Tuesday 20 December 2011

రష్యన్ కోర్టు భగవద్గితని నిషేదించడం ద్వారా హైందవ సంస్కృతికి వచ్చిన నష్టమేమి లేదు................

రష్యన్ కోర్టు ఒకటి, గీతాసారాంశమును ఉన్మాద చర్యగా అభివరిస్తూ నిషేదము విధించిన వార్త భారతదేశములో హైందవుల విపరీతమైన కోపానికి కారణమయింది. దీనిపై దేశములో అన్ని పక్షాలు తమ నిరశనను తెలియజేసాయి. మరియు అన్ని టి.వి. చానల్స్ లోనే దీనిపైనే చర్చ. పని ఉన్నోడు, లేనోడు ప్రతి ఒక్కడూ వచ్చి తమకు తెలిసిన చరిత్రనంతా గడబిడ వాగేస్తున్నారు. కాని గీత సారాంశమును ఏ ఒక్కరో నిషేదించినంత మాత్రాన, దాని యొక్క పవర్ తగ్గిపోదు. దాని యొక్క అద్బుత శక్తి నాశనమయిపోదు.
 ఎవడూ ఉన్నా, పోయినా, ప్రపంచం ఉన్నా, లేకపోయినా దానిని మార్చగలిగే శక్తి ఎవరికి లేదు. నా ఉద్దేశములో అరచేతితో సూర్యున్ని ఆపడం ఎంత కష్టమో, భగవధ్గీత మీద విషము చిమ్మడం కూడా అంతే. ప్రపంచంలో ఏదో ఒక కోర్టు భగవధ్గీత మీద విమర్శలు చేసినంత మాత్రానా భగవద్గీతకి ఉన్న పవిత్రతకి నష్టమేమి లేదు. నిజానికి ఈ విధమైన విమర్శలు ఈ నాటివి కాదు. ప్రపంచం మొత్తం మీద అత్యంత పురాతనమైన సంస్కృతి హైందవ సంస్కతే అన్న సంగతి ప్రతి ఒక్కడికి తెలుసు. అటువంటి పురాతనమైన హైందవ సంస్కృతి పై చాలా కాలము నుండే దాడి మొదలయింది. ఆ దాడి, గత శతాబ్దములో జనించిన యితర మత సంస్దల నుండే కావడం చాలా దురదృష్టం. హైందవ సంస్కృతి అత్యంత పురాతనమైనప్పటికి పరమత సహనం పాటించింది. హైందవ మతము ఏ యితర మత గ్రంధాల జోలికి గాని, మత నియమాల జోలికి కాని వెళ్ళిన సందర్బాలు లేనేలేవు అని చెప్పవచ్చు. మొన్న ఆ మధ్యన వాటికన్ సిటి అధికార వర్గాలు యోగా అభ్యాసముపై విమర్శలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. వాస్తవానికి యోగా అనేది మానవ ఆరోగ్య పరిరక్షణకి సంబందించినదని అందరికి తెలుసు. 
 అటువంటి యోగాకి ఈ మధ్యన ప్రపంచమంతా విపరీతమైన ప్రాచుర్యం పొందింది. దేశ విదేశాలలో అనేక మంది యోగాను అభ్యసించడం ద్వారా దానికి విశేష ప్రాచుర్యం వచ్చింది. అంతే కాకుండా విదేశాలలో కొన్ని యూనివర్శిటిలలో యోగా మీద స్పెషల్ కోర్సులు కూడా ప్రారంభించారు. అటువంటి యోగా మేనియా ప్రపంచం మంతటా విస్తరించడంతో దానికి మతపరమైన రంగుని పులిమి, వివాదస్పదం చేయడానికి వాటికన్ సిటి అధికార వర్గాలు పాల్పడ్డాయని తెలుస్తుంది. దీనికి కారణం యోగా ని హైందవ సంస్కృతిలో భాగంగా వారు పరిగణించడమే. వారికి చెందిన వ్యక్తులే తాజాగా భగవధ్గితలో గీతా సారాంశమును ఉన్మాద చర్యగా పరిగణించి, దానిపై చర్యలకు కోరడం జరిగినదని వార్తసాధనాల ప్రసారాల ద్వారా తెలుస్తుంది. చాలా దశబ్దాల క్రిందటే, అంటే విదేశియులు మన దేశములో ప్రవేశించేనాటికే మన దేశములో ఉన్న హైందవ సంస్కృతిని తుడిచివేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కాని అవేవి సఫలం కాలేదు. పైగా అందులో చాలా మటుకు హైందవంలో కలసిపోయిన దాఖలాలు ఉన్నాయి. హైందవం ఎప్పుడూ తన మతప్రచారము చేసుకోలేదు. యితర మతస్దులను తమ మతములోకి రమ్మని ఏనాడు పిలవలేదు. పిలవదు కూడా. ఎవరికైనా తమంతట తామే హైందవ సంస్కృతికి ఆకర్షితులై ఇందులోకి రావాలి తప్ప, ఎవరూ రమ్మని ఫోర్స్ చేయరు. కాని ఈ విషయములో భగవధ్గీత మీద విమర్శలు గుప్పిస్తున్న సంస్దలు సమాధానం చెప్పగలవా?? చాలా మంది విదేశియులు భారతదేశానికి వచ్చి ఇక్కడి సంస్కృతికి దాసోహామయి హైందవంలోకి మారారు. ఇంకా మారుతున్నారు. అందులో అనేక మంది సెలబ్రీటిలు ఉన్నారు కూడా... వారెవరిని ఇందులోకి రమ్మని పిలవలేదు. వారంటవారే వచ్చారు. అదీ హైందవ మతము గొప్పతనము. ఈ విధముగా హైందవ సంస్కృతికి పెరుగుతున్న ఆదరణ చూసి కొన్ని యితర మత సంస్దలకు గిట్టకపోవడం సహజమే. కాని అది ఈ రకమైన దుగ్దకి కారణమవుతుందని నేనుహించలేదు.


ఇకపోతే హైందవ సంస్కృతికి ఈ దుస్దితి రావడం చాలా వరకు హిందువుల పాత్ర కూడా ఉంది. అద్యాత్మిక స్వేచ్చ ఉండడం వలన మతపరమైన నిబంధనలను అందరూ పాటించడం లేదు. మరియు చాలా మందికి తమ సంస్కృతికి సంబందించిన పూర్తి సమాచారము తెలియదు. సంస్కృతి తరతరాలకి మెసుకువెళ్ళవలసిన పెద్దవాళ్ళు, సదరు భాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవడం వలన సంస్కృతి యొక్క గొప్పతనమును తర్వాత తరమునకు అందించలేకపోతున్నారు. నిజానికి ఈ నిర్లక్ష్యమే హైందవ సంస్కృతికి నిజమైన శత్రువు.
హైందవ సంస్కృతి పై విమర్శలు చేయడం ద్వారా తమ మత ప్రాప్తిని పెంచుకొందామనుకొనే మత సంస్దలకు నేను చెప్పేదొక్కటే. గీత సారాంశము పై మీరు విమర్శలు చేసినంత మాత్రానా దాని యొక్క శక్తి నశించిపోదు. దాని వలన దాని యొక్క శక్తి ఇంకా పెరుగుతుందని యిందుమూలముగా యితర మతసంస్దలకు తెలియజేస్తున్నాను. మిగతా మతసంస్దల్లో లొసుగులు చెప్పాలంటే, ఇప్పటికిప్పుడే పలు అంశాలు చెప్పగలను. కాని వాటిని నేను ఎన్నటికి తెలియజెప్పను. ఎందుకంటే నా సంస్కృతి పరమత సహనము పాటించమని చెప్పింది. మరియు అన్ని మతాల సారాంశమొక్కటే అని చెప్పింది. ఈ సూక్తిని అన్ని ధార్మిక సంస్దలు పాటిస్తే చాలా మంచిది.
ధర్మమును నీవు రక్షిస్తే, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది

No comments:

Post a Comment