Sunday 13 November 2011

చేతన్ భగత్ కన్నా గొప్ప రచయితలున్నారు మన దగ్గర.. కాని......

చేతన్ భగత్.... పరిచయం అక్కరలేని రచయిత... అతను రాసిన ఫైప్ పాయింట్ సమ్ వన్, త్రీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ, టూ స్టేట్స్ లాంటి రచనలతో పేరు తెచ్చుకొన్న రచయిత.. ఈ రోజు అంద్రజ్యోతి పేపరులో ఆదివారము స్పెషల్ లో చేతన్ భగత్ ప్రోగాము గురించి వ్రాస్తే ఏమిటా గమనించా... అది చేతన భగత్ తన కొత్త రచన రివల్సుషన్స్. అనే పుస్తకమును లాంచ్ చేయడానికి హైదరబాద్ వచ్చిన సందర్బముగా వ్రాసిన అర్టికల్. అందులో ఇంకా సదరు పుస్తకావిష్కరణకి ముసలివాళ్ళు మరియు పెద్దవాళ్ళు అనే వాళ్ళు ఎవరూ లేరని, అందరూ యూతే అని.. ఇలాంటి సంఘటనలు మన పుస్తకావిష్కరణకి కానరావని అందులో రాసారు. అది చదవగానే నాకు నిజమే అనిపించింది. ఎందుకంటే చేతన్ భగత్ కంటే బాగా వ్రాయగలిగే రచయితలు మనకి చాలా మంది ఉన్నారు. కాని వారందరూ చేతన్ భగత్ కున్నంత క్రేజ్ ఎందుకు సంపాదించుకోలేకపోయారు అన్నదానికి సమాధానము చాలా ఈజీగా దొరుకుతుంది. ఒకప్పుడు మరియు ఇప్పుడు కూడా మనకి గొప్ప రచనలంటే శ్రీశ్రీ, జాషువా, చలం మొదలగు వారు రాసిన పుస్తకాలే.. కాని వారు రాసిన పుస్తకాలు మరొక సాహితివేత్రలకు మాత్రమే అర్దమయ్యే విధముగా ఉంటాయి. అంటే వారి రచనలు కేవలం జనభాలో కొంత మంది తోటి సాహితివేత్తలకి మాత్రమే అర్దమయ్యేవిధముగా ఉండడం. అంటే వారి రచనలు మిగతా వారికి అర్దం కాని రీతిలో ఉంటాయి. అందువలన వారి రచనలు మొత్తము జనాలకి అర్దంకాలేదు. అందువలనే వారి రచనలు ఒక ప్రత్యేక వర్గానికి మాత్రమే పరిమితమయ్యాయి. కాని చేతన్ భగత్ మాత్రము అందరికి అర్దమయ్యేరీతిలో సింపుల్ లాంగ్వేజిలో రాయడం వలన అతని రచనలు ఎవరికైనా సులభంగా అర్దం చేసుకోగలుగుతున్నారు. అంటే అలాంటి రచయితలు మన దగ్గర లేరా?? అన్న ప్రశ్నకు ఉన్నారనే చెప్పాలి.. ఆ విధముగా వ్రాసే వాళ్ళలో మధుబాబు, యుద్దనపూడి సులోచనరాణి, యండమూరి వీరేంద్రనాధ్ లాంటి అద్బుత రచయితలున్నారు.. వారి రచనలు కూడా చేతన్ భగత్ రచనలకు వలే బిగుతుని కల్గి ఉంటాయి.
 మరి ఎందుకు చేతన్ భగత్ లా పేరు తెచ్చుకోలేకపోయారు అంటే??? చేతన్ భగత్ ఉత్తరాదికి చెందిన అహ్మదబాద్ అనే నగరానికి చెందిన వ్యక్తి కావడం ఒక కారణం కావచ్చు.. ఆయితే ఏంటంట అని మీరు అనుకోవచ్చు.. ఉత్తరాదిలో నాకు తెలిసినంత వరకు ప్రజలు తమ రోజు మొత్తములో ఉద్యోగసమయులో కష్టపడడం పోను మిగిలిన సమయములో కొంత సమయమును పుస్తక పఠనం లేక యితర వ్యాపకాల మీద దృష్టి పెడతారు. ఇంచు మించుగా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పుస్తకపఠన అలవాటు ఉంటుంది. దాని వలన వారు అన్ని రకములు పుస్తకములను చదువుతారు. కాని మనకి అలాంటి పరిస్దితి లేదు. నాకు తెలిసి యువతలో సుమారు తొంభయై ఐదు శాతానికి పైగా యువతకు పుస్తకపఠన అలవాటు లేదని ఖరాఖండిగా చెప్పగలను. అటువంటప్పుడు మన రచయితలు పైకి ఎలా రాగలుగుతారు. నిజానికి చేతన్ భగత్ అంటే మన వాళ్ళకి అమీర్ ఖాన్ త్రీ ఇడియట్స్ సినిమా వచ్చేంత వరకు తెలియదు. అమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ ఘనవిజయము తర్వాత, పలు సందర్బాలలో అమీర్ ఖాన్ స్వయముగా చేతన్ భగత్ నవలను, మరియు అతని గురించి చెప్పినందున, అక్కడి నుండి చేతన్ భగత్ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.
చేతన్ భగత్ వ్రాసిన నవల అధారముగా త్రీ ఇడియట్స్ సినిమాను ఉన్నదున్నట్టు తీయడం మూలముగా ఆ సినిమా చాలా గొప్పగా వచ్చిందని చాలా మంది అభిప్రాయము. మన రచయితల్లో యండమూరి వీరేంద్రనాధ్, యుద్దనపూడి సులోచనరాణి వారి నవల్లో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. అప్పట్లో దాసరి నారాయణరావు మరియు చిరంజీవి ఎన్నో హిట్ సినిమాలు అందించింది మన రచయితల వ్రాసిన నవలల ద్వారానే.. అప్పట్లో ఆ నవలలకు ఉన్న క్రేజ్ అధారముగా అయా సినిమాలకు ముందే పాపులారిటి వచ్చిన సందర్బాలున్నాయి.
 కాని వారు నవల్లో వ్రాసిన విధముగా సినిమాల్లో చూపించలేదు. అయా సినిమాల్లో నటించే స్టార్ హిరోల ఇమేజికి అనుగుణంగా అందులో అనేక మార్పులు చేసేవారు. అందువలన వాస్తవానికి సదరు రచయిత చెప్పిన అసలైన ఫీల్ సినిమాలోకి వచ్చేసరికి ఎక్కడ కనబడదు. ఇది మన తెలుగు సినిమా దౌర్బగ్యం. అందుకనే మన రచయితలకు పెద్దగా పేరు రాలేదు. ఇంకా ఖచ్చితముగా చెప్పాలంటే మన రచయితలు పాపులర్ ల్లోకి రాకపోవడానికి కారణం మన సినిమానే. అదే విధముగా చేతన్ భగత్ ప్రాచ్యురంలోకి రావడానికి త్రీ ఇడియట్స్ సినిమానే కారణమని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇక పేరు ప్రఖ్యాతులు గురించి ప్రక్కన పెడితే చేతన భగత్ వ్రాసిన నవలలు అంత గొప్పవిగా నాకనిపించలేదు. ఎందుకని మీరు అడగవచ్చు. ఆపాటి నవలలను మన మధుబాబు గారు ఎన్నో రాసారు. చేతన భగత్ ఎక్కువగా తన నవలకు మూల కధ ని ఏదైనా కొంతమంది యువకులు మధ్యన మరియు వారి సంఘర్షణల చుట్టు నడుపుతారు. మరియు అతను రాసిన విధానము, మన జీవితములో కూడా అలాంటి అనుభవాలు ఎదుర్కొన్నమా అన్నట్టుగా ఉంటాయి. సాధారనముగా మన నిజజీవితములో సామాన్యముగా మన చుట్టు జరిగే అంశాలతోనే కధనం వ్రాస్తారు. దాని వలన అతని రచనల్లో బిగుతు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాని అంతకన్నా బిగుతు మధుబాబు రచనల్లో కనబడుతుంది. కాని మధుబాబు గారి రచనలు ఒక సూపర్ కధని పోలినట్టుయుంటాయి. అంటే ఆయన వ్రాసే రచనల్లోని షాడొ, గంగరాం, వీరభద్రారెడ్డి వంటి క్యారెక్టర్లు మన నిజజీవితములో చూడలేము. అందుకే ఆయన కధలు ఒక ప్రత్యేక పంధాలో కొనసాగుతాయి. అలాగే మన యితర రచయితల రచనలలో కూడా కొద్దిగా నాటకీయత ఉంటుంది. అందువలన వారి రచనలు చదవడానికి బాగుంటాయి కాని అందులో మనము ఊహించుకోలేము. కాని చేతన్ భగత్ వ్రాసే ప్రతి నవలలోను ప్రతి కార్యెక్టర్ మనకి తెలుసున్నదే అనిపిస్తుంది. ఎక్కడో ఒకచోట అరే నాకు కూడా యిలా జరిగిందే అన్నట్టుగా ఉంటుంది. అంటే మనల్ని అందులో ఫీలయ్యేలా చేయగలుగుతున్నారు చేతన్ భగత్. అందుకనే ఆయన రచనలు బాగున్నట్టుగా అనిపిస్తాయి. కాని ఈ రోజు ఆయనకు పట్టాభిషేకం చేస్తున్న తెలుగు యువత.. ఒకసారి మన రచయితల రచనలను చదవగల్గితే అంద్ర రుచులేంటొ తెలుస్తాయి మన యువతకు. మరియు మనలో చాలా మందికి మంచి పుస్తకాలేంటో తెలియవు. దాని వలన ఏ పుస్తకము చదవాలో తెలియక తికమకపడతారు. అలాగే నేను కూడా మొదట్లో తికమక పడేవాడిని. అలాగని ఇప్పటికి కూడా నాకు సరిగా తెలియదు మంచి పుస్తకమేదో, చెడ్డదేదో.. నాకు బాగుందనిపించిన పుస్తకాలన్నింటిని చదివాను. అందులో నాకు నచ్చిన పుస్తకాలు మచ్చుకు మీ ముందు పెడుతున్నాను. మృత్యువు తర్వాత జీవితము, చే గువేరా జీవిత చరిత్ర, పడిలేచే కడలి తరంగం... ఈ మూడు నాకు చాలా బాగా నచ్చాయి......
పి.ఎస్... నేను సాహితిప్రపంచం అనే సముద్రంలో ఒక చిన్న నీటి బొట్టును. దాని పరిధిలో ఒక బచ్చాగాడిని. ఏదో నాకు తెల్సినంతవరకు బాగుందని రాసాను. ఇందులో ఎవరికైనా నా తెలివితక్కువతన రాతలు ఉంటే మన్నించగలరని కోరుకుంటు
.......

1 comment:

  1. yandamoori is my all time favourite writer
    five point someone waste novel chaduvukokunda bhadyathaaraahithyanga pravarthinche mugguru panikimalina yuvakula katha. three mistakes of my life ayithe snehithudi chellelitho srungaram modalaina jugupsakaramga vundi.

    ReplyDelete