Wednesday 13 March 2013

దక్షిణ భారతం: వివక్షయేల…. విస్మరించడమేల.....


చాలా వ్యవహరాల్లో కేంద్రప్రభుత్వ వైఖరి చూస్తుంటే దాని పరిపాలన  కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉన్నట్టుగా ఉంది. దక్షిణ భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న మాట కేవలం చెప్పుకోడానికే తప్ప ఆచరణలో చాలా తక్కువగా ఉన్నట్టుగా తోస్తుంది

త్రీవమైన విద్యుత్ కొరతతో రాష్ట్రం అల్లాడుతుంటే, దీనికి సంబందించి రాష్ట్ర వర్గాలు సాయం కోరితే అది అసలు తమ పరిధిలో అంశమే కానట్టుగా వ్యవహరించడం చాలా విచారకరం.... వివిధ ప్రాజెక్టుల్లో తనకు రావల్సిన కేంద్ర వాటా మరియు పన్నుల్లో భాగం తీసుకోవడానికి సిద్దమే కాని, సాయం లేదా భాధ్యతల విషయానికి వచ్చేసరికి మాత్రము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. రాబోవు రోజుల్లో దేశం ఎదుర్కోనబోతున్న విద్యుత్ సంక్షోభంను నివారించడానికి రాష్ట్రాలతో కలసి ఏమి చేపట్టబోతుందో కూడా అలోచించలేకపోతుంది.....


ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ కొరతతో పారిశ్రామిక రంగం చాలా నష్టపోయి ఉంది. భవిష్యత్తులోనైనా యివ్వకపోతే మూసివేయవలసిన పరిస్దితుల్లో కేంద్రాన్ని సాయం కోరితే, సచిన్ పైలట్ ఏమన్నారు!!

ఈ విషయములో మేము చేయగలిగింది ఏమి లేదు అని!!!

ఏమి చేయలేని దానికి ఇక ఆ పదవిలో ఉండడమెందుకు??

రాష్ట్రంలో విద్యత్ సంక్షోభంను ఈ స్దితికి తీసుకువచ్చిన నాయకులను ఇప్పుడు తూలనాడి ఉపయెగం లేదు. అదే పని కేంద్ర నాయకులు కూడా చేస్తే ఇక అక్కడ ప్రభుత్వాలతో దక్షిణ భారతానికి పని ఏముంది....

కరెంటుని కొనడానికి ప్రక్క రాష్ట్రాల్లో కూడా విద్యుత్ కొరత ఉంది. పోని ఉత్తరాదిని నుండి కొనాలంటే ఆ సౌకర్యం లేదు. ఇప్పటికైనా ఉత్తరాదికి, దక్షిణాదికి విద్యుత్ ని సరాఫరా అయ్యేలా యంత్రాంగంను రూపొందించారా అంటే సమాధానం ఉండదు. అదే పరిస్దితి ఉత్తరాది రాష్ట్రాలకు వచ్చి, దక్షిణాది నుండి కరెంటు తీసుకోవలసిన పరిస్దితి వస్తే ఇంత ఉదాసీనంగా ఉంటారని మనం భావించగలమా??

విద్యుత్ ఒక్క విషయమనే కాదు... రైల్వే ప్రాజెక్టులు కానివ్వండీ, మిగతా ఏ ప్రాజెక్టులు కానివ్వండీ... అన్నింటిలోను వివక్ష చూపిస్తునే ఉంది...

వీళ్లకు తొడు ఆయా మంత్రిత్వశాఖలను నిర్వహిస్తున్న మంత్రులు తమ స్వంత ప్రాంతాలకు మాత్రమే ప్రాతినిద్యం వహిస్తున్నాము అన్న ధొరణిలో పలు ప్రాజెక్టులకు తమ ప్రాంతాలకు కేటాయించుకుంటున్నారు తప్ప  దేశహితమును దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం లేదు. ఇప్పటి వరకు రైల్వే శాఖని నిర్వహించిన వారందరూ ఉత్తరాది వారే కావడం మరియు పలుప్రాజెక్టులు వాళ్ళకుమాత్రమే కేటాయించుకోవడం ఇప్పటి వరకు చూస్తునే ఉన్నాము.

అలానే వ్యవసాయశాఖ మంత్రిగా పవర్ ఏనాడయిన దక్షిణాది రాష్ట్రాలకు మేలు చేసిన దాఖలలు ఉన్నాయా? తనకొచ్చిన మంత్రిత్వశాఖను తన పార్టి బలోపతంనకు మరియు తన వ్యక్తిగత చరిష్మాను పెంచుకోవడానికి మాత్రమే ఉపయెగించుకొన్నారు. ఇది ఎంత వరకు సమర్దనీయం? ఏ రాష్ట్రంలోను లేని విధంగా ఇక్కడ రైతులు అత్మహత్యలు చేసుకొన్నారు... ఎవరైనా పట్టించుకున్నారా?? అదే విధర్భలో జరిగితే, దానికి ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించింది.


ఇలా అన్నింటిలోను వివక్ష చూపుతున్నప్పుడు మనం పన్నుల్లో వాటా ఎందుకివ్వాలి?
లేకపోతే ప్రతి మంత్రిత్వ శాఖనకు దక్షిణాది మరియు ఉత్తరాది శాఖలను ఏర్పాటు చేసి ఇద్దరేసి మంత్రులను నియమించాలి. ఆఫ్ఫుడయినా సమన్యాయం వస్తుందని భావించవచ్చు.

లేదంటే రాజధానిని దక్షిణ భారతంలోని బెంగుళురు, కొచ్చిన్, చైన్నై లలో ఏదొక దానికి మార్చాలి. లేదంటే ప్రత్యేక దక్షిణ భారతదేశం కావాలన్న డిమాండ్ లు రావచ్చును. అదే భావన ఇక్కడి ప్రజల్లో కలిగితే దేశ ఐక్యత బద్దలవడం ఖాయం....


ప్రమాణం చేసినపుడు భారతదేశ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పినప్పుడు అఖండ భారతవని మొత్తము మదిలోకి రావాలి. దేశము మొత్తం నాదే అన్న భావన కలగాలి. 

No comments:

Post a Comment