నిన్నంతా టి.వి.లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా గురించే....
ఆ సినిమాలో తెలంగాణా ప్రజల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలున్నయనేది తెలంగాణావాదుల అరోపణ....
నేను ఇప్పటివరకూ ఆ సినిమా చూడలేదు....
ఆయినా, నాకు తెలియక అడుగుతాను... దెబ్బతిన్నది తెలంగాణా ప్రజల మనోభావాలా లేక తెలంగాణా నాయకుల (అని అనుకుంటున్న) మనోభావాలా??
తెలంగాణా ప్రజలు వేరు... తెలంగాణా పేరు చెప్పి దౌర్జన్యం చేస్తున్న నాయకులు వేరు....
వీళ్ళకి, వాళ్ళకి సంబంధమే లేదు. నిజానికి అక్కడ ప్రజలకు మిగతా ప్రాంతాల ప్రజల మీద ద్వేషమే లేదు. ఉన్నదల్లా నాయకులకే..... అదే విషయాన్ని సినిమాలొ చూపిస్తే తప్పేవరిది?
గుమ్మడికాయల దొంగలు ఎవరు బే? అని అడిగితే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది తెలంగాణా వాదుల నిర్వాకం...
వీరు నిజంగా తెలంగాణా ప్రజల కోసమే పనిచేస్తున్నారనుకుందాం.... మిగతా ప్రాంతాల వారిని ద్వేషించడం లేదు అనుకుందాం........ అలాంటప్పుడు వారు హిరోలుగా ఫీలవ్వాలి. కాని విలన్ మీద ఏవో సన్నివేశాలుంటే, వాటిని తమను ఉద్దేశించే తీసారని భావిస్తే, లోపం ఎవరిలో ఉన్నట్టు?
తాము నిజంగా సినిమాలో చూపించినట్టుగా లేక మాట్లాడినట్టుగా చేసియుండకపోతే, ఎవరినో ఉద్దేశించి అన్నట్టుగా అనుకోకుండా... మరల అక్కడ కూడా తెలంగాణా ట్యాగ్ లైన్ ఒకటి తగిలించి, రాద్దాంతం చేయడం వలన ఎవరికి నష్టం.....
ఆలోచించుకొండి తెలంగాణా రాజకీయనాయకులు.......
ఇరుప్రాంతాల ప్రజలు బాగానే ఉన్నారు. వారు గౌరవప్రదమైన తెలంగాణా రాష్ట్రంను కోరుకుంటున్నారన్న విషయమును మిగతా ప్రాంతీయులు కూడా గుర్తించారు...
కాని గుర్తించనది రాజకీయ నాయకులుగా చెలామణి ఆవుతున్న తెలంగాణావాదులే.....
ముందు మీరు హిరోలుగా ఫీలవ్వండి... విలన్ కి అపాదించిన లక్షణాలు తమకు కూడా పోల్చుకున్నారంటే ఇక్కడ ఎవరు వెదవలే ఆలోచించుకొండి....