Thursday 24 November 2011

వారి నిర్లక్ష్య పాలనకు ఒక్క చెంప దెబ్బ సరిపోదు....

నిన్న కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శరద్ పవార్ పై చెంప దెబ్బ పడిన ఉదంతానికి నేనేమి చింతించడం లేదు. పైగా అది చాలా తక్కువ చర్యగా భావిస్తున్నాను.. ఆ మాత్రమున నన్ను తప్పుగా అర్దం చేసుకోకండి. నిన్న శరద్ పవార్ పై పడిన దెబ్బ ఒక్క హర్విందర్ సింగ్ ది మాత్రమే కాదు, ఈ దేశ రాజకీయనాయకుల నిర్లక్ష్య పాలనకు ప్రతి సామాన్యుడు చేయలనుకొన్న పని అదే. కాని అసంఖ్యాక సామాన్యుల మనసులో ఉన్నదాన్ని హర్విందర్ సింగ్ చేసి చూపించాడు. దేశములో ఒక ప్రక్క తమ వ్యవసాయ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లభించక, మరో ప్రక్క కూరగాయలు మరియు యితర వస్తువుల ధరలు సామాన్యుడినకు అందనంత ఎత్తులో ఊరేగితున్నప్పటికి, చీమ కుట్టునట్టు కూడా చలనం లేకుండా ఇంకా ఆ పదవినే పట్టుకు వేలాడుతున్న విలువల్లేని మనిషి అతను. ఒక వైపు దేశములో సామాన్యులు ఆకలి మరియు ధరల భారముతో అలమటిస్తూ ఉంటే, ఈయన గారు మాత్రము దేశానికి ఎందుకు కొరగాని క్రికెట్ అధ్యక్ష పదవిలో అంటగాగుచూ అమూల్యమైన సమయమును దానికే కేటాయిస్తున్న సదరు అమాత్యుల వారిని చెంప దెబ్బ కాకపోతే మరేమి చేయాలి. నిరసన తెలియజేయాలంటే చాలా మార్గాలున్నాయి. అంతేకాని ఇలాంటి దాడులకు దిగడం అనైతికము అంటూ, దాడి తదనంతరం పలువురు రాజకీయనాయకులు వ్యాఖ్యానించారు. కాని ఎప్పుడైనా సదరు దగాకోరు రాజకీయనాయకులూ ఏ నాడైనా సామాన్యుల రాజ్యాంగబద్ద నిరసనలను పట్టించుకొన్నారా?? ఏనాడు కూడా ఏ అమాత్యులు కూడా రాజ్యాంగ బద్దంగా తెలియజేసిన నిరసనను పరిగణనలోకి తీసుకొన్న దాఖలలు లేవు. అందుకే వారికి నిరసన ఈ విధముగా తెలియజేయవలసివచ్చింది. శరద్ పవార్ మీద పడ్డ దెబ్బ, ఒక్క అతని మీదే కాదు., అది మొత్తము ప్రభుత్వ మంత్రివర్గానికి అని తెలుసుకోవాలి. దానిని దేశములో ప్రతి సామాన్యుడి దెబ్బగా భావించాలి.. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రిగా ఎంతో భాద్యతగా వ్యవహరించవలసిన శరద్ పవార్, దానికి పూర్తి సమయమును కేటాయించకుండా లేదా దానికి రాజీనామా చేయకుండానే దేశానికి ఏ మాత్రము పనికిరాని క్రికెట్ అధ్యక్ష్య పదవిలు చేపట్టడం ఎందుకు?? ఒక వేళ దాని మీదే అంత మోజు ఉంటే వ్యవసాయ శాఖను వదులుకోవాలి. దానిని పూర్తి సమయమును కేటాయించగలిగే వేరొక రాజకీయనాయకుడికి అప్పగించడం మేలు.....

No comments:

Post a Comment