Thursday 31 January 2013

అంబేద్కర్ ని ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి?


ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యపరంగా ఎంతో ఉన్నతంగా విరజిల్లితున్న మన దేశానికి రాజ్యంగాన్ని రచించిన అపర మేధావి గానా? లేక భారత దేశ నాయకుడి గానా? లేక ఒక వర్గానికి చెందిన ప్రతినిధి గానా?

దురుదృష్టశావత్తూ చాలా మంది దృష్టిలో అంబేద్కర్ దేశంలో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగానే వార్తల్లో నిలవడం చాలా బాధకారం. మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందుటకు ఎంతో శ్రమకొర్చిన నాయకులను, తదనంతర భారత దేశ అభివృద్ధికి దోహదం చేసిన నిర్మాణకర్తలను మన దేశ ప్రజలు దేవుళ్ళుగా భావిస్తున్నారు. మహత్మ గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అజాద్, అంబేద్కర్, లాల్ బహుదుర్ శాస్త్రి వంటి నిస్వార్ద నాయకులను దేశ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. వీరికి కుల, మత, ప్రాంతంలతో సంబందం లేదు. అన్ని రకాల మతాలు, కులాలు, ప్రాంతాలు వీరిని తమ వారిగానే భావిస్తాయి.  వీరందరినీ భారతదేశానికి ప్రతినిధులగానే భావిస్తారు. భావించాలి. కానీ ఏ నాయకుడికి లేని విధంగా అంబేద్కర్ ని ఒక వర్గంనకు చెందిన వ్యక్తిగా హైలెట్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే దేశానికి సేవ చేయడానికి మతాలు, కులాలు అక్కర్లేదు. కేవలం సంకల్పం ఉంటే చాలు. అలాంటి సంకల్పం ఉంది కాబట్టే వారందరూ పూజనీయులయ్యారు. అంతే కాని ఫలానా వర్గానికి చెందినందుకు కాదు. మనిషనేవాడు ఏదొక వర్గానికి చెందడం సహజం. అదీ మన దేశంలో మరీనూ. దానినే పట్టుకొని వేలాడడం తగదు.

ఆ మధ్య అంబేద్కర్ విగ్రహలపై దాడులు చేయడం వంటి హీనమయిన చర్యలు జరిగాయి. దానికి ఆయన వర్గానికి చెందిన వారు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. వారు తమ వర్గానికి చెందిన అంబేద్కర్ కి అవమానం జరిగిందని రాద్దాంతం చేసారా లేక దేశ నాయకుడికి అవమానం జరిగిందని చేసారా? సమాధానం చాలా ఈజీగా చెప్పోచ్చు.  మరి అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగినపుడు మిగతా వారు ఎందుకు స్పందించలేదు అని అడగవచ్చు. నిజమే.. మనలో చాలా మంది అలాంటి విషయాల్లో ఉదాసీనంగా ఉంటారు. ఒక అంబేద్కర్ అనే కాదు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉన్న గాంధీ, అల్లూరి సీతరామరాజు విగ్రహాలకు మరియు  యితర దేశ నాయకుల విగ్రహానికి చెదలు, ధూళి పట్టినా మనం పట్టించుకోం. అది మనలో ఉన్న లోపం. ఆ లోపం ఆ వర్గాల్లో లేదని మనం సంతోషించాలా లేక కేవలం అంబేద్కర్ కి మాత్రమే పరిమితం చేసారని బాధపడాలా?  ఈ రోజు చాలా మంది దేశ నాయకుల వర్గం ఏమిటనేది నాకు తెలియదు. నాలాగే చాలా మంది తెలియదనుకుంటున్నాను. కాని అంబేద్కర్ వర్గమేమిటనేది చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు. ఎందుకు? ఆయన దేశ నాయకుడిగా కన్నా వర్గనాయకుడిగానే ఎందుకు చెలామణిలోకి వచ్చారు? ఆయన రచించిన రాజ్యాంగం వలనే తమ బ్రతుకులు మారాయని నమ్మి, ఆయనను ఆరాధిస్తున్నారా? ఒక వేళ రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు అనుకూలమైనవి పెట్టియుండకపోతే దేవుడు కాక పోయిండేవారా?

ఆయన రాజ్యాంగం రచించేటప్పుడు, తన వర్గానికి ప్రాధ్యానత్య కల్పించాలని తలంచలేదు. ఆనాటి పరిస్దితుల ఆధారంగా ఏదయితే మంచి అనుకున్నాడో అదే రాజ్యాంగంలో పొందుపరిచారు తప్ప, తన వర్గానికి అనాచిత ప్రయెజనాలు పొందడానికి కాదని మిగతా వర్గాలు తెలుసుకోవాలి. ఈనాడు చాలా మంది అంబేద్కర్ ని ఒక వర్గానికే మేలు చేసిన నాయకుడిగా పరిగణిస్తున్నారు. కానీ ఆనాటి పరిస్దితుల ఆధారంగానే రాజ్యాంగం తయారుచేసారన్న వాస్తవం గమనించాలి. ముఖ్యంగా ఆయనను విమర్శించే యితర వర్గాల వారికి. ఇకపోతే తమకు మేలు చేసినందుకు మరియు తమ వర్గానికి చెందినవాడవడం వలన అంబేద్కర్ మీద పేటేంట్స్ అన్నీ మావే అన్న అలోచనను ఆ వర్గం వారు ప్రక్కన పెడితే చాలా బాగుంటుంది. మనం భావితరాలకి అంబేద్కర్ ని పరిచయం చేయవలసినది దేశ నాయకుడి గానే తప్ప ఫలానా వర్గానికి చెందినవాడని కాదు.

ఇకపోతే ఆయన లేకపోతే మా బ్రతుకులు ఇంకా అలానే ఉండిపోదును. ఆయన రావడం వలనే మా బ్రతుకులు బాగుపడ్డాయి అనుకొనేంతవరకు పర్లేదు.  దురభిమానం పెచ్చరిల్లకూడదు. ఒకప్పుడు ఆయితే వర్గ పట్టింపులు ఎక్కువగా ఉండేవేమో కానీ.. ఇప్పుడు చాలా చోట్ల అలాంటి పట్టింపులు లేనే లేవని చెప్పగలను.  కానీ ఆ వర్గం వారు తమ ఉనికిని తామే బయటకు తెలిసేలా వ్యవహరశైలి ఉంటుంది. నేను ప్రభుత్వ సర్వీసులో ఇప్పటి వరకు నాతో పని చేసిన వారిలో కాని, పై అధికారుల్లో కాని ఒక్కరిది కూడా ఏ వర్గమో తెలుసుకోలేదు. నాకు అంత ఇంట్రెస్టు లేదు కూడా. దానికి తగ్గట్టుగానే వారి వర్గం గురించి కూడా నాకు తెలిసేది కాదు. కానీ ఈ వర్గం వారు మాత్రం హైలెట్ అయ్యేవారు. అది ప్రక్క వాడికి తెలిసేలా వారి వ్యవహరశైలి ఉండడమే ప్రధాన కారణమనుకుంటా.... పైగా మిగతా అధికారులతో పనిచేసేటపుడు కన్నా వీరితో పనిచేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడవలసివచ్చేది. ఎందుకంటే వారు అక్కడ అధికారులమనే భావం కన్నా తాము ఫలానా వర్గానికి చెందినవారిమి అన్న భావన వారిలో ఎక్కువగా ఉండడమే అనుకుంటా..

నాకు తెలుసు, నా ఈ వ్యాఖ్యల మీద వారికి కోపమెచ్చుందని.. కానీ నేను చూసింది చెపుతున్నాను. ఈ రోజు నిర్లక్ష్య పూరిత ప్రవర్తనను, తాము ప్రత్యేకము అనే భావనను కేవలం వారి వద్దనే చూసాను. ఏ వర్గం వారి వద్ద ఆ స్దాయి ధోరణిని నేను ఫేస్ చేయలేదు. ప్రపంచంలో మారుతున్న పరిస్దితులకు అనుగుణంగా ఆయా వర్గాలకు ప్రాధాన్యత లభిస్తుంది. అది సహజం. బ్రాహ్మణులు, రాజులు, జమీందారులు ఇలాంటి వారు ఒకప్పుడు వెలుగు వెలిగారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో పాటుగా ఒక్కొక్క వర్గం వారు వెలుగు వెలిగారు. తర్వాత క్రిందకి దిగజారారు.  కొన్ని వర్గాలు తొక్కివేయబడ్డాయి. అది ఇక్కడే ప్రపంచం మంతటా ఉంది. కానీ స్వాతంత్రానికి పూర్వం తమకు అన్యాయం జరిగిందని ఇప్పుడికి రాద్దాంతం చేయడం మంచిది కాదు. ఈనాడు తమకు తాము క్రింది వర్గానికి చెందినవారిమని భావిస్తున్న సదరు వర్గం వారు ఈ నాడు చాలా మంది మంచి పొజిషన్ లో ఉన్నారు. సమాజంలో వారు చాలా గౌరవప్రదమైన వృత్తిలోనే కొనసాగుతున్నారు. అలాంటప్పుడు ఇంకా గోల ఎందుకు? మమ్మల్లి తొక్కొస్తున్నారంటు వీధికెక్కడం ఎంత వరకు సబబు. ఎక్కడో ఒకటీ ఆరా సంఘటనకు జరిగియుండొచ్చు. వాటినే పట్టుకొని మొత్తానికి అన్వయించడం సరయిన విధానం కాదు. దాడులు అన్ని వర్గాల మీద జరుగుతున్నాయి. అలాగే చితికిపోయిన వారిలో అన్ని వర్గాల వారున్నారు. అలాగే బలిసిన వారిలో అన్ని వర్గాలున్నాయి. ఈ రోజులో ఫలానా వర్గం వారే అణగారి పోయి ఉన్నారని భావించక్కర్లేదు. ముందుగా వీరంతా మనం కామన్ మ్యాన్స్ అన్నట్టుగా ఫీలయితే ఏ గొడవ ఉండదు.

మొన్న ఆఫీసుకి వెళుతుంటే కొంత మంది రోడ్డుకు అడ్డంగా వెహికల్స్ పెట్టి ధర్నా చేస్తున్నారు. ఇంత పోద్దున్నే ధర్నా ఏమిటా అని అక్కడ ఉన్న ఒకతన్ని అడిగా. ఆయన ఎవరో నాకు తెలియదు కాబట్టి గౌరవంగానే అడిగాను. అటు నుండి చాలా రెక్లస్ గా వచ్చింది సమాధానం. ఏమనంటే, అటు చూడు అక్కడ అంబేద్కర్ బొమ్మ మీద ఎవరో స్టడీ స్కరిల్ వాడు పోస్టర్ అంటించాడు. అందుకే చేస్తున్నాము అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. నిజానికి అతనికి నేను ఎవరో తెలియదు. కానీ అతను మాట్లాడిన విధానం, అక్కడ జరుగుతున్న సంఘటన చూసి వాళ్ళ వర్గం ఏమిటో తెలిసిపోయింది.  అ ప్రక్కన ఇంకొక పెద్దాయన ఖరీదైన ఖద్దరు బట్టలతో, ఒంటి నిండా బంగారంతో ఉన్నాడు. ఆయన స్లోగన్ ఏమిటంటే, అగ్రకుల దురంహకారం నశించాలి అని. అసలు అక్కడ జరిగిన సంఘటనకి, దానికి ఏమన్న సంబంధం ఉందా? ఆగ్ర కులాలు కుట్ర పన్ని ఆ పోస్టర్ అంబేద్కర్ బొమ్మ మీద అంటించాయని భావించాలా? పైగా అంటించిన పోస్టర్ మీద స్టడీ సర్కిల్ వివరములన్నీ ఉన్నాయి. నిజంగా అంబేద్కర్ మీద్ గౌరవముంటే ఆ పోస్టర్ చింపివేసి, ఆ స్టడీ స్కరిల్ యజమాన్యంను నిలదీయాలి. అలా చేయడం మానేసి రోడ్డమ్మట పోయే ప్రతివాడు చూడాలన్నట్టు, మీడియాలోకి తమ ధర్నా ఎక్కాలన్నట్టు ఉన్న వారి ప్రవర్తన చూసి నాకు ఎలాఉందో కాదు కాని మీకు ఎలా ఉందో చెప్పండి? అగ్రకులం వాడు పొగరుగా చెబితే అది దౌర్జన్యం అవుతుంది. అదే వారు పొగరుగా చెబితే దాన్ని అత్మగౌరవం అనుకోవాలా? ముందుగా మనం గౌరవించుకోవడం మొదలెట్టాలి. వారు అలా మాట్లాడుతుంటే మిగతా వారికి ఎలా ఉంటుంది. ఒక వేళ అగ్రకులం వాడు వారితో అలా మాట్లాడితే లాగిపెట్టి కొట్టామనండి. వారు ఒకప్పుడు అలాచేసారు కాబట్టి, ఇప్పుడు మేము అలా చేస్తున్నాము అనుకుంటే అది మన.....??

వారికి ఎంత అత్మాభిమానం ఉంటుందో, మిగతా వారికి అంతే అత్మాభిమానం ఉంటుందని అన్ని వర్గాలు తెలుసుకుంటే చాలా ఉత్తమం. అలాగే అంబేద్కర్ ని కేవలం తమకి మాత్రమే చెందినవాడు గానే భావితరాలకు పరిచయం చేసేకన్నా, గాంధీజీ, నేతాజీ, సర్దార్ లతో పాటుగా దేశనాయకుడిగా పరిచయం చేస్తే అంబేద్కర్ కి చిరస్దాయి గౌరవం యిచ్చిన వారిమి ఆవుతాము....

7 comments:

  1. Such a nice conclusion. I like it...

    ReplyDelete
  2. challa baga cheppenaru,nenu meru chepputun vargam vadene,but u r anaces is right,e rojulo nietekata anede its very importent.ithink its human valus.

    ReplyDelete
  3. meru chepputunade bagavunde,very one should meten human values.

    ReplyDelete
  4. ee rojullo ekkada choosina ituvanti sanghatanalu kanipisthunnayi.idhi chaalaa bhadhakarm.

    ReplyDelete
  5. Sir meeru chebutunna vargam varini sulabanga kanukkovachu annaru. mee offiece lo valla varganni telipela vari pravarthana vuntundi annaru. adi mathram nenu angikarinchanu. meeru ala kanukkunnadaniki example cheppagalara?,,, alega ambedkar gurinchi mee visleshana chala chala bagundi

    ReplyDelete
  6. Sir meeru chebutunna vargam varini sulabanga kanukkovachu annaru. mee offiece lo valla varganni telipela vari pravarthana vuntundi annaru. adi mathram nenu angikarinchanu. meeru ala kanukkunnadaniki example cheppagalara?,,, alega ambedkar gurinchi mee visleshana chala chala bagundi

    ReplyDelete