pracharam tho vadini oka pedda heroni chesaru.

    ReplyDelete
  3. @వెలమకన్ని ఒంటేలు గార్కి,
    స్పందించినందుకు ధన్యవాదములు,
    అదే విధంగా కెవ్వ్వ్వ్వ్వ్ పదం వలన గబ్బర్ సింగ్ సినిమాకు కూడా విపరీతమైన క్రేజి వచ్చింది్ కదండీ...

    ReplyDelete
  4. @anonyomus
    స్పందించినందుకు ధన్యవాదములు..

    ReplyDelete