Saturday 20 October 2012

దెబ్బతిన్నవి ఎవరి మనోభావాలు...


నిన్నంతా టి.వి.లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా గురించే....

ఆ సినిమాలో తెలంగాణా ప్రజల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలున్నయనేది తెలంగాణావాదుల అరోపణ....

నేను ఇప్పటివరకూ ఆ సినిమా చూడలేదు....

ఆయినా, నాకు తెలియక అడుగుతాను... దెబ్బతిన్నది తెలంగాణా ప్రజల మనోభావాలా లేక తెలంగాణా నాయకుల (అని అనుకుంటున్న) మనోభావాలా??

తెలంగాణా ప్రజలు వేరు... తెలంగాణా పేరు చెప్పి దౌర్జన్యం చేస్తున్న నాయకులు వేరు....

వీళ్ళకి, వాళ్ళకి సంబంధమే లేదు. నిజానికి అక్కడ ప్రజలకు మిగతా ప్రాంతాల ప్రజల మీద ద్వేషమే లేదు. ఉన్నదల్లా నాయకులకే..... అదే విషయాన్ని సినిమాలొ చూపిస్తే తప్పేవరిది?

గుమ్మడికాయల దొంగలు ఎవరు బే? అని అడిగితే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది తెలంగాణా వాదుల నిర్వాకం...

వీరు నిజంగా తెలంగాణా ప్రజల కోసమే పనిచేస్తున్నారనుకుందాం.... మిగతా ప్రాంతాల వారిని ద్వేషించడం లేదు అనుకుందాం........ అలాంటప్పుడు వారు హిరోలుగా ఫీలవ్వాలి. కాని విలన్ మీద ఏవో సన్నివేశాలుంటే, వాటిని తమను ఉద్దేశించే తీసారని భావిస్తే, లోపం ఎవరిలో ఉన్నట్టు?

తాము నిజంగా సినిమాలో చూపించినట్టుగా లేక మాట్లాడినట్టుగా చేసియుండకపోతే, ఎవరినో ఉద్దేశించి అన్నట్టుగా అనుకోకుండా... మరల అక్కడ కూడా తెలంగాణా ట్యాగ్ లైన్ ఒకటి తగిలించి, రాద్దాంతం చేయడం వలన ఎవరికి నష్టం.....

ఆలోచించుకొండి తెలంగాణా రాజకీయనాయకులు.......

ఇరుప్రాంతాల ప్రజలు బాగానే ఉన్నారు. వారు గౌరవప్రదమైన తెలంగాణా రాష్ట్రంను కోరుకుంటున్నారన్న విషయమును మిగతా ప్రాంతీయులు కూడా గుర్తించారు...

కాని గుర్తించనది రాజకీయ నాయకులుగా చెలామణి ఆవుతున్న తెలంగాణావాదులే.....

ముందు మీరు హిరోలుగా ఫీలవ్వండి... విలన్ కి అపాదించిన లక్షణాలు తమకు కూడా పోల్చుకున్నారంటే ఇక్కడ ఎవరు వెదవలే ఆలోచించుకొండి....
 

Tuesday 16 October 2012

లాస్ట్ చాన్స్ ఎవరికి?



అలోచించిండి....
మనకి కావలసినది వ్యక్తులు కాదు..... మెరుగైన వ్యవస్ద.... నేడు మనం కోరుకోనే మెరుగైన వ్యవస్దే రేపటి తరానికి మంచి బాట కాబడుతుంది.....

వ్యక్తుల మోజులో పడి వ్యవస్దని అపహస్యం చేయడం ఎంత వరకు సబబు.....

కులాలు, మతాలు, వ్యక్తుల మోజులో పడి వ్యక్తులను కోరుకుంటారో........,  అభివృద్ది పేరు చెప్పి మంచి వ్యవస్దని ఏర్పాటు చేస్తారో... అంతా మన చేతుల్లోనే ఉంది.....

ఒక్కసారి ఆలోచించండీ.....
రేపటి మన భవిష్యత్తు గురించి.....  అంతేకాని వ్యక్తుల భవిష్యత్తు గురించి కాదు......
 

Friday 12 October 2012

దటీజ్ నరేంద్ర మోడీ...

2002 నాటి అల్లర్ల నేపధ్యంలో నరేంద్ర మోడీ ని మరియు గుజరాత్ ని బహిష్కరించిన బ్రిటన్ ప్రభుత్వం, ఇప్పుడు పదేళ్ళ తర్వాత బంధాన్ని పునరుద్దరించే చర్యలకు శ్రీకారం చుట్టడం హర్షనీయం...

ఇది కేవలం ఒక ప్రాంతంనో లేక ఒక వ్యక్తినో చూసి తీసుకున్న నిర్ణయం కాదు....

అల్లర్ల నేపధ్యంలో, అందులో ప్రధాన భూమిక పోషించారన్న నిందతో మోడీతో పాటుగా రాష్ట్రంతో పూర్తి స్దాయి తెగతెంపులు చేసుకున్న బ్రిటన్, ఇప్పుడు తన నిర్ణయం మార్చుకోవడం వెనుక వున్న బలమైన కారణం...

గుజరాత్ లో గత పదేళ్ళలో జరిగిన అభివృద్దే అనడంలో సందేహం లేదు....
దానికి అద్యుడైన ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ యొక్క కృషిని గుర్తించింది....

ఆనాడు తన మీద నిందతో ఆగ్రరాజ్యాలన దగ్గ దేశాలు నిషేధం విధించినప్పటికీ, వెరవక తనకున్న అసలు బలం ప్రజాబలం అని భావించి, గుజరాత్ లో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధిని పండించారు.

తనపై పడిన నిషేదం గురించి ఆయన ఇసుమంతైన పట్టించుకోలేదు. తాను అనుకున్న పనిని నిస్వార్దంగా చేసారు.
అందుకే నేడు మోడీ అడక్కుండనే ఆగ్రరాజ్యాలే మోడీ ని తమ దేశానికి రావలసినదిగా ఆహ్హనిస్తున్నాయి.

అది భారతీయుడు పవర్.....

ఇది నరేంద్రమోడీ ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక భారతీయుడుగా సాధించిన ఘనత.....

ప్రతి భారతీయుడు ఇలానే ఆలోచిస్తే, ప్రపంచమే మన ముందు మోకారిల్లుతుందనడానికి మోడీ ఉదంతంను ఉదహరించవచ్చు.

అంతేకాని మన ప్రస్తుత ప్రభుత్వం విదేశియులు ముందు మోకారిల్లునట్టు కాదు.....


 

Tuesday 9 October 2012

జిల్లా కలెక్టరు, కాకినాడ వార్కి ధ్యాంక్స్

తూర్పుగోదావరి జిల్లా రాజధాని కాకినాడ అంటే ఒక రకమైన బ్రాండ్..

కాకినాడకి సెకండ్ మద్రాస్ మరియు పెన్షనర్స్ ప్యారడేజ్ అనే పేరు ఉండడం కూడా మీకు తెలుసు..

రాష్ట్రంలో ఏ నగరానికి లేని విధంగా ప్రణాళికబద్దమైన రహదారులు, మరియు రూపురేఖలు కాకినాడకి సొంతం

ఇంకొక విషయము... కాకినాడ మొత్తం చెట్లతో నిండి పచ్చదనంతో ఉంటుంది.. ఇప్పుడు కాదు ఒకప్పుడు..

నేను కాకినాడకి చదువుకోవడానికి వచ్చిన కొత్తలో రోడ్డుకిరుపైపులా ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లతో పచ్చదనంతో కలకలలాడేది.

రాను రాను పనికిమాలిన రాజకీయనాయకులు, అధికారులు కాకినాడకు తగులుకోవడంతో గత కొన్ని సం.రాలు గా పాత కళ కోల్పోయింది.


ప్రణాళికబద్దంగా నిర్మించబడ్డ నగరం క్రమేణా రాజకీయ నాయకులు నిర్లక్ష్యం మరియు అపరిపక్వ నిర్ణయాల మూలంగా గందరగోళం ఆయిపోయింది.

ఎప్పటి నుండో నగరవాసులకు చల్లదనాన్ని ఇచ్చిన చెట్లను రోడ్ల విస్తరణా పేరుతో నరికేశారు. వాస్తవానికి కొన్ని చోట్ల తప్ప మిగతా చోట్ల రోడ్ల విస్తరణకు చెట్లు అడ్డంకి కానే కాదు.

కాని తాము అనుకున్నది తప్ప ఇంకొకటి చేయడానికి ఇష్టపడని అధికారులు మొత్తం చెట్లను నరికేసారు. ఫలితంగా నిండుగా ఉన్న కాకినాడ బోడిగా అయిపోయింది.

పోని రోడ్లు వేసిన తర్వాత, మొక్కలు వేసారా? అంటే లేనే లేదు...

ఈ లోపులో కాకినాడ జనాభా పోలోమని పెరిగిపోయింది.

వేసవిలో కూడా చల్లగా ఉండే కాకినాడలో ఉండలేక మొన్న వేసవికి వెస్టిండీస్ పోవలనిపించింది....

ముఖ్యంగా జిల్లా కలెక్ట్రరు కార్యాలయం నుండి, జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయం మీదుగా జనరల్ హస్పటల్ దాటి బాలాజి చెర్వు వరకు ఉండే పెద్ద పెద్ద చెట్లు చూస్తే ఆకాశానికి పందిరి వేసినట్టుగా ఉండి సూర్య కిరణాలను నేల మీదకి రానిచ్చేవికావు.

అవన్నీ కనీస కనీకరమన్నదే లేకుండా తీసిపారేశారు ఐదు సం.ల క్రిందట.....

 
మొన్న ఆ రోడ్డు మీద నుండి వెళ్తుంటే కొత్తగా నాటిన చెట్లు నన్ను అకర్షించాయి. జిల్లా కలెక్టరు కార్యాలయం నుండి జిల్లాప్రజాపరిషత్ కార్యాలయం వరకు రోడ్డుకిరువైపులా ఉన్నాయి. చాలా ఆనందం అనిపించింది. కనుక్కొంటే జిల్లా కలెక్టరు శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ గారు సదరు మొక్కలను నాటించారని తెలిసింది. అంతే కాకుండా సిటి మొత్తం నాటించారు.

నిజంగా ఎంత మంచి పని చేసారండీ ఆవిడ.... నాకు చాలా ఆనందం వేసింది.....
అందుకే పదే పదే కృతజ్ణతలు తెలుపుకుంటున్నాను...

ఇప్పుడు కాకపోయినా, ఇంకో నాల్గు సం.లో  ఆ చెట్లు పెద్దవి ఆవుతాయి. అప్పుడు మరల పాత కాకినాడని చూడోచ్చు.

నగరానికి ఎంతో మంది కలెక్టర్సు వచ్చారు. కాని ఎవరూ చేయలేని పనిని చేసారు..

పి.ఎస్: ఎవరో వస్తారని చూసే బదులు నువ్వు కూడా ఎంతో కొంత చేయెచ్చు కదా అని అడుగుదామనుకుంటున్నారా? నేను మా ఊరిలో ఎక్కడ చిన్న స్దలం కనబడిన మొక్కలు నాటడమే పనిగా పెట్టుకున్నాను. అక్కడ నాది కాబట్టి చెల్లుతుంది. కాని కాకినాడ సిటిలో అలా చేయాలంటే కుదరదు కదా..... ఇలాంటివి పవర్ ఉన్న పెద్ద అధికారులు చేస్తే వర్కవుట్ ఆవుతుందని నా అభిప్రాయం
 

Monday 8 October 2012

కేబినెట్లోకి ఎఫ్.డి.ఐ.లు

అర్దిక సంస్కరణలు పేరు చెప్పి చిల్లర వర్తకం మరియు కొన్ని రంగాల్లోకి ఎఫ్.డి.ఐ.లను అనుమతించిన ప్రభుత్వం..

రాజకీయ సంస్కరణలు పేరు చెప్పి కేబినెట్ లోకి కూడా ఎఫ్.డి.ఐ.లను అనుమతిస్తే బాగుంటుదేమో...

కేంద్రప్రభుత్వం వైఖరి పై శరద్ యాదవ్ విసిరిన చణుకు..