Monday 15 July 2013

నా మొదటి బాలయ్య ప్రసంగం....


నిన్న, మొన్న వరుసగా సెలవులు రావడంతో శుక్రవారం మధ్యాహ్నమే బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోయా...

వర్షాకాల ప్రభావం మూలంగా అనుకుంటా వాతావరణం చాలా చల్లగా అహద్లకరముగా ఉంది. పైగా పల్లెటూరు కూడానూ...

ఎక్కడికీ బయటకు వెళ్ళకుండా అలానే ఇంట్లోనే గడిపేస్తున్నాను..  ఈ లోపులో మా రవి మామ వచ్చాడు, చేతిలో ఓటర్లు లిస్టు పట్టుకొని... పంచాయితీ ఎన్నికలు కదా ఇప్పుడు.. మనోడు మా వార్డుకి మెంబరుగా పోటీ చేస్తున్నాడట..

వచ్చినతనిని పలకరించకపోతే బాగుండదు కదా అని పలకరించి, కొద్ది సేపు మాట్లాడి తిరిగి లోపలికి పోయి టి.వి. ముందు సెటిలయ్యా.... ఆ తర్వాత రవి మామ మా అమ్మమ్మతో కూర్చుని డిస్కషన్స్ లో పడిపోయాడు...

సాయంకాలం ఆయ్యేసరికి రాము మాస్టారు నుండి ఫోన్ వచ్చింది. రాము మాస్టారంటే నా చిన్నప్పటి గురువుగారు... చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాను. నేనంటే అభిమానం ఆయనకు...

ఏంటి సార్’ ఫోన్ చేసారని అడిగా... 

ఇదిగో శ్రీనివాస్ గారు మాట్లాడతారట అని ఫోన్ ని శ్రీనివాసు గార్కి యిచ్చారు. ఈయన ప్రస్తుతం మా ఊరికి సర్పంచ్ పదవికి పోటి చేస్తున్నారు”.  ఏంటి విషయమంటే, ఒకసారి మాట్లాడే పనియుంది. కలుద్దాం అన్నారు... సరేనండీ అని చెప్పేసి ఫోన్ పెట్టేసాను,  కానీ ఆ సంగతే మర్చిపోయాను....

మర్నాడు ఇంట్లో కోడి పలావు వండారు.  మా ఇంట్లో కోడిపలావు వండారంటే ఎవరైనా లొట్టలేసుకుంటూ తింటాడు. మా అమ్మమ్మ వండినట్టు తెలిసినవారిలో ఎవరూ కూడా చేయలేరు... కాకపోతే తినేవాళ్ళు కొద్దిగా గట్టి పిండాలయిఉండాలి. లేకపోతే పలావు లోని కారం గాటుకి అట్నుంచి అటే పైకి టపా కట్టేయడం ఖాయం.  అంత ఎక్కువగా మసాలా దట్టించి తయారు చేస్తారు.. ఎంత కారంగా ఉన్నప్పట్టికి ఆ టేస్ట్ ముందు అవన్నీ పట్టించుకోకుండా కడుపు పగిలేలా తినడం మాత్రం గ్యారంటీ....

అలాంటి పలావు చేసేసరికి ఇక బయటికి ఏమి వెళ్ళలనిపిస్తుంది?... వాతావరణం కూడా చల్లగా ఉండి వెచ్చదనం కోరుకుంటుంది... ఇక పలావు ఎప్పుడు ఆవుతుందా? ఎప్పుడు మొదలెడదమా అని ఉదయం 10 గం.ల నుండి ఎదురు చూపులే... చివరకి 12.30 గంటలకు భోజనాల గది నుండి పిలువు వచ్చింది.  పిలుపు అందుకోవడం పాపం డైనింగ్ టేబుల్ మీద పడి శరణార్ద శిబిరంలో శరణార్దిలకు మంచి భోజనం దొరికితే ఎలా విభృంజిస్తాడో అలా కడుపు నిండా తినేసాను....

సాయంకాలం ఆయ్యేసరికి పలావు మరో పట్టు పడదాం అనుకోనేంతలో శ్రీ రామస్వామి వచ్చాడు ఇంటికి. యితను నాకు నాలుగేళ్ళు సీనియర్.. మా ఊరే... నాకు బాగా సన్నిహితుడు... ఏంటయ్యా సడెన్ గా ఇలా చెప్పాచేయకుండా వచ్చేసావు అని అడిగా....

సర్పంచ్ గా పోటీ చేస్తున్న శ్రీనివాసు గారు సాయంకాలం కలవమన్నారు మనల్ని.;  ఒకసారి కలిసి వద్దాం రా అని పిలుచుకువెళ్ళాడు... ఆవును కదా సుమీ నిన్న పోన్ చేసారు కదా, మర్చేపోయాను దాని సంగతి! అని అనుకొని  బయలుదేరాను  సాయంకాలం ఐదు గంటలకు....

దేని గురించయ్యా మనతో మాట్లాడేది అని అడిగా రామస్వామిని. పంచాయితీ ఎన్నికలు కదా, దాని గురించి మాట్లాడదమని అనుకుంటున్నారేమో అని అన్నాడు... పంచాయితీ ఎన్నికలు గురించయితే మనతో మాట్లాడేముంది తొక్క అనుకున్నా స్వగతంలో....

శ్రీనివాసు గార్కి ఊరిలో ఒక కాన్వెంటు ఉంది. ఆ కాన్వెంటు ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసారు. నేను అప్పటి వరకు ఆయన, మరికొందరు మాత్రమే ఉంటారెమో అనుకున్నా.... కానీ అక్కడ చూస్తే చిన్న సైజు సమావేశం ఏర్పాటు చేసియుంది.... మనకెందుకురా బాబు అనుకున్నప్పట్టికీ, అక్కడ వరకూ వచ్చిన తర్వాత కూర్చొక తప్పింది కాదు.

సమావేశం ప్రారంభమయింది. స్టేజి మీద ఓ నాల్గు కుర్చీలు వేసారు. మిగతా వారు కూర్చోవడానికి కాన్వెంటు బెంచీలు ఏర్పాటు చేసారు. కొత్తగా ఓటర్లయిన వారు మరియు వివిధ క్లాసుల కాలేజి విద్యార్దులతో నిండిపోయియుంది. నేను చివర్లో ఒక బెంచీ మీద కూర్చుని గమనించసాగాను. సమావేశం ప్రారంభమయింది. వ్యాఖ్యాత అవతారమెత్తిన దేవుడు మాస్టారు ప్రసంగం మొదలెట్టి, స్టేజి మీద ఉన్న మిగతా వారందరి చేత మాట్లాడించారు.. ఎలక్షన్స్ గురించి... ఓట్లు గురించి ప్రసంగం కొనసాగుతుంది... అందరూ వాళ్ళకి తోచినట్లు బాగా చెబుతున్నారు. అన్నీ శ్రద్దగా వింటున్నాను ( మనసులో మాత్రం ఇంట్లో ఉన్న బిర్యానీ మీదే ఉందిలెండి దృష్టి)

సడెన్ గా నన్ను పిలిచారు స్టేజి మీదికి మాట్లాడవలసినదిగా కోరుచూ దేవుడు మాస్టారు....

గుండెల్లో రాయి పడింది.. ఏంటి రా బాబూ సడెన్ గా ఇలా బుక్కు ఆయిపోయానని.... నాకు ఇప్పటి వరకు స్టేజి మీద మాట్లాడిన అనుభవం లేదు.. ఇప్పటికిప్పుడు సడెన్ గా మాట్లాడమంటే ఎలా అని??

నేను గబ గబా స్టేజి మీద దేవుడి మాస్టారి వద్దకి వెళ్ళి చెవిలో గుసగుసలాడుచూ ఏంటి సార్, నాకు అసలే మాట్లాడడం రాదు.. నేను మాట్లాడలేను అని చెప్పి వెళ్ళిపోయాను. సరే అని చెప్పి మిగతా వారిని ప్రసంగం చేయవలసినదిగా కోరారు...

అమ్మయ్య.. గండం గడిచింది.. అని ఊపిరి పిల్చుకొని వెళ్ళుపోబోతుంటే, దేవుడు మాస్టారు ఆపివేసి మొదటి లైన్ లో బలవంతంగా కూర్చోబెట్టేసారు....

అప్పటికే చీకటి పడిపోయింది... ఆ అవరణలో లైట్లు కూడా పనిచేయలేదు ఆ సమయంలో... చీకట్లోనే సమావేశాన్ని కంటిన్యూ చేసేసారు...  స్టేజీ మీద వ్యాఖ్యాతలు ప్రసంగాలు పూర్తవగానే క్రిందన కూర్చున్న కొంత మంది విద్యార్దులు మరియు కుర్ర టీచర్లతో కూడా మాట్లాడించారు....

ఇలా అందరూ మాట్లాడడం ఆయిపోయిన తర్వాత, అనుకోకుండా దేవుడు మాస్టారు సడెన్ గా నా చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోయి, ఎలాగైనా మాట్లాడివలసినదే అని కోరారు.. అందరూ నా వైపే చూస్తున్నారు... నాకు నోరు పెగలడం లేదు... ఇదేంటి రా బాబూ, శుభ్రంగా ఇంట్లో బిర్యానీ తింటూ హ్యాపీగా ఉండవల్సిన వాడిని.. ఇలా ఇరుక్కుపోయానా అని భాదపడసాగాను... 

ఎలాగైనా మాట్లాడవలసినదే అని దేవుడి మాస్టారు మరియు స్నేహితులు  ఫోర్స్ చేయడం మెదలెట్టారు... ఇక తప్పించుకోవడానికి కుదిరే పరిస్దితి కనిపించలేదు... తప్పదనుకొని మొదలెట్టా మాట్లాడడం (బాలయ్య స్పీచ్ మరియు బలుపు సినిమాలో రవితేజ స్పీచ్  బ్రెయిన్ లో మొదలుతుండగా)..... ఎలా మొదలెట్టానో, ఏమి చెప్పానో, ఎలా ముగించానో తెలియకుండా ( నా డౌట్ అసలు నేను ఎలక్షన్స్ గురించే మాట్లాడానా లేదా అని) ప్రసంగం ఇచ్చేసా...
 

మాట్లాడడం ఆయిపోయిన తర్వాత సమావేశంలో చప్పట్లు హోరు మొదలయింది... నేను ఏమి మాట్లాడానో నాకే అర్ద్రం కాలేదు. ఆయితే వీళ్ళకి కూడా అర్ద్రం ఆయి యుండదు. దానినే చప్పట్లు రూపంలో తెలియజేశారన్న మాట అని అనుకున్నాను. అందరికీ ధన్యవాదములు తెలిపి సెలవు తీసుకున్నాను.....

బయటికి వచ్చిన తర్వాత కొంత మంది వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, చాలా బాగా మాట్లాడావని అభినందించారు.... బహుశా అవి ఫార్మాలిటిస్ అనుకుంటా..... బాలయ్య ప్రసంగం ఆయిపోయిన తర్వాత ఆయనకు కూడా అందరూ అలానే షేక్ హ్యాండ్ ఇస్తారు కదా........

ఇంటికి వెళ్ళేసరికి టైమ్ రాత్రి 9.30....

బిర్యానీ అప్పటికే ఆయిపోయింది..... ఇక ఏమీ లేదు......

 

No comments:

Post a Comment