Wednesday 19 October 2011

సామాన్య ప్రజల ఆక్రోశం "వాల్ స్ట్రీట్ ముట్టడి" ...

అర్దిక మాంద్యం నేపధ్యంలో అమెరికా ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపణలు దేశ జనాభాలో ఉన్న ఒక్క శాతము ధనవంతులకు మాత్రమే ఉపయోగపడేలా ఉందని, మరియు అదే సమయములో మిగతా తొంబై తొమ్మిది శాతం ఉన్న సాధారణ ప్రజానీకానికి సబ్బిడిలో కోత విధించడం పై ఆ దేశ పౌరులు, వాల్ స్ట్రీట్ ముట్టడి పేరుతో స్టాక్ ఎక్సేంజ్ ని ముట్టడించి, అందలి కార్యకలాపాలకు అటంకం కల్గించారు. ఇందులో చెప్పుకోవలసిదేమిటంటే, ప్రభుత్వాలకు ప్రజలపై ఉన్న ఈ రకమైన వివక్ష ప్రపంచమంతా ఉన్నదే.... ముఖ్యంగా చెప్పాలంటే మన దేశములో ఎప్పటి నుండో ఈ రకమైన దోపిడి జరుగుతుంది... కాని మనవాళ్ళు ఏమి చేయలేక ఊరకుండిపోయారు. అమెరికాలో మాత్రం సదరు ధనిక, పేద తారతమ్యం పై తమ గళం విప్పారు. అర్దిక మాంద్యం అనేది ప్రభావం చూపినప్పుడు అది అందరి మీద ప్రభావం చూపుతుంది. అటువంటి సమయములో ప్రజలకు అర్దిక అసరాగా నిలబడవలసిన ప్రభుత్వాలు, విపణిలో తారాస్దాయిలో ఉన్న ధరలను అదుపు చేయడం మరియు జనాభాలో అధిక శాతమున్న సామాన్య ప్రజానీకానికి అర్దిక ఇబ్బందులు లేకుండా చూడడంలో సరయిన శ్రద్ద చూపడం లేదనేది సత్యం. కాని అతి తక్కువుగా ఉన్న ధనికుల ప్రయోజనాలను కాపాడడానికి మాత్రము ఎనలేని అత్రుత చూపుతున్నాయి. ఈ రకమైన వివక్షని సహించలేకనే అమెరికాలో వాల్ స్ట్రీట్ ముట్టడి జరిగింది. నేడు అది ప్రపంచ దేశాలన్నింటికి పాకి, నిరసనోద్యమాలు ఎక్కువవడానికి అవకాశము కల్పించింది. ఇకపోతే మన దేశములోని ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు. ఒక అర్దికవేత్త ప్రధాన మంత్రి అయితే, దేశ అర్దిక ప్రగతి అభివృద్ధి పధంలో దూసుకువెళ్ళుతుందనుకొని, తద్వారా ప్రజల తలసరి ఆదాయము పెరుగుతుందని అనుకొని, కాంగ్రెస్ పార్టికి పట్టం కట్టి నందుకు, దానికి ఆ పార్టి చేసిన చర్యలు దేశములో ఉన్న ప్రతి సామాన్యుడి గుండే మండకమానదు. 
 మన్మోహన్ సింగ్ ప్రధాని ఆయిన తర్వాత భారత వృద్ది రేటు పెరిగిందని, గొప్పులు చెప్పుకుంటున్న ప్రణాళిక సంఘం, అది ఎవరి బ్రతుకులు దుర్బరం చేసి వృద్ది రేటు పెంచగలిగారో మాత్రం తెలపలేదు.
దేశజనాభాలో అతి తక్కువగా గల కార్పోరేట్ల అదాయాలను గణనీయముగా పెంచడం ద్వారా, దేశ అర్దిక వృద్ధి రేటు బాగుందని చెపుతున్న వారు, మిగిలిన అత్యధిక శాతానికి చెందిన సామాన్య జనాల పరిస్దితిని మాత్రము గాలికొదిలేసారు. నాయకుల నయవంచితతనానికి ఏనాడో అలవాటు పడి పోయిన భారతీయులు, దీని పై పల్లెత్తు మాట అనకుండా, తమ పని తాము చేసుకుపోతున్నారు. మన ప్రభుత్వ విధానాల కారణాముగానే దేశములో ఉన్న ధనవంతులు, అత్యధిక ధనవంతులు కాగలిగారు. పేదవాడు, కటిక పేదవాడుగా మారిపోయాడు. పైగా పేదరికంతో ప్రభుత్వాలు ఆటలు కూడా చాలా నీచాతినీచముగా ఉన్నాయి. దానికి ఉదహరణగా మొన్న ప్రణాళిక సంఘం వారు మినియం అదాయము లెక్కలు ముప్పయి రెండు రూపాయలు (ఒకరోజుకి)గా లెక్కకట్టినప్పుడే తెలిసింది మన వాళ్ళ గొప్పతనమేంటొ. కాని మిగతా దేశాలలో మాత్రం, మనలా ఊరుకోకుండా, ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. సామాన్య జనాలు మార్పు కోరుకుంటే ఏమవుతుందో ట్యూనీషీయా, ఈజిప్టు, లిబియాలో జరిగిన పరిణామాల ద్వారా నిరూపించబడింది. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న వాల్ స్ట్రీట్ ముట్టడి, రేపు ఏ రకమైన పరిస్దితులకు దారితీస్తుందోనని ఒబామా అందోళన చెందుతున్నారు. అది ప్రస్తుతం మిగతా అభివృద్ది చెందిన దేశాలకు పాకింది. చూద్దాం ఇది ప్రపంచంలో ఏ మార్పులకు సంకేతమో........

No comments:

Post a Comment