Friday, 30 September 2011
Tuesday, 27 September 2011
సరసమైన ధరలు(ధనికులకు మాత్రమే)......
కేంద్ర వ్యవసాయశాఖామంత్రి శరద్ పవార్ బి.సి.సి.ఐ. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పలు ఒప్పందాలు ద్వారా దాని ఆదాయము ఇబ్బడిముబ్బడిగా పెంచడంతో ఆయన ఆలోచన విధానము కూడా లాభదాయక విషయాల మీదకు మళ్ళినట్టుంది. అది వ్యాపార రంగాలకు మాత్రమే పరిమితం అయితే బాగుండును. కాని ఆయన బి.సి.సి.ఐ అధ్యక్ష పదవితో బాటుగా కేంద్ర వ్యవసాయశాఖామంత్రిగా కూడా పనిచేస్తున్నరన్న విషయము తెలిసిందే. కాని ఇక్కడ ఉన్న సమస్యమేమిటంటే ఆయన తన రెండు పదవులను ఒకే దృష్టితో చూస్తున్నట్టున్నారు. (ఆయన ఇప్పుడు ఐ.సి.సి. అధ్యక్షుడు కూడా అయ్యారు). క్రీడల్లో నైపుణ్యంను చూడవలసిన వారు, అందులో వ్యాపార అవకాశాలు కూడా ఎలా అందిపుచ్చుకోవచ్చో క్రికెట్ ద్వారా నిరూపించారు. ఒకప్పుడు క్రికెట్ ఆట ద్వారా నాణ్యమైన ఆటగాళ్ళను తయారుచేయడం, తద్వారా అంతర్జాతియ క్రికెట్ లో మన సత్తా చాటడం కోసము నియమితమైన బి.సి.సి.ఐ, నేడు అది ఒక పెద్ద వ్యాపార కేంద్రం గా మారడంలో శరద్ పవార్ పాత్ర మరువలేనిది. మానసిక ఉల్లాసానికి మరియు కోట్ల మంది ప్రజానీకం బావోద్వేకాలకు ఉద్దేశించిన క్రికెట్ ను పూర్తి స్దాయి వ్యాపార అంశంగా మార్చివేసారు.
ఆయితే దీని వల్ల ఎవరికి నష్టం లేదు. ఎందుకంటే ప్రజలకు అది ఒక వినోదపు వస్తువు మాత్రమే. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు మానేస్తారు. పైగా అది ప్రెవేటుకు సంబందించిన వ్యవహారము కాబట్టి, అందులో లావాదేవిల వలన ప్రజలకు నష్టం లేదు...
కాని నిన్న జరిగిన వ్యవసాయ శాఖా అధికారుల సమావేశంలో వరికి మద్దతు ధర పెంచే విషయమై, అందరికి సరసమైన ధరల గురించి ప్రస్తావించారు (ఇప్పుడు ఆయన బి.సి.సి.ఐ. ప్రెసిడెంటు కాదు.. వ్యవసాయశాఖామంత్రి అని గుర్తుంచుకోగలరు). వ్యవసాయ పంటలకు సరయిన మద్దతు ధరలు లేక , వ్యవసాయము భారమయిన ప్రస్తుత పరిస్దితుల్లో వరికి మద్దతు ధర పెంచవలసిన అవశక్యత గురించి స్వామినాధన్ కమిటి చేసిన సిపార్సులను ఏ మాత్రం పట్టించుకోకుండా, వరికి మద్దతు ధర పెంచితే, ఆ భారము వినియెగదారుల మీద పడుతుంది. కాబట్టి మద్దతు ధర కల్పించే విషయములో, వినియోగదారుల ప్రయెజనాలు (సరసమైన ధరలు) కూడా లెక్కలోకి తీసుకోవాలని సెలవిచ్చారు. అహా వినియెగదారుల మీద అమాత్యుల వారికి ఎంత ప్రేమ... ఎంత ప్రేమ... అని గుండెలు బాదుకోవలనిపించింది విన్నవాళ్ళందరికి...... మరి వరికి మద్దతు ధర పెంచితే, ఆ భారము వినియెగదారుల మీద పడుతుందని ఎంతో "దురా"లోచన చేసిన అమాత్యులు, మరి ఈరోజు చుక్కల్లో ఉన్న మిగతా వాటి గురించి ఏ మాట సెలవివ్వలేదుమేమిటో ఆయన నొటి ద్వారానే వినాలని వుంది... అదే విధముగా ఎరువులు, విత్తనాల కంపెనీలకు వాటి ధరలను ఇష్టానుసరంగా పెంచుకొనేందుకు అనుమతించినప్పుడు, మరి ఈ సరసమైన ధరలు ఎవరికి అందుబాటులో ఉన్నాయో చెప్పలేదు. ఈ రోజు వినియెగదారులకు సరసమైన ధరలు అందుబాటులో ఉంచాల్సిన అవసరము తమకుందన్న వ్యవసాయశాఖామాత్యుల వారు, ఏ వస్తువులు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయో చెప్పాలి. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాకుండా పోతున్నా, మొక్కవోని దీక్షతో వ్యవసాయము చేస్తున్న రైతు కష్టాన్ని ఆయన ఏ విధముగా అర్దం చేసుకొన్నారో చూస్తుంటే, ఆయన ప్రజా సంక్షేమాన్ని ఆశిస్తున్నారా లేక ధనికుల సంక్షేమాన్ని ఆశిస్తున్నారా అనిపిస్తుంది. ఏ రోజు కూడా రైతు లాభాపేక్షతో వ్యవసాయము చేయడమ్ లేదు. అదే రైతుల పాలిట శాపమయింది.
ఈ అర్దిక సం.లో పెట్రోలు ధర, డిజీల్ ధర, పప్పులు, గ్యాస్ బండలు, ఎరువులు, విత్తనాలు అన్నింటిని ఇష్టానుసరంగా పెంచుకుంటు పోయినప్పుడూ ఈయన గారి బుద్ది ఎక్కడుంది... పైవన్నీ పెంచుకుంటు పోయునప్పుడు, వినియెగదారుడుకి సరసమైన ధరలు లెక్క ఆలోచనలోకి రాలేదా.... ఏం అప్పుడు గడ్డి తింటున్నారా..... లేక గడ్డి పీకుతున్నారా...... ధనికులు లాభపడతారనుకుంటే ఏదైనా చేయోచ్చు... అదే రైతులకు మద్దతు ధర ప్రకటించాలంటే లెక్కలు గుర్తుకువస్తాయా? పోనీ బియ్యం ఆయిన బహిరంగ మార్కెటులో సరసమైన ధరలకు ఎందుకు దోరకడం లేదు??? దీనికి కూడా ఆయనే సమాధానము చెప్తే బాగుంటుంది. రాజకీయాల్లో ఇలాంటి అడ్డమైన గాడిదలున్నంత కాలము ప్రజలు ఇబ్బందులు పడవలసినదె. ఏదో ఒక రోజు రైతులు మొత్తము వ్యవసాయానికి స్వస్తి పలకక పోరు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రోజు మద్దతు ధర కోసము ప్రాకులాడవలసిన అవసరము రైతులకు రాదు. అప్పుడు రైతులు వారికి మాత్రమే కావలసిన ధాన్యం, కూరగాయలను పండించుకుంటారు. మిగతా అవసరాల కోసము కూలీ చేసుకోని డబ్బు సంపాదించుకుంటారు. ఆ రోజు మిగతా రంగాల వార్కి కావలసిన ఆహర ధాన్యాల గురించి, రైతుల దగ్గరికి వచ్చినప్పుడు, వారికి నచ్చిన ధరకు కొంటేనే అమ్ముతామని ఖరాఖండిగా చెప్పే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయి..... Friday, 16 September 2011
మర్చిపోలేకపోతున్నా...
ప్రేమ ఎంత మధురం..... ఎడబాటు ఎంత కఠినం.....
లైఫ్ లో తన పని తాను సిన్సియర్ గా చేసుకుంటు పోయేవాడు ఎప్పుడూ ప్రేమలో పడడు...
ఒక వేళ ప్రేమలో పడితే, దానిని కూడా అంతే సిన్సియర్ గా చేస్తాడు......
నీ మీద నాకు ఇష్టం కలగడమే ఆశ్చర్యం.....
కానీ నిన్నే మనువాడలనుకొన్నా.....
నువ్వు కూడా నాతో కలసి అడుగు వేయడానికి సంసిద్దత వ్యక్తం చేయడంతో.....
నా కలల సౌధం నిర్మించుకొన్నా......
నువు నాకు దూరముగా ఉన్నప్పట్టికి నువ్వు ఉన్న నా కలల సౌధానికి వెళ్ళి సేద తీరా.....
ఒత్తిడి లోను, బాధలోని, సంతోషంలోను నిన్ను తలచుకొని రిలాక్స్ అయ్యా.,...
అంతగా నీ ప్రాణంతో మమేకమైపోయిన నేను.......
ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నీ చేయిని అందుకొనే అవకాశం కోసము ఎదురుచూసిన నేను.......
ఒక్కసారే నీతో తెగతెంపులు ఎందుకు చేసుకోవలనుకొన్నానో నీకు తెలుసా.........
ఎప్పుడూ అమ్మాయిలే ముందు తెగతెంపులు చేసుకుంటారు......
కాని నువ్వు నాతో కలసి ఉండాలని కోరుకొన్నప్పటికి నేను ఎందుకు నిన్ను వదులుకోవలని అనుకొన్నానో తెలుసా........
నీకు తెలుసు, నేను ఎందుకు నీ నుండి దూరముగా వెళ్ళిపోయానో........
ఇలా అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు........
ఎక్కడైనా ప్రేమికుల మధ్య మనస్పర్దలు వలన విడిపోతారు.......
కాని మనము మాత్రము వేరోక వ్యక్తుల అసూయ, అనుమాన వ్యాఖ్యాల కారణంగా విడిపోవడం భావ్యమా....
నన్ను ఇష్టపడీ, నువ్వు కూడా ఆ వ్యాఖ్యలను సమర్దించడం ఎంత వరకు భావ్యం......
నాకు అత్మభిమానం మెండు..... నా తప్పు లేకుండా నేను మాట పడను.....
కాని నువ్వు నన్ను కనీసము వివరణైన అడగకుండా మాట అన్నావు చూశావా??
ఆ రోజే నా మనసు గాయపడింది...... నాకు నీ ప్రేమ కన్న నా అత్మాభిమానమ్ గొప్పది.........
అందుకనే కఠిన నిర్ణయము తీసుకొన్నా......
కాని ఈ నాటికీ నిన్ను మర్చిపోలేకపోతున్నా.....
ఎప్పటికీ నిన్ను మర్చిపోలేకపోతున్నా....
నీ నుండి దూరముగా పారిపోవలనుకుంటున్నా....
కాని పారిపోలేకపోతున్నా.......
నీకు మరల దగ్గర కావాలని ఉంది........ కాని అదే సమయములో తన స్వార్దం చూసుకొన్న నాకిష్టమైన ఒక వ్యక్తి అసూయ గుర్తుకు వస్తుంది.....
నీకు, నాకు ఎడబాటుకు కారణము..... నిజముగా అతనే......
మనిద్దరి ప్రేమకి మధ్య అడ్డుగోడ నిజానికి అతనే అడ్డుగోడ........
Thursday, 15 September 2011
మీడియా...ఏ ఎండకా ఆ గొడుగా???
ప్రస్తుతం దేశ రాజకీయాలలో ఎక్కువగా చర్చించుకొంటున్నది దేని గురించో తెలుసా... సుప్రింకోర్టు మరియు సి.బి.ఐ. ప్రభుత్వాలలో పేరుకుపోయిన అలసత్వాన్ని ఈ మధ్య కాలములో తేరగా ఏకి పారేస్తున్న సుప్రింకోర్టు గురించి ఈ మధ్య రాజకీయాల్లోను, మీడియాలోను పెద్ద హట్ టాపిక్ ఆయిపోయింది. తర్వాత సి.బి.ఐ. సెంట్రల్ బ్యూరో ఇన్ స్వెగేటన్ అఫ్ ఇండియా... ఏ ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్న దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మీడియా కూడా సుప్రింకోర్టు మరియు సి.బి.ఐ. ల ఘనకార్యాల గురించి పుంఖానుపుంఖలుగా వార్తలు ఇస్తునే ఉంది.. యాక్చువల్ గా ఇందులో చెప్పుకోడానికి ఏమి లేదు.... కాని మన రాజకీయ నాయకులు మరియు మీడియా యొక్క అవకాశవాదం గురించి మాట్లాడాలి. ఈ మధ్య కాలములో వరుస పెట్టి వెలుగులోకి వచ్చిన కామన్ వెల్త్ , జీ మొ.గు కుంభకోణాలు వెలుగులోకి రావడం మరియు అందులో నిందితులు జైలుకి వెళ్ళడంలో సుప్రింకోర్టు యొక్క క్రియాశీలక పాత్ర ఉంది... ఆయితే ఈ చర్యల ద్వారా సుప్రీంకోర్టు పనితీరుని ఆకాశానికి ఎత్తేస్తున్న ప్రస్తుత రాజకీయ నాయకులు మరియు మీడియా వారే గతములో ఇదే కోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు పై అపేక్షణ వెలుబుచ్చిన సందర్బాలు చాలా ఉన్నాయి.

కాని మీడియా బుద్ది ఏమయింది??? మన రాష్ట్రంలో ఉన్న ప్రదాన మీడియా అంతా కూడా విలువలు వదిలేశాయి. ఇందులో సాక్షి గురించి మాట్లాడుకోకవడమే బెటరు. ఎందుకంటే దాని గురించి రాసి నా విలువైన టైమ్ వేస్ట్ చేసుకోదలచుకోలేదు. ఇక మిగిలిన ఈనాడు పేపరు పక్కా పక్షపాతంగా వ్యవహారిస్తున్నట్టు తెలిసిపోతుంది.. ఇది తెలుగు దేశము పార్టికి మద్దతుదారు అని ప్రజలందరికి తెలుసు.... నేను ఈ పేపరులో వచ్చిన ఆర్టికల్స్ చాలా సార్లు ఒక విషయమై పరస్పర విరుద్దముగా వార్తలు వెలువరించిన సందర్బాలు చూసాను.. జగన్ మరియు గాలి అవినీతి విషయములో ఈనాడు మీడియా చూపిస్తున్న అత్యుత్సహం ఎందుకో ప్రత్యేకముగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ నేను జగన్, గాలి అవినీతి వ్యవహారములను మాత్రమే ఈనాడు మీడియా హైలెట్ చేస్తుంది అని చెపుతున్నాను. నిజానికి ఇవే కాకుండా ఇంకా చాలా దేశియ వనరుల విచ్చలవిడి దోపిడి జరుగుతుంది. అది ఈనాడు మీడియాకు కూడా తెలుసు. కాని ఏనాడు వాటి గురించి ప్రచురించదు. ఈ విషయములో అది కూడా పక్షపాతముగా గిట్టనివారి గురించే ప్రముఖంగా ప్రచురిస్తుంది. నేను ఒకప్పుడు అంతర్జాతియ, దేశియ, ప్రాంతియ వార్తలు కోసము ఎక్కువగా ఈనాడు పేపరు మీదే ఆధారపడేవాడిని. కాని ఇప్పుడు వాటి యొక్క శాతము విపరీతముగా తగ్గిపోయింది. ఇప్పుడంతా తమకు నచ్చని వారి న్యూస్ ప్రచురించడానికే స్దానము సరిపోవడం లేదు.
ఇకపోతే మిగిలింది ఆంద్రజ్యోతి మీడియా... రాజు గారి మొదటి బార్య మంచిది అని అంటే, దానిని రాయడం మానేసి రాజు గారి రెండొ భార్య చెడ్డది అని వార్త రాసే చెత్త మీడియా.... ఆది ఎప్పుడు వార్తలను సంచలనాత్మకముగా ఎలా ప్రచురించాల అని అలోచిస్తుందే తప్ప ప్రజలకు సరయిన వివరములు తెలియజెప్పలన్న అలోచన దానికి ఎప్పుడూ ఉండదు.. ఎక్కడయినా ప్రముఖులతో ఇంటర్వూ తీసుకొన్నప్పుడు వారు చెప్పిన మంచి మాటలను హెడ్డింగ్ గా కాకుండా, అనుకోకుండా అన్న చిన్న చిన్న నెగెటివ్ మాటలనే కొంచెం మసాలా జోడించి దానిని హెడ్డింగ్ గా పెట్టేస్తారు. అదండి మన మీడియా వరుస.. వీరందరూ ప్రజలందరికి సరయిన సమాచారము ఇవ్వడం కోసము పనిచేయడం లేదు. యాక్చవల్ గా మీడియా ఏ విషయములోను పక్షపాత వైఖరి ఉండకూడదు. అది ఎప్పుడూ తటస్దంగా ఉండాలి.. ఏ విషయానైన్న సరే సాధారణ విషయముగానే పరిగణించి న్యూస్ ఇవ్వాలి.. అంతే కాని గిట్టని వారి మీద ఒకలా, నచ్చిన వారి మీద ఒకలా రాయడం శ్రేయస్కరం కాదు. లేకపోతే విశ్వసనీయత కోల్పోతారు. ఇప్పటికే మన మీడియా మీద చాలా మందికి ఉన్న ఒపెనీయన్ తెలిస్తే వారందరు ఉరేసుకు చావాలి. ఈ రోజు చాలా మంది వార్తలు తెలుసుకోవడం కోసము మిగతా దేశియ మీడియా మరియు దేశియా మీడియా మీద ఆధారపడుతున్నరన్న సంగతి తెలుసుకోవాలి. ఏ ప్రాంతియ మీడియాను వీరు విశ్వసించడం లేదన్నది సత్యం. మీరు రాసినదే వేదము అని నమ్మే వాళ్ళు తగ్గుతున్నారన్న వాస్తవం తెలుసుకోని మసలుకుంటే వాళ్ళకి మంచిది.

Tuesday, 13 September 2011
వేటాడుతున్న ప్రభుత్వం......
ఇక నుండి మనము బ్రతకడానికి డాలర్లు ఖర్చు చేయడానికి సిద్దముగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో బ్రతకలంటే మనకు రూపాయల్లో సంపాదన సరిపోదు.... ఖచ్చితముగా మనము డాలర్ల లెక్కలో సంపాదించవలసినదే... ఇప్పటికే అన్ని విధములుగా పెరిగిపోయిన ధరలతో డిలాపడిపోయిన సామాన్యుడుకి మరల ఎక్కడ రిలాక్స్ దొరుకుతుందో లేక డబ్బును ఎక్కడ స్విస్ బ్యాంకులకు తరలిస్తారో అని ప్రభుత్వం దీర్ఘాలోన చేసి నిత్యావసరలైన బియ్యం, పప్పులు, వంట గ్యాస్ తో సహ ప్రాణాధారమైన మందుల పై ఇప్పటి వరకు ఉన్న నాల్గు శాతం వ్యాట్ రేటును ఐదు శాతానికి గుట్టుచప్పుడు కాకుండా పెంచేసింది...
దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు వెయ్యి కోట్ల వరకు ఆదాయము సమకూరే అవకాశం ఉందని అంచనా... ఎందుకయ్యా సామాన్యులని ఇలా ఏడిపిస్తున్నారు అని ముఖ్యమంత్రులవారిని అడగడం పాపం, తప్పక పెంచవలసివచ్చినది, అనివార్యమైనదని కూల్ గా సెలవిచ్చారు... అదే అనివార్యం రైతుల పంటకు మద్దతు ధర పెంచకపోవడం, బడుగు జీవుల వేతనాల్లో పెంపు లేకపోవడం, ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిర్మూలించకపోవడం, పాలనలో పారదర్శకత లేకపోవడం వంటి వాటిలో చూపకపోవడమేమిటి??? ముందు ప్రజలకు ఆదాయాలకు ఎటువంటి డోకా లేకుండా చేస్తే, తద్వారా అదే ప్రజల నుండి పన్నుల రూపేణా ఆదాయమును ఆశించండం తప్పు కాకపోవచ్చు... కాని సామాన్యులను వారి దారికి వారిని వదిలేసి నచ్చినట్టు బాదేస్తే వారు ఎలా మనుగడ సాగించాలని ప్రభుత్వానికి వీసమొత్తు కూడా ఆలోచన రాకపోవడం ఏమనుకోవాలి. ఈ రోజు ప్రజల్లో సంపన్న వర్గం తప్ప ఏ వర్గం వారు కూడా నిక్షేపంగా మునుగడ సాగించలేకపోతున్నరనేది పచ్చి నిజము.. ఒక్కప్పుడు అత్మభిమానానికి ప్రతికగా నిలిచిన రైతు ఆరుగాలం పంటని పండించి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా అమ్ముకొని మిగిలిన దానితో అవసరమైతే ప్రక్కవాడికి సాయము చేస్తూ బ్రతికేవారు.. కాని అదే రైతు ఈ రోజు కాలము కలసిరాక, ప్రభుత్వాలు సాయము చేయక, తాను వేసిన పంటకు పెట్టిన పెట్టుబడి కూడా తెచ్చుకోలేక అత్యంత దౌర్బగస్దితిలో ఉంటే, కనీస కనికరము లేకుండా ప్రభుత్వం ఏ విధముగా పన్నులు రూపేణా బాదుడు వేయగలదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసినదేమిటంటే ఏ రోజు రైతు ప్రభుత్వాల మీద ఆధారపడలేదు..
మరియు ప్రభుత్వాలు రైతుకి ఎటువంటి సాయం చేయకపోయినా కీడు చేయడంలో మాత్రము అత్యుత్సహాము చూపించాయి. విత్తనాలు నుండి ఎరువులు వరకు ఏది కూడా రైతులకు అందజేయలేకపోయాయి. మరియు వ్యవసాయ సంబంధ వస్తువులన్నింటిని ఉత్పత్తి చేసే కంపెనీలకు, అయా ఉత్పత్తిలను ఎప్పటికప్పుడు క్రమము తప్పకుండా పెంచుకుంటు పోతున్న ప్రభుత్వాలు, ఆరుగాలము కష్టపడి పంటను పండించిన రైతు శ్రమను మాత్రము పెంచకుండా మోకాలు అడ్డుపెట్టీ దమననీతిని ప్రదర్శిస్తుంది.. ఇకపోతే మిగతా వారు చిరు వ్యాపారులు, శ్రమజీవులు, రోజుకూలీలు, ఉద్యోగులు మొదలైనవారు. వీరు కూడా అధికముగా శ్రమ దోపిడి గురవుతున్నారు. కాని దానికి తగ్గ వేతానాలు మాత్రము అందుకోలేకపోతున్నారు. యజామాన్యాలు ఇచ్చే జీతాలు సరిపోక, మరియు ఎప్పటికప్పుడు ధరలతో వేటాడుతున్న ప్రభుత్వాలతో పడలేక సంఘర్షణకి లోనువుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచే వేతానాలతో సమానముగానే బయట ధరలు కూడా పెరుగుతుండడంతో పెరుగుదలలో సౌలబ్యంను అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు చేసే అన్ని పనులు సంపన్న వర్గాలను ఇంకా అభివృద్ధి చేసే విధముగానే ఉన్నాయనేది కాదనలేని సత్యం......
పి.ఎస్.: ఏదో నాలో ఉన్న ఆవేదనంతటిని ఇలా వ్రాసాను కాని, ఎవరు పట్టించుకుంటారు చెప్పండి.....
Monday, 12 September 2011
తమిళ్ సినిమాలు అదురుతున్నాయి......


Subscribe to:
Posts (Atom)