Monday 12 March 2012

భారత్ కి యువ నాయకులు కావాలి...

దేశ రాజకీయాలను గమనించేవారు ఈ మధ్యన జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో
యువనాయకత్వంను గురించి ఎక్కువగా చర్చించుకొనియుంటారు


మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పుకోవలసినది ఇద్దరు యువకుల గురించి..

వారిద్దరు వేర్వేరు పార్టిలకు చెందిన యువ సారధులు
ఒకరెమో జాతీయ పార్టీ ఆయిన కాంగ్రెసు పార్టికి చెందిన యువ సారధి రాహుల్ గాంధీ కాగా
 ఇంకోకరెమో ఉత్తరప్రదేశ్ లో ప్రాంతియ పార్టి ఆయిన సమాద్ వాదీ పార్టికి చెందిన అఖిలేశ్ యాదవ్....


ఈ ఎలక్షన్స్ ద్వారా దేశ పరిశీలకుల దృష్టిని తమ మీదకు తీసుకురావడం ద్వారా
భారతదేశానికి ప్రస్తుతం యువ నాయకత్వం కావలసిన అవసరం పై చర్చ రేకేత్తించారు

 ఈ యువ నాయకులిద్దరూ తమ హుందాతనంతో నూతన ట్రెండ్ ని ప్రారంబించారని అనుకోవచ్చు
 గెలుపోటములు విషయాన్ని ప్రక్కన పెడితే ఇద్దరూ యువ సారధులు తమ తమ
శక్తి సామర్ద్యంలతో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో పోటిపడ్డారు



 నేటి రాజకీయాల్లో విలువల్లేని రాజకీయనాయకులతో సామాన్య ప్రజానీకంతో చీదరించుకోబడుతున్న
పరిస్దితుల్లో వ్యక్తిగత విమర్శలకు,  చవకబారు విమర్శలకు దూరంగా ఉండడం ద్వారా అఖిలేశ్ యాదవ్
 ప్రజల అభిమానంను చూరగొన్నారు. తాను చేసే ప్రసంగాల్లో ఎక్కడ వ్యక్తిగత విమర్శలు లేకుండా
జాగత్రపడి, సిద్దాంతపరమైన విమర్శలు మాత్రమే చేయడం ద్వారా రాజకీయాల్లో ఒక కొత్త
ఒరవడిని తీసుకువచ్చినట్టుగా భావించవచ్చును.

అదే విధంగా రాహుల్ గాంధీ కూడా తన శక్తి మేరకు కష్టపడినప్పటికి, పార్టిలో ఉన్న
యితర సీనియర్ నేతల విచ్చలవిడి వ్యాఖ్యానాల ద్వారాను, మరియు కుల రాజకీయాల
గురించి మాట్లాడడం ద్వారా ప్రజల్లో కాంగ్రెసు పట్ల ఉన్న మంచి అభిప్రాయము మట్టికొట్టుకుపోయింది.
ఈ విషయములొ రాహుల్ గాంధీని అని ఉపయెగం లేదు...
కాని తన చుట్టు అటువంటి నీచ నాయకులను ఉంచుకోవడం ద్వారా, ఆయన తన కష్టార్దితంను
బూడిదలో పోసుకున్నారు.

ఇటు సమాదివాదీ పార్టిలో తండ్రి ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ కి పూర్తి స్దాయి అధికారములు
ఇవ్వడంతో, అఖిలేశ్ ఈ విషయములో తను జాగత్తలు తీసుకోవడంతో పాటు, తన పార్టి నాయకులెవరూ
విచ్చలవిడి వ్యాఖ్యానలు చేయకుండా నివారించగలిగారు...
ఏది ఏమైనా ఈ ఎన్నికల ద్వారా యువ నాయకులు రాజకీయాల్లో కొత్త ఒరవడిని ప్రారంబించినట్టుగా
భావించవచ్చును.

ప్రపంచం అంతా జెట్ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు, మనము కూడా అదే వేగముతో వెళ్ళవలసిన
అవసరం ఎంతైనా ఉంది.. ఆ విధముగా ఉండాలంటే పరిపాలనలో యువకులకు భాగస్వామ్యం
కల్పించవలసిన అవసరం ఎంతైనా యుంది...

దురదృష్టశావత్తూ అధికార వ్యామెహంలో పడి నాయకులు కాడికి వెళ్ళేవరకు పదవిలో ఉండడానికే
అతృత చూపుచున్నారు. దాని వలన పరిపాలన అనుభవము వృద్ద తరము నుండి యువ తరానికి
బదిలీ కావడానికి చాలా సమయము తీసుకుంటుంది....

ఇప్పటికి మన దేశ నాయకుల్లో ఆగ్రజ్ణులు అనదగ్గవాళ్ళలో చాలా మంది డెబ్బయి ఏళ్ళు పైబడి
యున్నవాళ్ళే యున్నారు....


ఈ విషయమును గుర్తించి ఉత్తరప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిగా అఖిలేశ్ ని నియమించడం

స్వాగతించదగిన పరిణామం. మరియు ఫలితాలు వెలవడిన తర్వాత ప్రజలకు కృతజ్ణతలు తెలపడం ద్వారా తాను ప్రజల మనిషిననే సందేశమును ఇవ్వగలిగారు. అంతే కాకుండా తన ప్రధమ ప్రాధాన్యత లా అండ్ అర్డర్ అని తెలియజేయడం ద్వారా తమ పార్టిలోని గుండాయిజంను అదుపులో పెట్టడం గురించి పరోక్షంగా తెలియజేసారు.

ఉత్తర ప్రదేశ్ లో తమ పార్టి పరాభవానికి భాద్యత వహిస్తున్నాని నిజాయితీగా ప్రకటించడమే కాకుండా, ప్రత్యర్ది ఆయిన అఖిలేశ్ కి అభినందనలు తెలపడం ద్వారా రాహుల్ తన హుందాతనంను నిలుపుకున్నారు.

ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెసు పార్టి పరాజయం జరిమిలా రాహుల్ గాంధీ సామర్ద్యంను తక్కువ చేయడం తగదు. ఒక పార్టి పరాజయం పాలవ్వడమనేది అనేక అంశాల మీద ఆధారపడీ యుంటుంది. అంతేకాని దాన్ని మొత్తం ఒక వ్యక్తి అసమర్దతగా జమకట్టడం సరికాదు..


అందుచేత రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవడం ద్వారా దేశ రాజకీయాల్లో యువత ప్రవేశాన్ని స్వాగతించాలి. సచిన్ పైలట్, జ్యోతిరాధిత్య సింధియా లాంటి నాయకులను తెరపైకి తీసుకురావాలి..

కాని ఇందులో ఖండించవలసిన అంశామేమిటంటే.. .వీరంతా వారస్వత రాజకీయాల ద్వారానే రావడం..

ప్రస్తుత పరిస్దితుల్లో యువత స్వంతంగా రాజకీయాల్లోకి రావడం గగనమే. కాబట్టి ఉన్నంతలో
కొద్దిగా నిజాయితీ కల్గిన యువ రాజకీయాల నాయకులకు పగ్గాలు అప్పగించడం దేశ భవిష్యత్తుకు ఉపయెగపడుతుంది   

6 comments:

  1. లెస్స పలికితిరి..

    ReplyDelete
  2. jyothirmai gariki,
    thnak u madam...

    ReplyDelete
  3. యువ నాయకత్వం రావడం మంచిదే కానీ రాజకీయ నాయకుల పిల్లలు మాత్రమె యువకులా? యువతకు పట్టం అనే ముసుగులో వారసత్వ పోకడలు విజ్రుంభిస్తున్నాయి.

    ReplyDelete
  4. జై గొట్టుముక్కల గార్కి,
    మీరన్న దానితో నేను వంద శాతం ఏకిభవిస్తాను సార్. ఆ విషయమును నేను నా అర్టికల్ లో
    కూడా ఉదహరించాను. కాని ఇప్పుడున్న పరిస్దితుల్లో మీరన్న విధముగా సామాన్య యువకులు
    రాజకీయాల్లో పైకి రావడమనేది కల్ల... ఉన్నంతలో వీళ్ళు బెటర్ అని నా అభిప్రాయం (వృద్ద దంబుకాలుతో పోల్చుకుంటే).
    ధన్యవాదములు..

    ReplyDelete
  5. @రాజీవ్ రాఘవ్: మీరు వారసత్వ రాజకీయాలను విమర్శించిన మాట నిజమే. అయితే ఉన్నంతలో కొంచం బెటరు అనే వాదన సరి కాదేమో ఆలోచించండి. వీరే ఒక తరం తరువాత వృద్ధ జంబూకాలుగా అవతరించే అవకాశం ఉంది. ఉ. కిరణ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, నాదెండ్ల మనోహర్, జగన్ లాంటి వారెవరూ తమ తండ్రులకంటే బెటరు అవుతారనే నమ్మకం లేదు. వయస్సు శాశ్వతం కాదు కానీ రాజకీయాలలో తండ్రి ద్వారా సంక్రమించిన చెడు గుణాలు మాత్రం వీరిని వదిలే అవకాశం కనిపించడం లేదు.

    ReplyDelete
  6. @జయ్ గొట్టిముక్కల గార్కి,
    మీరు చెప్పిన దానితో ఏకిభవిస్తున్నాను సార్....
    ఈ రోజుల్లో పూర్తిస్దాయి నిజాయితీని ఆశించలేములెండి ప్రస్తుతమున్న వారసుల్లో.....

    ReplyDelete