Monday 25 July 2011

తెలంగాణా, సమైక్య రాజకీయనాయకులకు అభ్యర్జన.....

అన్నదమ్ముల్లా కలసి ఉండే మా మధ్య మాటల యుద్దం పెట్టడము మీకు భావ్యమా?
రాష్ట్రంలో చాలా మందికి ఇరుప్రాంతాల పట్ల ఎటువంటి బేదాబిప్రాయాలు లేవు....
ఉన్నదల్లా పనిలేని రాజకీయ నాయకులకు మాత్రమే.....
రాజకీయ నాయకుల సభ్యత లేని విమర్శల మూలంగా ఇరుప్రాంతాల ప్రజలు చాలా నామోషిగా ఫీలవుతున్నారు....
దాని పర్యవసానంగా తెలుగు బ్లాగర్లులు కూడా కొంచెం దూషణపరమైన అర్టికల్స్ ను ప్రచురిస్తున్నారు...
అది సరయిన పద్దతి కాదు....
ఇందుమూలముగా మొత్తము తెలుగు సోదరులకు తెలియజేసుకొనునది ఏమనగా....
దయచేసి ఇరుప్రాంతాల రాజకీయ నాయకులు చేసే దూషణలను ప్రామాణికంగా తీసుకొని ఎవరు ఉద్వేగాలకు లోను కావద్దని కోరుకుంటున్నాను.
ముఖ్యంగా తెలంగాణా వారు కోరుకుంటున్న ప్రత్యేక రాష్ట్రం కోరదగినదే.....
కాని దాని కోసము వారు ఎన్నుకొన్న కొన్ని పద్దతులు మిగతా ప్రాంతం వార్కి ఇబ్బందికరముగా ఉన్నాయి.....
తెలంగాణా వాదులకు:అందులో మొదటిది సీమాంద్రులు తెలంగాణాని దోచుకున్నారనడం...........
రాష్ట్ర రాజధాని హైదరబాద్ ప్రత్యేకముగా తెలంగాణాలో ప్రాంతమని దానిని కొల్లగొట్టి పట్టుకుపోదామని ఎవరు రాలేదు....
రాష్ట్రరాజధాని ఏ ఊరు ఉంటే దానికే మెజారిటి ప్రజలు జీవనోపాధి కోసము వెళతారు. అది ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంది.....
ఎక్కడివారైనా రాజధానిని తమ స్వంత ప్రాంతంగానే భావిస్తారు... ఆ ఉద్దేశంతోనే రాష్ట్రప్రజలందరూ రాజధాని బాట పట్టారు.....
దానిని తెలంగాణాను దోచేయడం అంటే ఎలా??
ఒకవేళ రాజధానిగా విజయవాడో లేక వైజాగో పెడితే మీరందరు ఇక్కడకు రారా?? ప్రభుత్వ కార్యాకలపాల కోసము మీ ప్రాంతియులు ఇక్కడకు రారా??
సినీపరిశ్రమ చైన్నై నుండి హైదరబాద్ కి పూర్తిస్దాయిలోకి రావడానికి ఎంత కాలము పట్టింది......
చైన్నై నుండి హైదరబాద్ కే రావడానికి కారణమేమిటి..... ఇది మా గడ్డ్ అనే ఫీలింగ్ వల్లే కదా...... ఇక్కడివారు అలా ఫీలవ్వడం మూలంగానే కదా అందరూ అక్కడ సెటిల్ అవ్వడానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు.....
సౌకర్యాలు బాగున్నాయని ఏ ముంబాయిలోనే, డిల్లిలోనే ఎందుకు పెట్టలేదు సినీ పరిశ్రమ మరియు యితర పరిశ్రమలను......
రెండోది. తెలంగాణా సాధన కోసం మిగతా ప్రాంతియుల మీద ద్వేషపూరిత వ్యాఖానాలు చేయడం.......
తెలంగాణా రాష్ట్రం కావాలనుకొంటే దానికి సవాలక్ష మార్గాలున్నాయి..... అంతే కాని మిగతా ప్రాంతాల వారిని దూషించడం ద్వారా ప్రత్యేక రాష్ట్రం ఎలా వస్తుందో చెప్పండి......
ప్రతి ఒక్కరికి అత్మాభిమానం ఉంటుంది...... అది గుర్తుకు పెట్టుకోవాలి.... ఎవరి ప్రాంతియ చరిత్ర వారికి ఉంటుంది...
తెలంగాణా, రాయలసీమ, కోస్తా వారికి వేర్వేరు అద్బుత చరిత్రలున్నాయి. ప్రతి గడ్డ మీద దేశము గర్వించదగ్గ మహనుభావులు మనుగడ సాగించారు.
ప్రాంతియ దూషణలు సంస్కారము అనిపించుకోవు......
సమైక్యవాదులకు:మొదటిది.. తెలంగాణా యాసను విమర్శించడం............
యాస అనేది ప్రాంతాల ఆధారముగా ఉంటుందన్న ఇంగీత జ్నానం కూడా లేకపోతే ఎలా.... ఏ ఒక్క ప్రాంతం వారు కూడా పూర్తి స్దాయి తెలుగు మాట్లాడలేరన్న సంగతి తెల్సుకోవాలి.
రెండవది.... బలిదానాల విషయములో నిర్లక్ష్య కామెంట్లు...
తెలంగాణా రాష్ట్ర సాధన కోసము బలిదానము చేసుకొన్న విద్యార్దులను పట్టించుకోకపోవడం....... ఎంత ఫీల్ లేకపోతే అంత బలమైన నిర్ణయం తీసుకుంటారో ఆలోచించండి......
మూడవది... లాబియింగ్ ద్వారా తెలంగాణాను అడ్దుకోవాలనుకోవడం.....
ఇది చాలా తప్పు. ఎందుకంటే వారు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆంత బలముగా కోరుకుంటున్నప్పుడు మనము ఎందుకు అడ్డుకోవాలి...
ప్రతి సమైక్యరాజకీయనాయకుడికి ఉన్న ఏకైక అభ్యంతరం రాజధాని విషయములోనే ఆయినప్పుడు ఆ విధముగా చర్చలు జరపచ్చు కదా..,..
సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగించే దమ్ము ఒక్క మగాడికి కూడా లేదా.....
ప్రతి తెలుగు వాడు ఒకసారి అలోచించండి......... మీకు కావలసినదేమిటొ తెలుసుకొండి.... దాని కోసము పోరాడండి... అంతేకాని దూషణపర్వములతో రణరంగం చేయవద్దు..... తెలుగు వారి ఐక్యతను చెడగొట్టవద్దు....

No comments:

Post a Comment