Tuesday 16 August 2011

పుట్టినరోజు జరుపుకొని అన్నాహజారే అవినీతికి పాల్పడరట... మరి మన రాజకీయ నాయకుల సంగతి ఏంటి???

    ఆవును నిజమండి.. నిన్న ఈనాడు పేపరులోని వార్త ఇది.. పటిష్ట జనలోక్ పాల్ బిల్లు కోసము ప్రభుత్వమును ముప్పతిప్పలు పెట్టిన అన్నాహజారే ని దారిలోకి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తన విచక్షణాధికారాలను ఉపయోగించి అన్నాహజారె నేతృతంలో జరుగుతున్న ట్రస్ట్ ల లావాదేవిలను పరిశీలించి నిగ్గుతేల్చిన అవినీతి ఇది. అన్నాహజారే పుట్టినరోజుల వేడుకల నిమిత్తం ట్రస్ట్ సొమ్ము నుండి లక్షలు సొమ్ము ఖర్చు పెట్టరని కొండన్ త్వవ్వి ఎలుకను పట్టిన చందంగా కేంద్రం ద్వారా అదేశించబడిన కమిటి తేల్చింది.. అది తప్ప అన్నాహజారే మీద ఇక ఎటువంటి అవినీతి అరోపణలు లేవని కూడా తేల్చి చెప్పింది.. కేంద్ర ప్రభుత్వం వాదనల ప్రకారము అన్నాహజారే పుట్టినరోజు వేడుకలు నిమిత్తము ట్రస్ట్ సొమ్ము దుర్వినియెగం కావడం అవినీతి క్రిందకు రావడమైతే, తమ ప్రభుత్వంలోని ఉన్న అశేష మంత్రులు, మరియు పార్లమెంటేరియన్ల విచ్చలవిడి అధికార దుర్వినియెగం ఏ అవినీతి పరిధిలోకి వస్తుందో చెప్పితే ఇంకా బాగుండును కదా.... ఈ రోజు ఏ రాజకీయ నాయకుడైన ప్రభుత్వ ధనమును తన స్వంత అవసరములకు వాడుకోవడం లేదని నిక్కచ్చిగా చెప్పగలడా...... నన్ను అడిగితే అధికారములో ఉన్న రాజకీయ నాయకులు అధికారమును అడ్డుపట్టుకొని స్వంత వేడుకలు నిర్వహించుకొన్న అనేక సందర్బాలను ప్రస్తావించగలను.... మరి ఆ అవినీతిని అసరాగా తీసుకొని ఆ రాజకియ నాయకులందరి మీద అవినీతి ఆరోపణలు చేసి చర్యలు తీసుకొనే దమ్ము కేంద్ర ప్రభుత్వానికి ఉందా??


లోకంలో ఏ వ్యక్తి ఆయిన ఏదో ఒక సందర్బంలో తప్పు చేయకపోడు... అది మానవ నైజం....
అదే విధముగా అన్నా హజారే కూడా తప్పు చేసియుండవచ్చు.... ఆంత మాత్రానా అయన అవినీతి మీద పోరాటం చేయకుడదంటే ఎలా???
అంటే ఎవరన్న తప్పును నిలదీస్తే, దానిని సరి చేసుకోవలనది పోయి.. అతని తప్పుఒప్పులను వెతకడం ఏ సంస్కారము క్రిందకి వస్తుందో కేంద్ర ప్రభుత్వం వారే జాతిజనులకు సెలవివ్వాలి.
అవినీతిరహిత సమాజం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికే నిజమైన చిత్తశుద్ది ఉంటే, వారు అవినీతికి వ్యతిరేకంగా తాము చేసిన చర్యలు ద్వారా అన్నాహజారేని ఎదుర్కొండి... ఆయన ఆరోపణలకు ధీటుగా సమాధానమివ్వండి.... అలా చేయకపోగా తిరుగు ఆరోపణలు చేస్తున్నారంటే, వారికి జన లోక్ పాల్ బిల్లు తెచ్చే విషయములో చిత్తశుద్ది లేనట్లేగా....
అన్నా హజారే, బాబా రామ్ దేవ్ లను కట్టడి చేయడానికి వారి ఆధీనములొ ఉన్న సంస్దలపై దాడుల చేయించడంలో ఉన్న శ్రద్ద అవినీతి నిర్మూలనలో పెడితే, వెయ్యి మంది అన్నాహజారేలు, వెయ్యి మంది రామ్ దేవ్ లు వచ్చిన మిమ్మల్లి ఎవరు ఏమి చేయలేరు.....
ఎవరు ఏమి పీకుతారులే అనుకుంటే దానికి అన్నా హజారెలే అక్కరల్లేదు...... ఒక్క సామాన్య పౌరుడు చాలు. మిమ్మల్లి చరిత్రలో కలపడానికి.......

No comments:

Post a Comment