Thursday 15 September 2011

మీడియా...ఏ ఎండకా ఆ గొడుగా???

ప్రస్తుతం దేశ రాజకీయాలలో ఎక్కువగా చర్చించుకొంటున్నది దేని గురించో తెలుసా... సుప్రింకోర్టు మరియు సి.బి.ఐ. ప్రభుత్వాలలో పేరుకుపోయిన అలసత్వాన్ని ఈ మధ్య కాలములో తేరగా ఏకి పారేస్తున్న సుప్రింకోర్టు గురించి ఈ మధ్య రాజకీయాల్లోను, మీడియాలోను పెద్ద హట్ టాపిక్ ఆయిపోయింది. తర్వాత సి.బి.ఐ. సెంట్రల్ బ్యూరో ఇన్ స్వెగేటన్ అఫ్ ఇండియా... ఏ ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్న దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మీడియా కూడా సుప్రింకోర్టు మరియు సి.బి.ఐ. ల ఘనకార్యాల గురించి పుంఖానుపుంఖలుగా వార్తలు ఇస్తునే ఉంది.. యాక్చువల్ గా ఇందులో చెప్పుకోడానికి ఏమి లేదు.... కాని మన రాజకీయ నాయకులు మరియు మీడియా యొక్క అవకాశవాదం గురించి మాట్లాడాలి. ఈ మధ్య కాలములో వరుస పెట్టి వెలుగులోకి వచ్చిన కామన్ వెల్త్ , జీ మొ.గు కుంభకోణాలు వెలుగులోకి రావడం మరియు అందులో నిందితులు జైలుకి వెళ్ళడంలో సుప్రింకోర్టు యొక్క క్రియాశీలక పాత్ర ఉంది... ఆయితే ఈ చర్యల ద్వారా సుప్రీంకోర్టు పనితీరుని ఆకాశానికి ఎత్తేస్తున్న ప్రస్తుత రాజకీయ నాయకులు మరియు మీడియా వారే గతములో ఇదే కోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు పై అపేక్షణ వెలుబుచ్చిన సందర్బాలు చాలా ఉన్నాయి.


 ఈ వ్యత్యాసమునకు గల కారణమేమిటన్నది ప్రతి ఒక్కరికి తెలిసినదే.. దురదృష్టశావత్తు దేశములో ఉన్న ప్రధాన మీడియాలన్ని ఏదోక ఒక పార్టికి అనుకూలముగా ఉండడం లేక రేటింగులు పెంచుకోవడం కోసము ఇష్టపూర్వక రాతలు వ్రాసేస్తున్నారు. మీడియా దేశములో ఉన్న వాస్తవ పరిస్దితులను యధాతదముగా తెలియజేయకుండా, తాము కొమ్ము కాస్తున్న రాజకీయ పార్టిలకు అనుకూలముగా వార్తలు ప్రచురించడం విచారకరం. అదే విధముగా గతములో పలు కేసులలో సి.బి.ఐ. దర్యాప్తు చేసిన పలు కేసుల్లో విచారణ తమకు అనుకూలముగా రానప్పుడు, దాని మీద విచ్చలవిడి విమర్శలు చేసి, అది సెంట్రల్ బ్యూరో ఫర్ ఇన్ స్వెగేషన్ కాదని, అది కాంగ్రెస్ బ్యూరో ఇన్ స్వెగేషన్ అని పలుమార్లు తెలుగుదేశం మరియు ఇతర ప్రతిపక్ష పార్టిలు మరియు ఈనాడు మీడియా విమర్శలు చేయడం మనకు విదితమే, అంతే కాకుండా తమకు సి.బి.ఐ. మీద నమ్మకం లేదని, అది ప్రభుత్వానికి అనుకూలముగా పనిచేయడానికే ఉందని పదే పదే విమర్శలు గుప్పించిన రాజకీయ నాయకులు మరియు మీడియా, నేడు అదే సి.బి.ఐ. దర్యాప్తులో విచారణ ఎదుర్కొంటున్న అవినీతి రాజకీయ నాయకులు తమకు ప్రత్యర్ది వర్గానికి చెందినవారు కావడంతో ఒక్కప్పుడు తాము తూలనాడిన ఆనాటి సి.బి.ఐ. పనితీరుని నేడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కారణమేమిటో మనందరికి తెలిసిందే. అదే విధముగా ప్రస్తుతం సి.బి.ఐ.విచారణను ఎదుర్కొంటున్న జగన్, గాలి జనార్దన్ రెడ్డిలు అధికారములో ఉన్నప్పుడు తమపై వచ్చిన వివిధ రకముల ఆరోపణలు పై సి.బి.ఐ. దర్యాప్తును జరిపించుకొని క్లీన్ చిట్ పొంది, దాని ద్వారా తమ రాజకీయ ప్రత్యర్దుల మీదకి ఎదురు దాడిని దిగినప్పుడు సి.బి.ఐ. వార్కి సక్రమముగానే ఉన్నట్టుంది. కాని ఇప్పుడు అధికారము కోల్పోయి అదే సి.బి.ఐ. విచారణను ఎదుర్కొవలసివచ్చినప్పుడు, దాని పనితీరుని తప్పుబడుతున్నారు. ఈ రకమైన అవకాశ వాదము రాజకీయనాయకులకు ఉండోచ్చు. ఎందుకంటే అది వారి సహజబుద్ది..
కాని మీడియా బుద్ది ఏమయింది??? మన రాష్ట్రంలో ఉన్న ప్రదాన మీడియా అంతా కూడా విలువలు వదిలేశాయి. ఇందులో సాక్షి గురించి మాట్లాడుకోకవడమే బెటరు. ఎందుకంటే దాని గురించి రాసి నా విలువైన టైమ్ వేస్ట్ చేసుకోదలచుకోలేదు. ఇక మిగిలిన ఈనాడు పేపరు పక్కా పక్షపాతంగా వ్యవహారిస్తున్నట్టు తెలిసిపోతుంది.. ఇది తెలుగు దేశము పార్టికి మద్దతుదారు అని ప్రజలందరికి తెలుసు.... నేను ఈ పేపరులో వచ్చిన ఆర్టికల్స్ చాలా సార్లు ఒక విషయమై పరస్పర విరుద్దముగా వార్తలు వెలువరించిన సందర్బాలు చూసాను.. జగన్ మరియు గాలి అవినీతి విషయములో ఈనాడు మీడియా చూపిస్తున్న అత్యుత్సహం ఎందుకో ప్రత్యేకముగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ నేను జగన్, గాలి అవినీతి వ్యవహారములను మాత్రమే ఈనాడు మీడియా హైలెట్ చేస్తుంది అని చెపుతున్నాను. నిజానికి ఇవే కాకుండా ఇంకా చాలా దేశియ వనరుల విచ్చలవిడి దోపిడి జరుగుతుంది. అది ఈనాడు మీడియాకు కూడా తెలుసు. కాని ఏనాడు వాటి గురించి ప్రచురించదు. ఈ విషయములో అది కూడా పక్షపాతముగా గిట్టనివారి గురించే ప్రముఖంగా ప్రచురిస్తుంది. నేను ఒకప్పుడు అంతర్జాతియ, దేశియ, ప్రాంతియ వార్తలు కోసము ఎక్కువగా ఈనాడు పేపరు మీదే ఆధారపడేవాడిని. కాని ఇప్పుడు వాటి యొక్క శాతము విపరీతముగా తగ్గిపోయింది. ఇప్పుడంతా తమకు నచ్చని వారి న్యూస్ ప్రచురించడానికే స్దానము సరిపోవడం లేదు.
ఇకపోతే మిగిలింది ఆంద్రజ్యోతి మీడియా... రాజు గారి మొదటి బార్య మంచిది అని అంటే, దానిని రాయడం మానేసి రాజు గారి రెండొ భార్య చెడ్డది అని వార్త రాసే చెత్త మీడియా.... ఆది ఎప్పుడు వార్తలను సంచలనాత్మకముగా ఎలా ప్రచురించాల అని అలోచిస్తుందే తప్ప ప్రజలకు సరయిన వివరములు తెలియజెప్పలన్న అలోచన దానికి ఎప్పుడూ ఉండదు.. ఎక్కడయినా ప్రముఖులతో ఇంటర్వూ తీసుకొన్నప్పుడు వారు చెప్పిన మంచి మాటలను హెడ్డింగ్ గా కాకుండా, అనుకోకుండా అన్న చిన్న చిన్న నెగెటివ్ మాటలనే కొంచెం మసాలా జోడించి దానిని హెడ్డింగ్ గా పెట్టేస్తారు. అదండి మన మీడియా వరుస.. వీరందరూ ప్రజలందరికి సరయిన సమాచారము ఇవ్వడం కోసము పనిచేయడం లేదు. యాక్చవల్ గా మీడియా ఏ విషయములోను పక్షపాత వైఖరి ఉండకూడదు. అది ఎప్పుడూ తటస్దంగా ఉండాలి.. ఏ విషయానైన్న సరే సాధారణ విషయముగానే పరిగణించి న్యూస్ ఇవ్వాలి.. అంతే కాని గిట్టని వారి మీద ఒకలా, నచ్చిన వారి మీద ఒకలా రాయడం శ్రేయస్కరం కాదు. లేకపోతే విశ్వసనీయత కోల్పోతారు. ఇప్పటికే మన మీడియా మీద చాలా మందికి ఉన్న ఒపెనీయన్ తెలిస్తే వారందరు ఉరేసుకు చావాలి. ఈ రోజు చాలా మంది వార్తలు తెలుసుకోవడం కోసము మిగతా దేశియ మీడియా మరియు దేశియా మీడియా మీద ఆధారపడుతున్నరన్న సంగతి తెలుసుకోవాలి. ఏ ప్రాంతియ మీడియాను వీరు విశ్వసించడం లేదన్నది సత్యం. మీరు రాసినదే వేదము అని నమ్మే వాళ్ళు తగ్గుతున్నారన్న వాస్తవం తెలుసుకోని మసలుకుంటే వాళ్ళకి మంచిది.

No comments:

Post a Comment