Wednesday 14 December 2011

మూలాలు వదిలి పరిగెడితే ఇలాగే ఉంటుంది...............

ఒక అర్దికవేత్త అత్యంత ముఖ్యమైన ప్రధానమంత్రి పదవిలో ఉంటే ఇలాగే జరుగుతుంది. ఈ రోజు దేశములో పారిశ్రామికరంగం అభివృది రేటు దారుణంగా పడిపోవడంతో మన దేశ కరెన్సీ విలువ చాలా కిందకి దిగజారిపోవడంతో దేశ అర్దిక పరిస్దితి సంకటంలో పడింది. దేశాన్ని అభివృద్ధి పధంలో పరిగెట్టించడానికి ప్రణాళిక సంఘాలను ఏర్పాటు చేసింది ప్రస్తుత ప్రదాని అర్దిక మంత్రిగా ఉన్న సమయములోనే... ఏ దేశానికైనా, ఆ దేశంలో ఎప్పటినుండో నడుస్తున్న అర్దిక విధానాలను మరింత అభివృద్ధి చేయడం ద్వారానే ఎదగగలుగుతుంది.. కాని మన పరిపాలకులైన అర్దికవేత్తలు మూలాలు వదిలి పరిగెట్టి, ప్రస్తుత దేశ అర్దిక స్దితిని ఇబ్బందికరమైన స్దితికి తెచ్చారు. మన దేశములో అర్దిక రేటులో ఎప్పటి నుండో అధిక శాతము కల్గిన వ్యవసాయ రంగంను ప్రతి ప్రణాళిక సంఘంలోను నిర్లక్ష్యం చేసి, అభివృద్ధి పేరిట పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేసారు. అది తప్పని నేననడం లేదు. ఒక దేశ పాలకులుగా ప్రదానమంత్రి వారు దేశములో ఉన్న అన్ని రంగాలను సమాన దృష్టితో చూసి వాటి ఎదుగుదలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. కాని మన ప్రధాన మంత్రి తన అర్దిక మేధో సంపత్తితో ఆలోచించి, దేశ అభివృద్దికి ఒక పారిశ్రామిక రంగం మాత్రమే సరయినదని భావించి మిగతా రంగాలను ముఖ్యముగా వ్యవసాయ రంగంను నిర్వీర్యం చేయడానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపోందించారు. 
 ప్రభుత్వ విధానాలు కారణంగా వ్యవసాయ రంగంతో పాటుగా చాలా దేశియ చిన్న స్దాయి పరిశ్రమలు అనేకం కనుమరుగైపోయాయి. ఇక ప్రభుత్వాలు వృద్ధి రేటు, ద్రవోల్బణం అదుపు అంటు సామాన్యులకు అర్దం కాని అనేక ప్రతిపాదనలు పెట్టి బడా పారిశ్రామిక వేత్తలను విపరీతముగా ప్రోత్సహించారు. వారు అడిగిన, అడగకపోయినా ప్రభుత్వము మాత్రము వారి మీద తమ ప్రేమను తగ్గించుకోలేదు. నిలబెట్టినంత కాలము పారిశ్రామిక రంగం అభివృద్ధి బాగానే సాగింది. కాని ప్రతికూల పరిస్ధితులు ఎదురవగానే మొత్తము వృద్ది రేటు మందగించి, మన కరెన్సీ విలువను పాతాళానికి తీసుకెళ్ళాయి. నిజానికి చెప్పాలంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి పేరిట ప్రభుత్వము చేపట్టిన ఉద్దీపణలు, ప్యాకెజీలు కొంత మంది మిలియనర్లగా అవతరించడానికి దోహదపడ్డాయని ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. భారిగా పెరిగిన వారి ఆదాయాలను చూపి మన దేశము అభివృద్ధి చెందుతుందన్నదానికి నిదర్శనంగా చూపారు. ఎప్పుడు లేనిది ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల స్దానాలు ఎక్కువ కావడం కూడా ప్రభుత్వ విధానాలు వారికి దోహదం చేసాయని చెప్పోచ్చు. కాని మిగతా రంగాల్లోని వారు చాలా హీన స్దితికి దిగజారడానికి కారణం ప్రభుత్వ విధానాలే.
అప్పట్లో ఒక సామెత ఎక్కువగా వినబడేది. "భారతదేశము చాలా ధనిక దేశము. కాని భారతీయులు మాత్రము పేదవారు" అని. ఎన్ని అటుపోట్లు ఎదురయినప్పటికి, మరియు ప్రభుత్వాల నుండి సరయిన సహకారము లేకపోయినప్పటికి వ్యవసాయ రంగము మరియు యితర చిన్న పరిశ్రమలు తమ మనుగడను కొనసాగించడం ద్వారానే ఈ మాత్రము అర్దిక స్దిరత్వం ఉందని చెప్పవచ్చు. సంస్కరణల ద్వారా దేశాన్ని అభివృద్ధి పధంలో పరిగెట్టిస్తామని చెప్పిన అర్దికవేత్త మహశయులు, నేటి అర్దిక దుస్దితికి ఏమని సమధానము చెపుతారు?? తాము చేసిన చర్యలు ఫలితముగానే నేడు ఈ దుస్దితి దాపురించిదని చెపుతారా??? చెప్పరు..... ఎందుకంటే తాము అర్దికవేత్తలు కాబట్టి. దీనికి కారణముగా ప్రపంచ మార్కెట్టులో పతనంను ఒక కారణంగా చూపిస్తారు. అటువంటప్పుడు మన అర్దిక వ్యవస్దను ప్రపంచ మార్కెటుకి అనుబందంగా ఎందుకు తయారుచేసారని అడిగితే, సమాధానము ఉండదు. ఏది ఏమైనా దేశ అర్దిక వ్యవస్ద అనేది ఏదో ఒక రంగం మీద ఆధారపడియుండ కూడదు. అదే విధముగా వేరొక దేశ అర్దిక వ్యవస్ద ఆధారముగా ఉండకూడదని ఈ ఉందతమ్ తెలియజేస్తుంది
...

1 comment: