Tuesday 15 November 2011

పరులుకొక న్యాయము, తమవారికొక న్యాయమా?? ఎల్లో మీడియా వివక్ష.......

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆస్తులపై శ్రీమతి వై.ఎస్.విజయలక్ష్మి గారు వేసిన పిటిషన్ ఆధారముగా చంద్రబాబునాయుడు గారి హయాంలో జరిగిన కేటాయింపులు మరియు ఆయన అస్తులపై సి.బి.ఐ. ఎంక్వైరికి హైకోర్టు ఆదేశాలు యిచ్చింది. ఇది సాధారణమే... మన ప్రజాస్వామ్య దేశంలో కోర్టులు మరియు యితర వ్యవస్దలు ఎవరిపని వారు చేసుకుపోతుంటాయి. ఆయితే ఇక్కడ ఒకే రకమునకు చెందిన విషయములో మన రాష్ట్రంలో ఉన్న ఎల్లో మీడియా తన కధనాల్లో ఎంత తేడా చూపిస్తుందో చూస్తుంటే, మీడియా మీద అస్యహం వేయకుండా ఉండడం లేదు. మొన్నటికి మొన్న ఆక్రమ సంపాదన విషయములో జగన్ పై సి.బి.ఐ. ఎంక్వైరికి ఇదే కోర్టు అదేశించినప్పుడు మరియు ఇప్పుడు చంద్రబాబునాయుడు పై సి.బి.ఐ. ఎంక్వైరికి ఆదేశించినప్పుడు ఎల్లో మీడియా యొక్క రాతలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. జగన్ పై ఎంక్వైరికి ఆదేశించినప్పుడు మన చంద్రబాబునాయుడు గార్కి మరియు ఎల్లో మీడియాకు ప్రజాస్వామం పై నమ్మకం కల్గినట్టు, కోర్టు వర్గాలు నిజాయితిగా వ్యవహరించినట్టు అనేక కధనాలు ప్రచురించి, జగన్ పై ఎంక్వైరికి అదేశించినందుకే, అతనేదో పెద్ద నేరగాడు అనేటట్టు సి.బి.ఐ. ఎంక్వైరి మొదలుకాకముందే తీర్పులు ఇచ్చేసాయి. అదే కోర్టు ఇప్పుడు నారా చంద్రబాబునాయుడు గారిపై ఎంక్వైరికి అదేశించినప్పుడు మాత్రం, కోర్టుదే తప్పు అన్నట్టుగా కధనాలు వ్రాయడం ఎంత వరకు సబబు.. సి.బి.ఐ. ఎంక్వైరికి సహకరించి తన సచ్చీలత నిరూపించుకోవలసినదిగా జగన్ కి సూచించిన తెదేపా నేతలు, నేడు తమ అధినేతకు అదే సలహా యివ్వడం మాని, దీనిని దురుద్దేశపూర్విత చర్యగా అభివర్ణించడం ఏ సంస్కారము క్రిందకి వస్తుంది. జగన్ తప్పు చేశాడు కాబట్టి సి.బి.ఐ. ఎంక్వైరి అనగానే భయపడినట్టు తెలుస్తుంది.. అతని అక్రమ సంపాదనను నిగ్గు తేల్చి శిక్ష విధించే చర్యలు కోర్టులు చూసుకుంటాయి. మరి చంద్రబాబునాయుడు గారు నిజాయితిగా తన సచ్చీలత నిరూపించుకోవచ్చు కదా.... తమ మీద ఇరవై ఆరుకు పైగా కమిటిలు వేసారని, ఎవరు ఏమి పీకలేకపోయారని డాంబికాలు పలికే బదులు, నిజాయితిగా సి.బి.ఐ. ఎంక్వైరిని అహ్హానించవచ్చు కదా.... (ఇవన్నీ జగన్ విషయములో చంద్రబాబునాయుడు గారు వెలిబుచ్చిన విషయాలే).
జనాలు తాము రాసిందే నిజమని నమ్ముతారన్న భ్రమలో ఎల్లో మీడియా ఉంది. ఎల్లో మీడియా యొక్క ఈ రకమైన వివక్షను ఏనాడో పసిగట్టిన ప్రజలు సదరు ఎల్లో మీడియాను పూర్తి స్దాయిలో విశ్వసించడం లేదన్నది నిజము.... దీనిని గుర్తించుకొని ఎల్లో మీడియా కేవలం జరుగుచున్న విషయాలను యధాతదముగా మాత్రమే ప్రజలకు తెలియజేప్పెవిధముగా ఉండాలి/. అంతే కాని స్వంత తీర్పులు మరియు స్వంత కధనాలు ఇచ్చే విధముగా ఉండకూడదు..... మనకి కావలసినది సమాజములో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడమే. ... అంతే కాని వాటిపై ఎల్లో మీడియా యొక్క తీర్పులు అక్కరల్లేదు.....

No comments:

Post a Comment