Tuesday 13 September 2011

వేటాడుతున్న ప్రభుత్వం......

ఇక నుండి మనము బ్రతకడానికి డాలర్లు ఖర్చు చేయడానికి సిద్దముగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో బ్రతకలంటే మనకు రూపాయల్లో సంపాదన సరిపోదు.... ఖచ్చితముగా మనము డాలర్ల లెక్కలో సంపాదించవలసినదే... ఇప్పటికే అన్ని విధములుగా పెరిగిపోయిన ధరలతో డిలాపడిపోయిన సామాన్యుడుకి మరల ఎక్కడ రిలాక్స్ దొరుకుతుందో లేక డబ్బును ఎక్కడ స్విస్ బ్యాంకులకు తరలిస్తారో అని ప్రభుత్వం దీర్ఘాలోన చేసి నిత్యావసరలైన బియ్యం, పప్పులు, వంట గ్యాస్ తో సహ ప్రాణాధారమైన మందుల పై ఇప్పటి వరకు ఉన్న నాల్గు శాతం వ్యాట్ రేటును ఐదు శాతానికి గుట్టుచప్పుడు కాకుండా పెంచేసింది...
 దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు వెయ్యి కోట్ల వరకు ఆదాయము సమకూరే అవకాశం ఉందని అంచనా... ఎందుకయ్యా సామాన్యులని ఇలా ఏడిపిస్తున్నారు అని ముఖ్యమంత్రులవారిని అడగడం పాపం, తప్పక పెంచవలసివచ్చినది, అనివార్యమైనదని కూల్ గా సెలవిచ్చారు... అదే అనివార్యం రైతుల పంటకు మద్దతు ధర పెంచకపోవడం, బడుగు జీవుల వేతనాల్లో పెంపు లేకపోవడం, ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిర్మూలించకపోవడం, పాలనలో పారదర్శకత లేకపోవడం వంటి వాటిలో చూపకపోవడమేమిటి??? ముందు ప్రజలకు ఆదాయాలకు ఎటువంటి డోకా లేకుండా చేస్తే, తద్వారా అదే ప్రజల నుండి పన్నుల రూపేణా ఆదాయమును ఆశించండం తప్పు కాకపోవచ్చు... కాని సామాన్యులను వారి దారికి వారిని వదిలేసి నచ్చినట్టు బాదేస్తే వారు ఎలా మనుగడ సాగించాలని ప్రభుత్వానికి వీసమొత్తు కూడా ఆలోచన రాకపోవడం ఏమనుకోవాలి. ఈ రోజు ప్రజల్లో సంపన్న వర్గం తప్ప ఏ వర్గం వారు కూడా నిక్షేపంగా మునుగడ సాగించలేకపోతున్నరనేది పచ్చి నిజము.. ఒక్కప్పుడు అత్మభిమానానికి ప్రతికగా నిలిచిన రైతు ఆరుగాలం పంటని పండించి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా అమ్ముకొని మిగిలిన దానితో అవసరమైతే ప్రక్కవాడికి సాయము చేస్తూ బ్రతికేవారు.. కాని అదే రైతు ఈ రోజు కాలము కలసిరాక, ప్రభుత్వాలు సాయము చేయక, తాను వేసిన పంటకు పెట్టిన పెట్టుబడి కూడా తెచ్చుకోలేక అత్యంత దౌర్బగస్దితిలో ఉంటే, కనీస కనికరము లేకుండా ప్రభుత్వం ఏ విధముగా పన్నులు రూపేణా బాదుడు వేయగలదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసినదేమిటంటే ఏ రోజు రైతు ప్రభుత్వాల మీద ఆధారపడలేదు..
మరియు ప్రభుత్వాలు రైతుకి ఎటువంటి సాయం చేయకపోయినా కీడు చేయడంలో మాత్రము అత్యుత్సహాము చూపించాయి. విత్తనాలు నుండి ఎరువులు వరకు ఏది కూడా రైతులకు అందజేయలేకపోయాయి. మరియు వ్యవసాయ సంబంధ వస్తువులన్నింటిని ఉత్పత్తి చేసే కంపెనీలకు, అయా ఉత్పత్తిలను ఎప్పటికప్పుడు క్రమము తప్పకుండా పెంచుకుంటు పోతున్న ప్రభుత్వాలు, ఆరుగాలము కష్టపడి పంటను పండించిన రైతు శ్రమను మాత్రము పెంచకుండా మోకాలు అడ్డుపెట్టీ దమననీతిని ప్రదర్శిస్తుంది.. ఇకపోతే మిగతా వారు చిరు వ్యాపారులు, శ్రమజీవులు, రోజుకూలీలు, ఉద్యోగులు మొదలైనవారు. వీరు కూడా అధికముగా శ్రమ దోపిడి గురవుతున్నారు. కాని దానికి తగ్గ వేతానాలు మాత్రము అందుకోలేకపోతున్నారు. యజామాన్యాలు ఇచ్చే జీతాలు సరిపోక, మరియు ఎప్పటికప్పుడు ధరలతో వేటాడుతున్న ప్రభుత్వాలతో పడలేక సంఘర్షణకి లోనువుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచే వేతానాలతో సమానముగానే బయట ధరలు కూడా పెరుగుతుండడంతో పెరుగుదలలో సౌలబ్యంను అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు చేసే అన్ని పనులు సంపన్న వర్గాలను ఇంకా అభివృద్ధి చేసే విధముగానే ఉన్నాయనేది కాదనలేని సత్యం......
పి.ఎస్.: ఏదో నాలో ఉన్న ఆవేదనంతటిని ఇలా వ్రాసాను కాని, ఎవరు పట్టించుకుంటారు చెప్పండి.....

No comments:

Post a Comment