Wednesday 14 December 2011

ఐ.ఎ.ఎస్. లు రాజ్యాంగ అతీతులా?? వారిని విచారించకూడదా??

ఎమ్మార్, ఓబుళాపురం మైనింగ్ ఆక్రమాలు తదితర కేసులలో సి.బి.ఐ. దర్యాప్తు చేపట్టిన దరిమిలా, ఈ మధ్యన అయా కుంభకోణాలతో సంబందం ఉన్న అప్పటి ఐ.ఎ.ఎస్. అధికారులను సి.బి.ఐ. అధికారులు విచారణ నిమిత్తము పలు పర్యాయములు తమ కార్యాలయాలకు పిలిపించుకోవడం, మరియు అవసరమైతే అరెస్టులు చేయడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు రాజగోపాల్ మరియు శ్రీలక్ష్మి తదుతరులను అరెస్టు చేసారు. ఇందులో రాజగోపాల్ ఇదివరకే రిటైర్ కాగా, శ్రీలక్ష్మి విధినిర్వహణలో ఉండగా అరెస్టు జరిగింది. ఇది జరిగిన తర్వాత ఐ.ఎ.ఎస్.లు అందరూ సదరు అరెస్టులను ముక్తకంఠంతో ఖండించి, సదరు అరెస్టుల విషయములో సి.బి.ఐ.కి ముకుతాడు వేయవలసినదిగా ప్రధాన కార్యదర్శిని కోరడం వరకు వెళ్ళింది. దానితో ప్రదాన కార్యదర్శి వారు సదరు సి.బి.ఐ. వారితో సమావేశము ఏర్పాటు చేసి, తమ వారిని ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని సూచించారు. ఇదంతా చదివిన తర్వాత అహా.... ఏమి ఔదార్యం... తోటి ఐ.ఎ.ఎస్.లు అవినీతి వ్యవహారముల్లో పీకలదాక మునిగితేలి ఉంటే, ఆ విషయాలను చూసి చూడనట్టు వదిలేయాలని సి.బి.ఐ. వార్కి సూచించడం ఏ సంస్కారము క్రిందకి వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. సామాన్య ఉద్యోగులు ఏ మాత్రము చిన్న అవినీతికి పాల్పడిన కఠినంగా వ్యవహరించే ఈ ఐ.ఎ.ఎస్.లు, తన దాకా వచ్చిన తర్వాత దానిని యిబ్బందులగా అభివర్ణిస్తారా?? సామాన్యుడు తప్పు చేస్తే ఒకలా, వీరు తప్పు చేస్తే ఒకలా చూడాలా?? వాస్తవానికి సామాన్య ఉద్యోగి కన్నా, పై స్దాయి అధికారులే నిబద్దత కల్గిఉండవలసిన అవసరము లేదా?? పై అధికారి నిబద్దతతో ఉంటే వారి క్రింద స్దాయి సిబ్బంది నిబద్దతతో ఉండరా?? ఇండియన్ సివిల్ సర్వీసు అధికారులుగా వారు ప్రభుత్వానికి, రాజ్యాంగానికి రక్షణగా వ్యవహరించవలసిన వారు డబ్బులు కోసము తమ కున్న అధికారాలను కుంభకోణాలు చేయడానికి ఉపయెగిస్తారా??? అవినీతి కుంభకోణాలకు జరగడానికి అస్కారమిచ్చిన జి.ఒ.లను విడుదల చేసిన వారిని ఏమనకూడదట....... పైగా వాటనన్నింటిని రాజకీయ ఒత్తిళ్ళు వల్లనే అని వివరణ ఇచ్చుకోవడం చూస్తుంటే, ఇక ఆ అధికార స్దానాలలో వారు ఎందుకు??? తప్పు చేసిన వాడు ఎవడన్న సరే శిక్ష అనుభవించవలసినదే..... ఎమ్మార్, ఓబుళాపురం గనుల కుంభకోణాల విషయములో ముఖ్యమైన జి.ఒ.ల విడుదల విషయములో సంబందిత మంత్రులతో బాటుగా ఐ.ఎ.ఎస్.ల పాత్రను కూడా ఖచ్చితముగా చూపవలసినదే... అదే ప్రస్తుతం సి.బి.ఐ. చేస్తుంది..... కాని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి మరియు ఐ.ఎ.ఎస్.ల సంఘం అధ్యక్షులు కలసి సి.బి.ఐ. జాయింట్ సెక్రటరీతో తమ వారిని యిబ్బంది పెట్టడం మానుకోవాలని సూచించడం చూస్తుంటే, అది చూస్తున్న ప్రభుత్వం, కోర్టులు ఏమి స్పందించకపోవడం ఏంటొ నాలాంటి సామాన్యుడికి అర్దం కావడం లేదు.

No comments:

Post a Comment