Tuesday 27 September 2011

సరసమైన ధరలు(ధనికులకు మాత్రమే)......

కేంద్ర వ్యవసాయశాఖామంత్రి శరద్ పవార్ బి.సి.సి.ఐ. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పలు ఒప్పందాలు ద్వారా దాని ఆదాయము ఇబ్బడిముబ్బడిగా పెంచడంతో ఆయన ఆలోచన విధానము కూడా లాభదాయక విషయాల మీదకు మళ్ళినట్టుంది. అది వ్యాపార రంగాలకు మాత్రమే పరిమితం అయితే బాగుండును. కాని ఆయన బి.సి.సి.ఐ అధ్యక్ష పదవితో బాటుగా కేంద్ర వ్యవసాయశాఖామంత్రిగా కూడా పనిచేస్తున్నరన్న విషయము తెలిసిందే. కాని ఇక్కడ ఉన్న సమస్యమేమిటంటే ఆయన తన రెండు పదవులను ఒకే దృష్టితో చూస్తున్నట్టున్నారు. (ఆయన ఇప్పుడు ఐ.సి.సి. అధ్యక్షుడు కూడా అయ్యారు). క్రీడల్లో నైపుణ్యంను చూడవలసిన వారు, అందులో వ్యాపార అవకాశాలు కూడా ఎలా అందిపుచ్చుకోవచ్చో క్రికెట్ ద్వారా నిరూపించారు. ఒకప్పుడు క్రికెట్ ఆట ద్వారా నాణ్యమైన ఆటగాళ్ళను తయారుచేయడం, తద్వారా అంతర్జాతియ క్రికెట్ లో మన సత్తా చాటడం కోసము నియమితమైన బి.సి.సి.ఐ, నేడు అది ఒక పెద్ద వ్యాపార కేంద్రం గా మారడంలో శరద్ పవార్ పాత్ర మరువలేనిది. మానసిక ఉల్లాసానికి మరియు కోట్ల మంది ప్రజానీకం బావోద్వేకాలకు ఉద్దేశించిన క్రికెట్ ను పూర్తి స్దాయి వ్యాపార అంశంగా మార్చివేసారు.
ఆయితే దీని వల్ల ఎవరికి నష్టం లేదు. ఎందుకంటే ప్రజలకు అది ఒక వినోదపు వస్తువు మాత్రమే. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు మానేస్తారు. పైగా అది ప్రెవేటుకు సంబందించిన వ్యవహారము కాబట్టి, అందులో లావాదేవిల వలన ప్రజలకు నష్టం లేదు...

కాని నిన్న జరిగిన వ్యవసాయ శాఖా అధికారుల సమావేశంలో వరికి మద్దతు ధర పెంచే విషయమై, అందరికి సరసమైన ధరల గురించి ప్రస్తావించారు (ఇప్పుడు ఆయన బి.సి.సి.ఐ. ప్రెసిడెంటు కాదు.. వ్యవసాయశాఖామంత్రి అని గుర్తుంచుకోగలరు). వ్యవసాయ పంటలకు సరయిన మద్దతు ధరలు లేక , వ్యవసాయము భారమయిన ప్రస్తుత పరిస్దితుల్లో వరికి మద్దతు ధర పెంచవలసిన అవశక్యత గురించి స్వామినాధన్ కమిటి చేసిన సిపార్సులను ఏ మాత్రం పట్టించుకోకుండా, వరికి మద్దతు ధర పెంచితే, ఆ భారము వినియెగదారుల మీద పడుతుంది. కాబట్టి మద్దతు ధర కల్పించే విషయములో, వినియోగదారుల ప్రయెజనాలు (సరసమైన ధరలు) కూడా లెక్కలోకి తీసుకోవాలని సెలవిచ్చారు. అహా వినియెగదారుల మీద అమాత్యుల వారికి ఎంత ప్రేమ... ఎంత ప్రేమ... అని గుండెలు బాదుకోవలనిపించింది విన్నవాళ్ళందరికి...... మరి వరికి మద్దతు ధర పెంచితే, ఆ భారము వినియెగదారుల మీద పడుతుందని ఎంతో "దురా"లోచన చేసిన అమాత్యులు, మరి ఈరోజు చుక్కల్లో ఉన్న మిగతా వాటి గురించి ఏ మాట సెలవివ్వలేదుమేమిటో ఆయన నొటి ద్వారానే వినాలని వుంది... అదే విధముగా ఎరువులు, విత్తనాల కంపెనీలకు వాటి ధరలను ఇష్టానుసరంగా పెంచుకొనేందుకు అనుమతించినప్పుడు, మరి ఈ సరసమైన ధరలు ఎవరికి అందుబాటులో ఉన్నాయో చెప్పలేదు. ఈ రోజు వినియెగదారులకు సరసమైన ధరలు అందుబాటులో ఉంచాల్సిన అవసరము తమకుందన్న వ్యవసాయశాఖామాత్యుల వారు, ఏ వస్తువులు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయో చెప్పాలి. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాకుండా పోతున్నా, మొక్కవోని దీక్షతో వ్యవసాయము చేస్తున్న రైతు కష్టాన్ని ఆయన ఏ విధముగా అర్దం చేసుకొన్నారో చూస్తుంటే, ఆయన ప్రజా సంక్షేమాన్ని ఆశిస్తున్నారా లేక ధనికుల సంక్షేమాన్ని ఆశిస్తున్నారా అనిపిస్తుంది. ఏ రోజు కూడా రైతు లాభాపేక్షతో వ్యవసాయము చేయడమ్ లేదు. అదే రైతుల పాలిట శాపమయింది.
ఈ అర్దిక సం.లో పెట్రోలు ధర, డిజీల్ ధర, పప్పులు, గ్యాస్ బండలు, ఎరువులు, విత్తనాలు అన్నింటిని ఇష్టానుసరంగా పెంచుకుంటు పోయినప్పుడూ ఈయన గారి బుద్ది ఎక్కడుంది... పైవన్నీ పెంచుకుంటు పోయునప్పుడు, వినియెగదారుడుకి సరసమైన ధరలు లెక్క ఆలోచనలోకి రాలేదా.... ఏం అప్పుడు గడ్డి తింటున్నారా..... లేక గడ్డి పీకుతున్నారా...... ధనికులు లాభపడతారనుకుంటే ఏదైనా చేయోచ్చు... అదే రైతులకు మద్దతు ధర ప్రకటించాలంటే లెక్కలు గుర్తుకువస్తాయా? పోనీ బియ్యం ఆయిన బహిరంగ మార్కెటులో సరసమైన ధరలకు ఎందుకు దోరకడం లేదు??? దీనికి కూడా ఆయనే సమాధానము చెప్తే బాగుంటుంది. రాజకీయాల్లో ఇలాంటి అడ్డమైన గాడిదలున్నంత కాలము ప్రజలు ఇబ్బందులు పడవలసినదె. ఏదో ఒక రోజు రైతులు మొత్తము వ్యవసాయానికి స్వస్తి పలకక పోరు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రోజు మద్దతు ధర కోసము ప్రాకులాడవలసిన అవసరము రైతులకు రాదు. అప్పుడు రైతులు వారికి మాత్రమే కావలసిన ధాన్యం, కూరగాయలను పండించుకుంటారు. మిగతా అవసరాల కోసము కూలీ చేసుకోని డబ్బు సంపాదించుకుంటారు. ఆ రోజు మిగతా రంగాల వార్కి కావలసిన ఆహర ధాన్యాల గురించి, రైతుల దగ్గరికి వచ్చినప్పుడు, వారికి నచ్చిన ధరకు కొంటేనే అమ్ముతామని ఖరాఖండిగా చెప్పే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయి.....

No comments:

Post a Comment