Wednesday 3 August 2011

భృష్టుపట్టిన రాజకీయాలు(తయారి: భారతీయ ప్రజల ద్వారా)...



కర్ణాటకలో తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని,రాజ్యాంగ స్పూర్తిని మంటగలిపేలా ఉన్నాయి. ప్రజాపాలకులు రాష్ట్ర అవసరములు, ప్రజల అవసరముల కోసము కాకుండా స్వంత అవసరములు కోసము రాజకీయక్రీడల్లో మునిగిపోవడం బహుశా మన దేశములోనే ఉంటుందేమో... లోకాయుక్త అభిశంసనతో బలవంతంగా పదవి త్యాగము చేయవలసి వచ్చిన యడ్యురప్ప, తదనంతరం జరిగిన సంఘటనలతో దేశములో తన రాష్ట్ర పరువు నవ్వులపాలవుతుందన్న ఇంగీత సృహ కూడా లేకుండా ఆడిన రాజకీయ క్రీడను జాతి జనులందరూ అస్యహించుకొనేలా చేసారు. కర్ణాటకలో భారతీయ జనతాపార్టి అధికారములోకి తీసుకురావడానికి యడ్యూరప్ప కృషిని మర్చిపోలేకపోవచ్చు.. అవకాశవాద రాజకీయాలతో విసిగిపోయిన కర్ణాటక వాసులు గత ఎలక్షన్ ల్లో నిబద్దత కల్గిన యడ్యూరప్పను గద్దెనెక్కించారు.. కాని ఆయన కూడా అవకాశవాద రాజకీయాలకు అతితుడుని కానని నిరూపించుకొన్నారు.. లోకాయుక్త అభిశంసన తర్వాత కూడా అధిష్టానం కోరితేనే కాని తనంతాట తాను రాజీనామాకు అంగీకరించని యడ్యూరప్ప భవిష్యత్తు రాజకీయ నాయకులకు ఎటువంటి సందేశం ఇవ్వదలచారు?? ఆ రాజీనామా చేయడానికి తనకు అమోద యెగ్యమైన డిమాండ్లును పెట్టడం ఏ విధముగా సహేతుకం.. కర్ణాటక పౌరుడిగా తన రాష్ట్రానికి ఎవరైతే తన తదనంతరం ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలో ఆలోచించడం మాని, తన స్వంత ప్రయోజనాలకు ఇబ్బంది కలగని రీతిలో నడిపిన రాజకీయ జూదం ఏ విధముగా సమర్దనీయము....ఈయన గారిది ఒకెత్తు అయితే గాలి సోదరులది ఇంకొకెత్తు... ఇప్పటి వరకు యడ్యూరప్ప వర్గంలో ఉన్న గాలి సోదరులు, ఆగ్రనేత అద్వాని జగదీష్ షెట్లర్ కి అనుకూలముగా ఉన్నారని తెలియగానే రాత్రికి రాత్రే అవతలి పక్షంలోకి ప్లేటు ఫిరాయించడం అవకాశరాజకీయాలలో పరాకాష్ఠకి అర్దం పడుతుంది... ఇలాంటి రాజకీయ నాయకులను ప్రజలు ఆదరించిన కాలము ఇలాంటి నీచరాజకీయాలను మనము భరించవలసియుంటుంది... ఏనాడైతే మనము మారాగలమో ఆ రోజే మన వ్యవస్దలో మార్పు రాగలదని ఖరాఖండిగా చెప్పగలను... ఈ అర్టికల్ చదివిన వారందరూ ఒక్కసారి ఆలోచించండి.... మీరు మీ రాజకీయ నాయకులను ఎన్నుకొనే ముందు భవిష్యతుని ఆలోచించండి... అంతేకాని పార్టి మీద అభిమానంతోనో, లేక ఆ వ్యక్తికి గల వ్యక్తిగత చరిష్మాతోనో ఓటు వేయవద్దు... ఏ పార్టి ఆయిన అతని నిజాయితిని అంచనా వేయండి..... మనము ఏ రోజయితే సరయిన నేతను ఎన్నుకోవాలని అనుకున్నామో, అటోమేటిక్ గా మిగతా ప్రాంతాలలో ఆ మార్పు తప్పక కనబడుతుంది.... ముందుగా మీ ప్రాంతంలో సరయిన నాయకుడ్ని ఎన్నుకొండి..... మీరు నిజాయితిగా ఉంటే, మిగతావారందరూ నిజాయితిగానే ఉంటారు..... ఆలోచించండి.... మనము నిజాయితిగా ఉండకుండా అవతలి వాడు నిజాయితిగా ఉండాలంటే అది మూర్ఖత్వమవుతుంది..... నాకు తెలిసి ఓటర్లలో చాలా మంది మనలాంటి యువకులే ఉంటారు..... మనలాంటి యువకులందరూ కలిస్తే ఈ దేశ భవిష్యతునే మార్చగలము.... దాని కోసము మనము మన వ్యక్తిగత త్యాగాలను బలిపెట్టవలసిన అవసరము లేదు..... సరయిన నాయకుడిని ఎన్నుకుంటే చాలు...... ప్రతి ఎలక్షన్ లోను ప్రధాన రాజకీయ పక్షాలతో బాటుగా ఎంతో కొంత మంది స్వతంత్రులు కూడా పోటి చేస్తారు.... ప్రదాన పక్షాలలో పోటి చేసే ఆభ్యర్దులు చాలా మంది అవినీతిపరులే ఆయి ఉంటారు.... అటువంటప్పుడు మిగతా స్వతంత్రులలో నిజాయితిపరుడ్ని ఎంచుకోవచ్చు.... ఉదహారణకు గత ఎలక్షన్ లో పోటి చేసిన లోక్ సత్తా పార్టి అభ్యర్దులను సమర్దించవచ్చు...... మిగతా వారితో పోల్చితే లోక్ సత్తాలో చదువుకొన్న మనలాంటి యువకులుండడం దానికి గల సానుకూలంశం...... ఏది ఏమైనా ఓటు వేసే ముందు మీ స్వలాభాల గురించి ఆలోచించడం మాని,  మీ ప్రాంత అభివృద్ధి గురించి అలోచించడం ఉత్తమ పౌరుడి లక్షణం.... మీరందరూ ఉత్తమ పౌరులనే నేను ఖచ్చితముగా నముతున్నాను.... అవినీతి లేని భారతదేశాన్ని నిర్మించండి.

ఆలోచించండి....... మీ కోసము కాదు.... మీ దేశ భవిష్యత్తు కోసము......


No comments:

Post a Comment